స్వచ్ఛంద రక్తదానంపై చైతన్యానికి 21 వేల కి.మీ. పాదయాత్ర
రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి మరొకరి రక్తమే ప్రాణం నిలుపుతుంది.
బ్రహ్మపుర చేరుకున్న కిరణ్ వర్మ
బ్రహ్మపుర నగరం, న్యూస్టుడే: రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి మరొకరి రక్తమే ప్రాణం నిలుపుతుంది. ఈ నేపథ్యంలో స్వచ్ఛంద రక్తదానంపై ప్రజల్లో చైతన్యానికి న్యూ దిల్లీకి చెందిన కిరణ్ వర్మ అనే యువకుడు 21 వేల కి.మీ. పాదయాత్ర చేపటారు. ఈ క్రమంలో బుధవారం బ్రహ్మపుర చేరుకున్న వర్మ ‘ఈటీవీ భారత్’తో తన పాదయాత్ర గురించి వివరించారు. 2021 సంవత్సరం డిసెంబరు 28న త్రివేండ్రం (కేరళ)లో పాదయాత్ర ప్రారంభించానని, ఇంతవరకూ కేరళ, తమిళనాడు, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, పుదుచ్చేరి, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా పాదయాత్ర కొనసాగించి ఒడిశాలోని బ్రహ్మపురకు చేరుకున్నట్లు చెప్పారు. దారి పొడవునా వివిధ నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ప్రజలను కలిసి స్వచ్ఛంద రక్తదానంపై చైతన్యం కల్పించానని అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బిజద... రాజీనామాల బెడద
[ 24-04-2024]
గతంలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుత ఎన్నికల్లో బిజదలో అసంతృప్తి కనిపిస్తోంది. పిరాయింపుదారులకు అధినాయకత్వం టికెట్లు కేటాయించిందన్న అసహనం, అసంతృప్తి రాష్ట్రమంతటా ఉంది. సీనియర్ నాయకులు పార్టీకి రాజీనామాలు చేశారు. -
అనుభవజ్ఞులతో కొత్త అభ్యర్థుల ఢీ
[ 24-04-2024]
నవరంగపూర్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో అనుభవజ్ఞులతో కొత్త అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జిల్లాలో అన్ని పార్టీలు నూతన అభ్యర్థులను బరిలో నిలపడంతో పోటీ ఎలా ఉండబోతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. -
ముమ్మరంగా నామినేషన్ల దాఖలు
[ 24-04-2024]
కల తేదీలు దగ్గర పడుతున్న వేళ వివిధ పార్టీల నేతలు నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. అనుచరులు, నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీలు నిర్వహిస్తూ వెళ్లి తమ ఇష్టదైవాలకు ప్రార్థనలు చేసి తర్వాత నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. -
అందాల పిట్టలండీ.. సంఖ్య పెరిగేనండీ
[ 24-04-2024]
కేంద్రపడ జిల్లా బితరకనిక జాతీయ ఉద్యానవనంలో మడ అడవి పక్షుల (మేన్గ్రోవ్ పిట్ట) సంఖ్య పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే వీటి సంతతి 39 పెరగడం గమనార్హం. -
గోపాల్పూర్లో ముఖాముఖి పోరు
[ 24-04-2024]
ప్రతిష్ఠాత్మక గోపాల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బిజద, భాజపా అభ్యర్థుల మధ్య ఎన్నికల పోరు రసవత్తరంగా కనిపిస్తోంది. -
భాజపా గూటికి మరో ఇద్దరు అగ్రనేతలు
[ 24-04-2024]
మాజీ మంత్రి బింబాధర్ కువార్, బిజద మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి నివేదితా నాయక్ భాజపా గూటికి చేరారు. -
మిత్రమండలి కొత్త కార్యవర్గం ఎంపిక
[ 24-04-2024]
బ్రహ్మపురలోని సుమారు 80 ఏళ్ల పురాతన ‘ఆంధ్ర విజ్ఞాన మిత్ర మండలి’ కొత్త కార్యవర్గం ఎంపిక సోమవారం రాత్రి జరిగింది. -
ముగిసిన తరాతరిణి చైత్ర మంగళవారాల యాత్ర
[ 24-04-2024]
గంజాం జిల్లాలోని సుప్రసిద్ధ తరాతరిణి శక్తిపీఠంలో చైత్ర మంగళవారాల యాత్ర ముగిసింది. అయిదో మంగళవారం సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకూ భక్తుల రద్దీ కనిపించింది.