అక్రమాలు నిజం... రాష్ట్రం పంపిన దస్త్రాలే ఆధారం
గనులశాఖలో అవినీతి జరిగిందని, ఇందుకు ఆధారాలున్నాయన్న తమ ఆరోపణలను గతంలో కొట్టి పారేసిన పాలకులు తర్వాత అవినీతి జరిగిందని కేంద్రానికి ఎలా లిఖితపూర్వకంగా తెలియజేశారని భువనేశ్వర్ ఎంపీ అపరాజిత షడంగి ప్రశ్నించారు.
భువనేశ్వర్ ఎంపీ అపరాజిత షడంగి
భువనేశ్వర్, న్యూస్టుడే
అపరాజిత షడంగి
గనులశాఖలో అవినీతి జరిగిందని, ఇందుకు ఆధారాలున్నాయన్న తమ ఆరోపణలను గతంలో కొట్టి పారేసిన పాలకులు తర్వాత అవినీతి జరిగిందని కేంద్రానికి ఎలా లిఖితపూర్వకంగా తెలియజేశారని భువనేశ్వర్ ఎంపీ అపరాజిత షడంగి ప్రశ్నించారు. మంగళవారం ఆమె భువనేశ్వర్లో విలేకరులతో మాట్లాడుతూ... తనకు కేంద్ర ఉక్కు, గనులశాఖ మంత్రి ప్రహ్లాద జోషి రాసిన లేఖ ప్రతులు చూపించారు. రాష్ట్ర ప్రభుత్వం గనులశాఖలో అక్రమాలు జరిగాయని అంగీకరించిన విషయాన్ని అంగీకరించిన విషయాన్ని వివరించారు. దీనిపై ఆమె మాట్లాడుతూ... 2021-22 ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు ఈ-వేలం ద్వారా గనులు కేటాయించారని, హైగ్రేడ్ ఖనిజాలు ఉన్నవాటిని లో గ్రేడ్గా ప్రకటించి తక్కువ ధరకు అప్పగించారని ఆరోపించారు. దీంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఖజానాలకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందన్నారు. దీనివల్ల గనులున్న జిల్లాలకు అభివృద్ధి నిధులు తగ్గిపోయాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని తాము పార్లమెంటులో ప్రస్తావించిన తర్వాత కేంద్రం రాష్ట్రానికి వివరణ అడగడంతో వాస్తవాలు బహిర్గతమయ్యాయని చెప్పారు. అవినీతి జరిగినట్లు ప్రభుత్వం అంగీకరించి కేంద్రానికి తెలియపరిచిందన్నారు. ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబీఎం) నిబంధనలకు రాష్ట్రంలో తూట్లు పడ్డాయన్న అపరాజిత పాలకులు దీనికి జవాబుదారీ అన్నారు.
కేంఝర్ జిల్లాలో గనులు
అక్రమాలు పునరావృతం కారాదు
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారుల జాబితా సిద్ధమవుతుండగా, మళ్లీ అనర్హులకు స్థానం కల్పిస్తున్నారని, ఇది వరకు జరిగిన తప్పిదాలు పునరావృతమవుతున్నాయని అపరాజిత చెప్పారు. బిజద పాలకులు స్వీయ ప్రచారానికి ఈ పథకాన్ని వినియోగించుకోకుండా పేద కుటుంబాలను జాబితాలో చేర్చి న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. ఎక్కడ పొరపాట్లు జరిగినా భాజపా విడిచిపెట్టదని, గట్టి నిఘా ఉందని, మళ్లీ బిజద కార్యకర్తలకు జాబితాలో చేర్చకుండా ప్రభుత్వం నిజాయతీగా వ్యవహరించాలని ఆమె డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధి కొనసాగుతుంది..శంక ద్వయాన్ని ఆశీర్వదించండి
[ 25-04-2024]
రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతుందని, బిజదను ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రజల్ని కోరారు. -
భాజపాకు 40 మంది స్టార్ ప్రచారకులు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాజపా స్టార్ ప్రచారకుల జాబితా మంగళవారం రాత్రి విడుదల చేశారు. -
ఇంకెన్నాళ్లీ దుస్థితి?
[ 25-04-2024]
అధ్వానంరాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలు అధ్వానంగా ఉన్నాయన్న నివేదికలు దిగజారిన ‘నాక్’ గ్రేడేషన్లు దుస్థితిని తెలియజేస్తున్నాయని కేంద్రమంత్రి నిలదీశారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో భర్తీకాని టీచింగ్ సిబ్బంది, అసౌకర్యాలు, ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల డ్రాపౌట్ల గురించి ఏం సమాధానం చెబుతారన్నారు. -
ఓ తండ్రి...ఇద్దరు కొడుకులు
[ 25-04-2024]
గత అయిదున్నర దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన నేత ఆయన. అన్ని పార్టీల నేతల మన్ననలు అందుకున్న వ్యక్తి. వయసుతోపాటు గౌరవం, నిక్కచ్చితనం పెంచుకున్న నికార్సయిన నేత. 80 ఏళ్ల వయసులో కొడుకు నిర్వాకంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
నామినేషన్ల సందడి
[ 25-04-2024]
బ్రహ్మపుర లోకసభ పరిధిలోని పర్లాఖెముండి నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిగా కోడూరు నారాయణరావు నామినేషన్ పత్రాన్ని సబ్ కలెక్టర్ అనూప్ పండాకు అందజేశారు. -
భాజపాలో సీమారాణి చేరిక
[ 25-04-2024]
బిజదకు రాజీనామా చేసిన హిందళ్ సిటింగ్ ఎమ్మెల్యే సీమారాణి నాయక్ బుధవారం భాజపాలో చేరారు. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, ఇతర నాయకులు ఆమెను స్వాగతించారు. -
నేడు అమిత్షా రాక
[ 25-04-2024]
కేంద్ర హోంమంత్రి అమిత్షా గురువారం రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. మధ్యాహ్నం సోన్పూర్లో ఏర్పాటయ్యే ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగిస్తారు. -
నా ఓటు.. నా బాధ్యత
[ 25-04-2024]
నా ఓటు నా బాధ్యత అంటూ, తప్పకుండా ఓటు వినియోగించుకుంటామని నూతన ఓటర్లు, కళాశాల విద్యార్థులన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)