సువర్ణరేఖ నదిపై వంతెన
బాలేశ్వర్ జిల్లా జలేశ్వర్ వద్ద సువర్ణరేఖ నదిపై వంతెన నిర్మాణమవుతుంది. రూ.101 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ పనుల టెండర్కు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది
మూడు జిల్లాలకు మంచినీటి ప్రాజెక్టులు
గ్రాంట్-ఇన్-ఎయిడ్ అధ్యాపకులకు వరాలు
నవీన్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు
జలేశ్వర్ (బాలేశ్వర్) వద్ద సువర్ణరేఖ నది
భువనేశ్వర్, న్యూస్టుడే: బాలేశ్వర్ జిల్లా జలేశ్వర్ వద్ద సువర్ణరేఖ నదిపై వంతెన నిర్మాణమవుతుంది. రూ.101 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ పనుల టెండర్కు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మూడేళ్లలో పనులు పూర్తవుతాయి. శనివారం మధ్యాహ్నం లోక్సేవా భవన్ వేదికగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అధ్యక్షతన ఏర్పాటైన క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను అభివృద్ధి కమిషనర్ ప్రదీప్ కుమార్ జెనా విలేకరులకు తెలియజేశారు.
క్యాన్సర్ రోగుల వసతికి
భువనేశ్వర్లో బగ్చీ, శంకర్ క్యాన్సర్ కేర్ ఆసుపత్రి నిర్మాణం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆవరణలో రోగుల వసతి కోసం విశాలమైన భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రెండెకరాల స్థలం ఉచితంగా కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఎస్ఈబీసీలోకి ఓబీసీ కులాలు
వెనుకబడిన కులాల (ఓబీసీ) జాబితాలో లేని 22 కులాల వారికి సామాజిక, ఆర్ధిక రంగాల్లో వెనుకబడిన క్యాటగిరి (ఎస్ఈబీసీ)లో చేరుస్తారు. దీనికి సంబంధించి ఓబీసీ చట్టంలో స్వల్ప సవరణలు చేయడానికి నిర్ణయించారు. జ్యుడీషియరీకి సంబంధించి ఓఎస్జే, ఓఎస్జేఎస్ విధానంలో స్వల్పంగా మార్పులు జరిగాయి. జీఎస్టీ, వాణిజ్య పన్నుల విభాగంలో డాటా ఎంట్రీ పోస్టుల భర్తీ చట్టంలో స్వల్ప సవరణలు చేస్తారు. ప్రభుత్వ శాఖల్లో గ్రూపు ‘బి’ పోస్టుల భర్తీలు, గనుల శాఖలో మరింత పారదర్శకత ధ్యేయంగా చట్టంలో సవరణలు చేసినట్టు చెప్పారు. క్యాబినెట్ సమావేశంలో 12 అంశాలపై కూలంకషంగా చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు.
మంచినీటి సరఫరాకు ప్రాధాన్యం
వేసవిలో ప్రజలు మంచినీటికి ఇబ్బందులు పడుతున్నారు. వసుధ, జల్ జీవన్, సుజల పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం మల్కాన్గిరి జిల్లాలోని మథిలి, ఖయిరాపుట్, కలిమెల, మల్కాన్గిరి సమితుల్లో నాలుగు మంచినీటి సరఫరా ప్రాజెక్టుల పనులు ప్రారంభమవుతాయని జెనా చెప్పారు. నయాగఢ్ జిల్లాలోని దసపల్లా, నువగాం, గొణియా సమితుల్లో, జాజ్పూర్ జిల్లా కొరై, బొరి సమితుల్లోనూ మంచినీటి సరఫరా పథకాల పనులు పూర్తవుతాయని తెలిపారు.
