సముద్ర జలాల కాలుష్యం నివారణకు చర్యలు అవసరం
ప్లాస్టిక్, పాలీథిన్ వ్యర్థాల వల్ల సాగర, నదీ జలాలు కలుషితమవుతున్నాయని, పర్యావరణ సమతౌల్యానికిది ముప్పుగా పరిణమిస్తున్నందున శాశ్వత చర్యలు అవసరమని సముద్ర అధ్యయన శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
వేదికపై వీసీలు ప్రతాప్, ప్రఫుల్ల, ప్రభాకర, డేవిడ్, డానియా
గోపాల్పూర్, న్యూస్టుడే: ప్లాస్టిక్, పాలీథిన్ వ్యర్థాల వల్ల సాగర, నదీ జలాలు కలుషితమవుతున్నాయని, పర్యావరణ సమతౌల్యానికిది ముప్పుగా పరిణమిస్తున్నందున శాశ్వత చర్యలు అవసరమని సముద్ర అధ్యయన శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. బ్రహ్మపుర విశ్వవిద్యాలయం (భంజవిహార్) సాగర అధ్యయన శాస్త్ర విభాగం, ఇంగ్లాండుకి చెందిన పర్యావరణ, జలచర విజ్ఞానకేంద్రం (సెఫస్) సంయుక్తంగా భంజవిహార్ సమావేశ మందిరంలో ‘సాగర సమతౌల్యానికి ప్లాస్టిక్ ముప్పు’ అన్న అంశంపై రెండు రోజుల శిక్షణ సదస్సు బుదవారం రాత్రి ప్రారంభమైంది. భంజవిహార్ వీసీ, సాగర అధ్యయన శాస్త్రవేత్త ఆచార్య ప్రతాప్కుమార్ మహంతి, కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఇటీవల ఆసియా ఖండంలోని ప్రముఖ చిలికా సరస్సు ప్రాంతాల్లో భంజవిహార్ సాగర అధ్యయన శాస్త్ర నిపుణుల బృందం 7 రోజులు పరిశీలించిందని, ఇక్కడ మైక్రో ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కడిక్కడ మేటలు వేసి ఉన్నాయన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బ్రహ్మపుర కళ్లికోట వర్సిటీ వీసీ ఆచార్య ప్రఫుల్ల కుమార్ మహంతి మాట్లాడుతూ... ఇటీవల కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీర రక్షణ, వ్యర్థాల తొలగింపు, ప్రజల్లో అవగాహన దిశగా కార్యక్రమాలు చేపడుతున్నా, సరిపోవడం లేదన్నారు. ముఖ్య వక్తగా చెన్నై తీర అధ్యయన కేంద్రం సంచాలకుడు ఆచార్య ప్రభాకర మిశ్ర మాట్లాడుతూ... పర్యావరణ కాలుష్యం ముప్పు సాగర జలాలకు చుట్టుముట్టిందని, జలాచరాలపై ప్రభావం పడుతున్నందున సమగ్ర కార్యాచరణ అమలు దిశగా ప్రభుత్వాలు, ఇతర సంస్థలు ముందుకు రావాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బిజద... రాజీనామాల బెడద
[ 24-04-2024]
గతంలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుత ఎన్నికల్లో బిజదలో అసంతృప్తి కనిపిస్తోంది. పిరాయింపుదారులకు అధినాయకత్వం టికెట్లు కేటాయించిందన్న అసహనం, అసంతృప్తి రాష్ట్రమంతటా ఉంది. సీనియర్ నాయకులు పార్టీకి రాజీనామాలు చేశారు. -
అనుభవజ్ఞులతో కొత్త అభ్యర్థుల ఢీ
[ 24-04-2024]
నవరంగపూర్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో అనుభవజ్ఞులతో కొత్త అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జిల్లాలో అన్ని పార్టీలు నూతన అభ్యర్థులను బరిలో నిలపడంతో పోటీ ఎలా ఉండబోతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. -
ముమ్మరంగా నామినేషన్ల దాఖలు
[ 24-04-2024]
కల తేదీలు దగ్గర పడుతున్న వేళ వివిధ పార్టీల నేతలు నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. అనుచరులు, నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీలు నిర్వహిస్తూ వెళ్లి తమ ఇష్టదైవాలకు ప్రార్థనలు చేసి తర్వాత నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. -
అందాల పిట్టలండీ.. సంఖ్య పెరిగేనండీ
[ 24-04-2024]
కేంద్రపడ జిల్లా బితరకనిక జాతీయ ఉద్యానవనంలో మడ అడవి పక్షుల (మేన్గ్రోవ్ పిట్ట) సంఖ్య పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే వీటి సంతతి 39 పెరగడం గమనార్హం. -
గోపాల్పూర్లో ముఖాముఖి పోరు
[ 24-04-2024]
ప్రతిష్ఠాత్మక గోపాల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బిజద, భాజపా అభ్యర్థుల మధ్య ఎన్నికల పోరు రసవత్తరంగా కనిపిస్తోంది. -
భాజపా గూటికి మరో ఇద్దరు అగ్రనేతలు
[ 24-04-2024]
మాజీ మంత్రి బింబాధర్ కువార్, బిజద మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి నివేదితా నాయక్ భాజపా గూటికి చేరారు. -
మిత్రమండలి కొత్త కార్యవర్గం ఎంపిక
[ 24-04-2024]
బ్రహ్మపురలోని సుమారు 80 ఏళ్ల పురాతన ‘ఆంధ్ర విజ్ఞాన మిత్ర మండలి’ కొత్త కార్యవర్గం ఎంపిక సోమవారం రాత్రి జరిగింది. -
ముగిసిన తరాతరిణి చైత్ర మంగళవారాల యాత్ర
[ 24-04-2024]
గంజాం జిల్లాలోని సుప్రసిద్ధ తరాతరిణి శక్తిపీఠంలో చైత్ర మంగళవారాల యాత్ర ముగిసింది. అయిదో మంగళవారం సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకూ భక్తుల రద్దీ కనిపించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం