వీడని మంచు.. నేడు 9 జిల్లాలకు హెచ్చరికలు
రాష్ట్రంలో మంచుతో ఇబ్బందులు కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటల వరకూ ఎండ కనిపించడం లేదు.
కొంధమాల్ జిల్లా తుమిడి బొంధొ రోడ్డులో గురువారం ఉదయం 8.30 గంటలకు కురుస్తున్న మంచు
గోపాలపూర్, న్యూస్టుడే: రాష్ట్రంలో మంచుతో ఇబ్బందులు కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటల వరకూ ఎండ కనిపించడం లేదు. గురువారం ఉత్తరకోస్తా, దక్షిణ జిల్లాల్లో మంచు కురిసినట్లు గోపాలపూర్ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి కె.ఎస్.మూర్తి ‘న్యూస్టుడే’కు చెప్పారు. ఈ పరిస్థితి శుక్రవారం కూడా ఉంటుందని, గంజాం, గజపతి, నయాగఢ్, ఖుర్దా, కొంధమాల్, కలహండి, అనుగుల్, ఢెంకనాల్, కటక్ జిల్లాలకు ‘ఎల్లో’ హెచ్చరికలు చేశామన్నారు. బొలంగీర్, సంబల్పూర్, సుందర్గఢ్, దేవ్గఢ్, కేంఝర్ జిల్లాల్లో పాక్షికంగా మంచు కురిసే సూచనలున్నాయన్నారు. బంగాళాఖాతం మీదుగా వీస్తున్న గాలుల్లో తేమ ఎక్కువగా ఉంటోందని, ఇది వాయుమండలాన్ని కప్పేస్తున్నందున మంచు కురుస్తున్నట్లు వివరించారు. రాష్ట్రానికి ఉత్తర దిశగా గాలుల తీవ్రత తగ్గినందున రాత్రి ఉష్ణోగ్రతలు పెరిగాయి. చలి తగ్గిందని చెప్పారు. గురువారం కొరాపుట్లో అత్యల్ప ఉష్ణోగ్రత 11 డిగ్రీలుగా నమోదుకాగా, మిగతా కేంద్రాల్లో 14 నుంచి 19 వరకు ఉన్నట్లు మూర్తి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లక్ష్మీపూర్లో త్రిముఖ పోరు
[ 18-04-2024]
కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ నియోజకవర్గంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాక ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. -
రెండుచోట్ల నవీన్ పోటీ
[ 18-04-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బొలంగీర్ జిల్లా కంటాబంజి, గంజాం జిల్లాలోని హింజిలి నుంచి ఈసారి అసెంబ్లీకి పోటీ చేస్తారు. బుధవారం తొమ్మిది శాసనసభ స్థానాలకు పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను ఆయన ప్రకటించారు. -
జగన్నాథుడా... నీల మాధవుడా!
[ 18-04-2024]
రాయగడ జిల్లా బిసంకటక్ శాసనసభ నియోజకవర్గ స్థానంలో ఆసక్తికరపోరు నెలకొంది. ఇక్కడి నుంచి ఇద్దరు జగన్నాథులు (జగన్నాథ సరక, జగన్నాథ నుండ్రుక), ఓ నీల మాధవుడు (నీలమాధవ్ హికాక) బరిలో ఉన్నారు. -
ప్రతికూలతలు అధిగమించి.. సివిల్స్లో ర్యాంకు సాధించి..
[ 18-04-2024]
‘యూపీఎస్సీ-2023’ పరీక్షల్లో జాతీయస్థాయిలో రెండో ర్యాంకు సాధించిన రాష్ట్ర యువకుడు అనిమేష్ ప్రధాన్ను రాష్ట్రపతి ద్రౌపదీముర్ము, ప్రధాని మోదీ, గవర్నరు రఘుబర్దాస్, సీఎం నవీన్లు ‘ఎక్స్’ సామాజిక మాధ్యమం ద్వారా అభినందించారు. -
ప్రజల గుండెచప్పుడు బిజుబాబు: నవీన్
[ 18-04-2024]
బిజుబాబు భౌతికంగా లేకపోయినా, రాష్ట్ర ప్రజల గుండె చప్పుడుగా అందరి హృదయాల్లో ఉన్నారని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అన్నారు. -
బిజద గూటికి చేరిన వెంటనే రాణికి టికెట్
[ 18-04-2024]
సంబల్పూర్ సిటింగ్ భాజపా ఎంపీ నితీష్ గంగదేవ్ భార్య అరుంధతీ దేవి, ఆమె పెద్దకుమారుడు నమన్ గంగదేవ్ మంగళవారం రాత్రి నవీన్ నివాస్లో సీఎం నవీన్ సమక్షంలో బిజదలో చేరారు. -
ప్రధాన పార్టీలకు అసంతృప్తుల బెడద
[ 18-04-2024]
కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్, పొట్టంగి, కొరాపుట్ నియోజకవర్గాల్లో టికెట్ దక్కని అసంతృప్త వర్గాలతో ప్రధాన పార్టీలకు తలనొప్పి వ్యవహారంగా మారింది.