ఆకట్టుకున్న గణతంత్ర వేడుకలు
భువనేశ్వర్లోని గాంధీమార్గ్లో గురువారం ఏర్పాటైన గణతంత్ర వేడుకలు అలరించాయి. గవర్నరు ఆచార్య గణేశీలాల్ ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జవానుల గౌరవ వందనం స్వీకరించారు.
పతాకావిష్కరణ చేసిన గణేశీలాల్
ప్రత్యేక ఆహ్వానితునిగా నవీన్ పట్నాయక్
వేదికపై గవర్నరుకు నమస్కరిస్తున్న నవీన్
భువనేశ్వర్, న్యూస్టుడే: భువనేశ్వర్లోని గాంధీమార్గ్లో గురువారం ఏర్పాటైన గణతంత్ర వేడుకలు అలరించాయి. గవర్నరు ఆచార్య గణేశీలాల్ ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జవానుల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితునిగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హాజరయ్యారు. ఉత్సవంలో 8 ప్రభుత్వశాఖలు సాధించిన ప్రగతిని తెలియజేసేలా శకటాలను ప్రదర్శించారు. 30 ప్లటూన్ల పోలీసు బలగాలు, అగ్నిమాపక, ఓడ్రాఫ్, ఎన్సీసీ, ఎన్నెస్సెస్ బృందాలు పాల్గొన్నాయి. తొలిసారిగా ఆంధ్రప్రదేశ్కు చెందిన పోలీస్ బెటాలియన్ జవానుల కవాతు ఆకర్షణీయంగా నిలిచింది. భువనేశ్వర్ మహర్షి విద్యా సంస్థల విద్యార్ధుల డేర్డెవిల్ షో అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. కొరాపుట్, గంజాం, కేంఝర్, సుందర్గఢ్, మయూర్భంజ్ జిల్లాల కళాకారుల జానపద నృత్యాలు, కటక్, పూరీ జిల్లాల ఒడిస్సీ, గొట్టిపువొ నాట్యాలు కళింగ వైభవాన్ని చాటాయి.కార్యక్రమంలో సురేష్ మహాపాత్ర్, అభివృద్ధి కమిషనర్ ప్రదీప్ కుమార్ జెనా, డీజీపీ సునీల్ బన్సల్, తదితర ఉన్నతాధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు.
సాంస్కృతిక బృందం ప్రదర్శన
ప్రభుత్వశాఖల శకటాల ప్రదర్శన
గాంధీ మార్గ్లో డేర్డెవిల్ షో
సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకోవాలి
కేడెట్ల నుంచి గౌరవవందనం స్వీకరిస్తున్న టి.ఆవో. చిత్రంలో సబ్కలెక్టరు కులకర్ణి, కమిషనర్ జెనా, ఎస్పీ శరవణ వివేక్
బ్రహ్మపుర బజారు, న్యూస్టుడే: బ్రహ్మపురలో గణతంత్ర వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక కళ్లికోట విశ్వవిద్యాలయం క్రీడామైదానంలో బ్రహ్మపుర సబ్కలెక్టరు కార్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటైన వేడుకల్లో ముఖ్యఅతిథిగా దక్షిణ మండల ఆర్డీసీ టి.ఆవో హాజరై జెండాను ఎగురవేశారు. అనంతరం ఎన్సీసీ, నేవల్, స్కౌట్స్,గైడ్స్, ఆర్మీ తదితర కేడెట్ల బృoదాల పరేడ్ను తిలకించి గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాన్ని అందరు గుర్తు చేసుకోవాలన్నారు. తర్వాత స్థానిక సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ స్కూల్, కేసీ పబ్లిక్ స్కూల్, న్యూ డీపాల్, సెయింట్ జేవియర్స్ కాన్వెంట్ స్కూల్, డీపాల్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన వ్యాయామ ప్రదర్శనలు, విన్యాసాలు అందర్నీ అలరించాయి. కవాతులో బ్రహ్మపుర సబ్డివిజనల్ స్థాయిలోనున్న 33 బృందాలు పాల్గొన్నాయి. కార్యక్రమంలో బ్రహ్మపుర సబ్కలెక్టరు అశుతోష్ కులకర్ణి, బీఈఎంసీ కమిషనర్ సొనాల్ జెనా, బ్రహ్మపుర ఎస్పీ శరవణ వివేక్ పాల్గొన్నారు. అంతకుముందు బ్రహ్మపుర ఎంపీ చంద్రశేఖరసాహు, ఎమ్మెల్యే బిక్రంకుమార్ పండా, బీఈఎంసీ మేయరు సంఘమిత్ర దొళాయి కాసేపు కార్యక్రమంలో పాల్గొని ఇతర కార్యక్రమాలకు వెళ్లారు.