అధ్యాపకుల డిమాండు నెరవేరింది
రాష్ట్రంలోని గ్రాంట్-ఇన్-ఎయిడ్ కళాశాలల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పూర్తిస్థాయి వేతనాల కోసం ఎంతోకాలంగా ఉద్యమిస్తున్నారు. కొత్త సంవత్సర కానుకగా వారి డిమాండుకు ప్రభుత్వం ఆమోదించిందని, పెరిగిన జీతాలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయని, ప్రభుత్వంపై ఏడాదిలో రూ.290 కోట్ల అదనపు భారం పడుతోందని ప్రదీప్ కుమార్ జెనా తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నితీష్ గమ్యం ఎటువైపు?
[ 20-04-2024]
సంబల్పూర్ సిటింగ్ ఎంపీ నితీష్ గమ్యం ఎటువైపు? ఈసారి ఎన్నికల్లో ఆయన భార్య అరుంధతీ దేవి తరఫున ప్రచారం చేస్తారా? భాజపాకు అనుకూలంగా ఉంటారా? అన్నదిప్పుడు చర్చనీయాంశమైంది. -
కనుల పండువగా చైత్రోత్సవాలు
[ 20-04-2024]
శక్తి స్వరూపిణి, శాంతి స్వరూపిణి మజ్జిగౌరీ అమ్మవారి చైత్రోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. -
మౌలిక సౌకర్యాలకు దూరం.. ఎన్నికల బహిష్కరణ నిర్ణయం
[ 20-04-2024]
కొంధమాల్ జిల్లా బలిగుడ సమితిలో రుతుంగియా పంచాయతీలోని గగలిమహ, పనిపదర్, పాంగాబడి గ్రామాలకు రహదారులు, తాగునీరు, అంగన్వాడీ వంటి మౌలిక సౌకర్యాలు లేవు. -
మహిళా ఓటర్లే అత్యధికం
[ 20-04-2024]
రాష్ట్రంలో తొలివిడత ఎన్నికలు జరగనున్న నాలుగు లోక్సభ స్థానాల్లో పురుషులకంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) నికుంజ బిహారీ ధొళో అన్నారు. -
బ్రహ్మపురలో నామినేషన్ల పర్వం
[ 20-04-2024]
బ్రహ్మపుర సబ్కలెక్టరు కార్యాలయం, పరిసరాలు రెండోరోజు శుక్రవారం నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన అభ్యర్థులు, వారి మద్దతుదారులతో కిటకిటలాడింది. -
భాజపా మోదీ మంత్రం.. బిజద అభివృద్ధి అస్త్రం
[ 20-04-2024]
ప్రధాన పార్టీలు ఎన్నికల్లో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేస్తున్నాయి. మండుటెండలను కూడా లెక్క చేయకుండా ఓటర్ల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతున్నారు. రోడ్షోలు, పాదయాత్రలు, సభలు నిర్వహిస్తున్నారు. -
మహానదిలో పడవ మునక: ఇద్దరి దుర్మరణం
[ 20-04-2024]
ఝార్సుగుడ జిల్లా లఖన్పూర్ సమితి ఛత్తీస్గఢ్ సరిహద్దు శారదా వద్ద శుక్రవారం సాయంత్రం మహానదిలో పడవ మునిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. -
నిప్పుల కొలిమిలా రాష్ట్రం
[ 20-04-2024]
రాష్ట్రం నిప్పులకొలిమిలా మారింది. భానుని ప్రతాపంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తీర ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటాయి. -
చాకుతో దాడి: యువకుడి హతం
[ 20-04-2024]
గంజాం జిల్లా నిమ్మఖండి ఠాణా పరిధిలోని బొరిగావ్ గ్రామంలోని అమ్మవారి మందిరం సమీపాన చెరువు ఒడ్డున గురువారం సాయంత్రం సునీల్ దాస్ (27) అనే యువకుడు, మరో యువకుడి మధ్య పాతకక్షల నేపథ్యంలో వాగ్వాదం జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు
-
ఆ ప్రాజెక్ట్ వదులుకున్నా.. దీపిక నాకు థ్యాంక్స్ చెప్పాలి: కరీనాకపూర్
-
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
-
నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచించే నేత చంద్రబాబు : పవన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్