logo

ట్రై సైకిల్‌పై దిల్లీ బయల్దేరిన దివ్యాంగుడు

కటక్‌లోని బంసుగల్లి ప్రాంతానికి చెందిన దివ్యాంగుడైన మెకానిక్‌ షేక్‌ రెహమాన్‌ ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకునేందుకు గురువారం ట్రైసైకిల్‌పై దిల్లీ బయలుదేరాడు.

Published : 27 Jan 2023 01:49 IST

షేక్‌ రెహమాన్‌

కటక్‌, న్యూస్‌టుడే: కటక్‌లోని బంసుగల్లి ప్రాంతానికి చెందిన దివ్యాంగుడైన మెకానిక్‌ షేక్‌ రెహమాన్‌ ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకునేందుకు గురువారం ట్రైసైకిల్‌పై దిల్లీ బయలుదేరాడు. కటక్‌ ఒడియా బజార్‌ ప్రాంతంలోని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ స్మారక గృహం నుంచి ప్రయాణం ప్రారంభించారు. భాజపా కటక్‌ జిల్లా అధ్యక్షుడు లలాటేందు బడు జెండా ఊపి ఆయన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా షేక్‌ రెహమాన్‌ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ దేశ గౌరవాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారని, ఒడిశాలో దివ్యాంగుల కోసం ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించడం లేదని, వారిని ఆదుకోవాలని ప్రధానిని కోరేందుకు వెళుతున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని