కవాతుకు ముగిసిన సాధన
బ్రహ్మపుర సబ్ డివిజనల్ స్థాయి గణతంత్ర దినోత్సవాల్లో కవాతులో పాల్గొనే బృందాల సాధన సోమవారం సాయంత్రం ముగిసింది.
వివిధ కళాశాలలు, పాఠశాలల కేడెట్లు
బ్రహ్మపుర నగరం, న్యూస్టుడే: బ్రహ్మపుర సబ్ డివిజనల్ స్థాయి గణతంత్ర దినోత్సవాల్లో కవాతులో పాల్గొనే బృందాల సాధన సోమవారం సాయంత్రం ముగిసింది. స్థానిక కళ్లికోట వర్సిటీ మైదానంలో నిర్వహించిన దీనికి పరేడ్ కమాండెంట్, రిజర్వు ఇన్స్పెక్టరు దిలీప్ బెహరా పర్యవేక్షించారు. సబ్ డివిజన్లోని పాఠశాలలు, కళాశాలలకు చెందిన 31 బృందాలు కవాతు సాధనలో పాల్గొన్నాయి. వీటితోపాటు పోలీసు, హోంగార్డు, పోలీసు బ్యాండు బృందాలు కూడా పాల్గొని సాధన చేశాయి. కొవిడ్ విజృంభణ సమయంలో స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల్లో కేడెట్ల కవాతుకు ప్రభుత్వం అనుమతించలేదు. కేవలం పోలీసు బృందం పాల్గొని ఆయా వేడుకలు నిరాడంబరంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. రెండేళ్ల తర్వాత ఈ నెల 26న గణతంత్ర దినోత్సవాల కవాతుకు మళ్లీ కేడెట్లను అనుమతించడంతో వారిలో ఉత్సాహం ఉరకలేస్తోంది.
సాధన చేస్తున్న కేడెట్లు
జయపురంలో..
జయపురం, న్యూస్టుడే: గణతంత్ర వేడుకల కోసం జయపురం పుడియా మైదానంలో వివిధ పాఠశాల, కళాశాలల ఎన్సీసీ, స్కౌట్ విద్యార్థులు మంగళవారం సాధన చేశారు. రెండేళ్ల తరువాత జరగనున్న వేడుకలు ఈ ఏడాది ఘనంగా నిర్వహించనున్నట్లు అధికారులు, ఎమ్మెల్యే తారాప్రసాద్ తెలిపారు. గురువారం జరిగే కవాతులో 48 బృందాలు పాల్గొననున్నట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధి కొనసాగుతుంది..శంక ద్వయాన్ని ఆశీర్వదించండి
[ 25-04-2024]
రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతుందని, బిజదను ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రజల్ని కోరారు. -
భాజపాకు 40 మంది స్టార్ ప్రచారకులు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాజపా స్టార్ ప్రచారకుల జాబితా మంగళవారం రాత్రి విడుదల చేశారు. -
ఇంకెన్నాళ్లీ దుస్థితి?
[ 25-04-2024]
అధ్వానంరాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలు అధ్వానంగా ఉన్నాయన్న నివేదికలు దిగజారిన ‘నాక్’ గ్రేడేషన్లు దుస్థితిని తెలియజేస్తున్నాయని కేంద్రమంత్రి నిలదీశారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో భర్తీకాని టీచింగ్ సిబ్బంది, అసౌకర్యాలు, ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల డ్రాపౌట్ల గురించి ఏం సమాధానం చెబుతారన్నారు. -
ఓ తండ్రి...ఇద్దరు కొడుకులు
[ 25-04-2024]
గత అయిదున్నర దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన నేత ఆయన. అన్ని పార్టీల నేతల మన్ననలు అందుకున్న వ్యక్తి. వయసుతోపాటు గౌరవం, నిక్కచ్చితనం పెంచుకున్న నికార్సయిన నేత. 80 ఏళ్ల వయసులో కొడుకు నిర్వాకంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
నామినేషన్ల సందడి
[ 25-04-2024]
బ్రహ్మపుర లోకసభ పరిధిలోని పర్లాఖెముండి నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిగా కోడూరు నారాయణరావు నామినేషన్ పత్రాన్ని సబ్ కలెక్టర్ అనూప్ పండాకు అందజేశారు. -
భాజపాలో సీమారాణి చేరిక
[ 25-04-2024]
బిజదకు రాజీనామా చేసిన హిందళ్ సిటింగ్ ఎమ్మెల్యే సీమారాణి నాయక్ బుధవారం భాజపాలో చేరారు. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, ఇతర నాయకులు ఆమెను స్వాగతించారు. -
నేడు అమిత్షా రాక
[ 25-04-2024]
కేంద్ర హోంమంత్రి అమిత్షా గురువారం రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. మధ్యాహ్నం సోన్పూర్లో ఏర్పాటయ్యే ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగిస్తారు. -
నా ఓటు.. నా బాధ్యత
[ 25-04-2024]
నా ఓటు నా బాధ్యత అంటూ, తప్పకుండా ఓటు వినియోగించుకుంటామని నూతన ఓటర్లు, కళాశాల విద్యార్థులన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?