కేసీ పబ్లిక్ స్కూల్ బాలికల ప్రదర్శన
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వారసులొచ్చారు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొంతమంది ప్రముఖ నాయకులు పోటీ నుంచి తప్పుకున్నారు. వారి భార్యలు, వారసులను బరిలోకి దించారు. బిజద, భాజపా, కాంగ్రెస్ పార్టీల నాయకత్వాలు వారికి అవకాశం కల్పించాయి. తండ్రులు, తల్లులు వారి తరుఫున ప్రచారం చేస్తున్నారు. -
కమిషనరేట్ ఆధ్వర్యంలో ‘హెర్’ టీం
[ 19-04-2024]
మహిళల్ని వేధించే వారి భరతం పట్టడానికి జంటనగరాల (భువనేశ్వర్, కటక్) కమిషనరేట్ యంత్రాంగం ‘హై ఎఫిషియన్సీ రెస్పాన్స్ (హెరా) టీం ఏర్పాటు చేసింది. -
సత్వర విద్యుత్తు సేవలకు ‘సంచార సబ్ స్టేషన్’లు
[ 19-04-2024]
వేసవిలో ప్రజలకు మరింత మెరుగైన విద్యుత్తు సేవలు అందించేందుకు, సరఫరాలో అంతరాయం ఏర్పడితే సత్వర సేవలకు ‘సంచార సబ్ స్టేషన్’లు సిద్ధం చేశామని విద్యుత్తు సరఫరా సంస్థ ‘టాటా పవర్ సదరన్ ఒడిశా డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్’ (టీపీఎస్ఓడీఎల్) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది -
జగన్నాథునికి రూ.2.51 కోట్ల విరాళం
[ 19-04-2024]
రిలయన్స్ గ్రూపు సంస్థల అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ బుధవారం పూరీ శ్రీక్షేత్రానికి వచ్చారు. జగన్నాథుని సన్నిధిలో పూజలు చేశారు. -
సచిదాస్ కన్నుమూత
[ 19-04-2024]
జత్రా పార్టీ (నాటకాలు) దర్శకునిగా, నటునిగా ఖ్యాతి గాంచిన సచిదాస్ (91) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అస్వస్థతతో కటక్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. -
ఎవరి ప్రయోజనాల కోసం రెండుచోట్ల పోటీ?
[ 19-04-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మళ్లీ రెండుచోట్ల పోటీకి సిద్ధమయ్యారు. దీనివల్ల ప్రజలకు ఒరిగేదేమిటని? ఈ పోటీ ఎవరి ప్రయోజనాల కోసమని? సార్వత్రిక ఎన్నికల తర్వాత మరో ఉప ఎన్నిక, వ్యయప్రయాసలు మినహా సాధించేదేమిటని విమర్శలు వినిపిస్తున్నాయి. -
నేటి నుంచి మజ్జిగౌరీ చైత్రోత్సవాలు
[ 19-04-2024]
రాయగడ ఉత్కళాంధ్రుల ఇలవేల్పు, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి మజ్జిగౌరీ అమ్మవారి చైత్రోత్సవ సంబరాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. -
‘శ్రేష్ఠ భారత్’ ఏర్పాటుకు అంతా సహకరించాలి
[ 19-04-2024]
‘శ్రేష్ఠ భారత్’ లక్ష్యంగా దేశంలోని అన్ని ప్రాంతాలు, వర్గాలు, అన్ని రంగాల సమగ్ర అభివృద్ధికి ప్రధాని మోదీ 2024 సంకల్ప పత్రం జారీ చేశారని, ప్రజలంతా సహకరించి, మరోసారి మోదీని ప్రధాని చేసేందుకు ముందుకు రావాలని బ్రహ్మపుర లోక్సభ భాజపా అభ్యర్థి ప్రదీప్ కుమార్ పాణిగ్రహి కోరారు -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
[ 19-04-2024]
గంజాం జిల్లా గొళంత్రా ఠాణా పరిధిలోని కొణిసి-తుళు మార్గంలో బుధవారం మధ్యాహ్నం రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొన్న దుర్ఘటనలో ఇద్దరు యువకులు ఎమ్కేసీజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్