తం సూర్యం ప్రణమామ్యహం
మానవాళికి, జీవకోటికి ఆయురారోగ్యాలు ప్రసాదించే ఆదిత్యుని జయంతి (రథసప్తమి) పర్వదినాన్ని పురస్కరించుకొని పూరీ జిల్లాలోని విశ్వవిఖ్యాత సూర్యనారాయణ.
నేడు రథసప్తమి... కోణార్క్, గోపాల్పూర్లో విస్తృత ఏర్పాట్లు
విశ్వవిఖ్యాత బ్లాక్ పగోడా కోణార్క్ సూర్యనారాయణ మూర్తి ఆలయం
గోపాల్పూర్, న్యూస్టుడే: మానవాళికి, జీవకోటికి ఆయురారోగ్యాలు ప్రసాదించే ఆదిత్యుని జయంతి (రథసప్తమి) పర్వదినాన్ని పురస్కరించుకొని పూరీ జిల్లాలోని విశ్వవిఖ్యాత సూర్యనారాయణ మూర్తి కోణార్క్ ఆలయానికి శనివారం వేల సంఖ్యలో భక్తులు వస్తారు. మాఘశుక్ల సప్తమి సూర్యోపాసన రోజు. కోణార్క్ చేరువలోని చంద్రభాగ తీరంలో పవిత్ర స్నానాలు చేసి భక్తులంతా ఆ స్వామిని ఆరాధిస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న పూరీ జిల్లా యంత్రాంగం కోణార్క్లో భద్రత కట్టుదిట్టం చేసింది. కొవిడ్ వల్ల రథసప్తమి స్నానాలు, పూజలకు రెండేళ్లు దూరమైన వారంతా ఈసారి వేడుకల్లో పాల్గొననున్నారు. గంజాం జిల్లాలోని గోపాల్పూర్ తీరంలోనూ రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని పవిత్ర స్నానాలు, పూజలు చేయనున్నారు. పోలీసు యంత్రాంగం గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మండే ఎండలో ప్రచారం... పదవి కోసం సాహసం
[ 18-04-2024]
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటాయి. ఎన్నికల ప్రచారం చేసే నేతలు, కార్యకర్తలు అప్రమత్తం కావాలని వాతావరణ అధ్యయన శాఖ (ఐఎండీ) యంత్రాంగం హెచ్చరిస్తోంది. వీటిని ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. -
ఒకేరోజు నేత్రోత్సవం, రథయాత్ర
[ 18-04-2024]
విశ్వప్రసిద్ధ పూరీ జగన్నాథుని రథయాత్ర నిర్వహణ ఈసారి యంత్రాంగానికి పరీక్ష కానుంది. జులై 7న పురుషోత్తముని నేత్రోత్సవం (నవయవ్వన దర్శనం), అదేరోజు రథయాత్ర నిర్వహించాల్సి ఉంది. -
లక్ష్మీపూర్లో త్రిముఖ పోరు
[ 18-04-2024]
కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ నియోజకవర్గంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాక ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. -
రెండుచోట్ల నవీన్ పోటీ
[ 18-04-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బొలంగీర్ జిల్లా కంటాబంజి, గంజాం జిల్లాలోని హింజిలి నుంచి ఈసారి అసెంబ్లీకి పోటీ చేస్తారు. బుధవారం తొమ్మిది శాసనసభ స్థానాలకు పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను ఆయన ప్రకటించారు. -
జగన్నాథుడా... నీల మాధవుడా!
[ 18-04-2024]
రాయగడ జిల్లా బిసంకటక్ శాసనసభ నియోజకవర్గ స్థానంలో ఆసక్తికరపోరు నెలకొంది. ఇక్కడి నుంచి ఇద్దరు జగన్నాథులు (జగన్నాథ సరక, జగన్నాథ నుండ్రుక), ఓ నీల మాధవుడు (నీలమాధవ్ హికాక) బరిలో ఉన్నారు. -
ప్రతికూలతలు అధిగమించి.. సివిల్స్లో ర్యాంకు సాధించి..
[ 18-04-2024]
‘యూపీఎస్సీ-2023’ పరీక్షల్లో జాతీయస్థాయిలో రెండో ర్యాంకు సాధించిన రాష్ట్ర యువకుడు అనిమేష్ ప్రధాన్ను రాష్ట్రపతి ద్రౌపదీముర్ము, ప్రధాని మోదీ, గవర్నరు రఘుబర్దాస్, సీఎం నవీన్లు ‘ఎక్స్’ సామాజిక మాధ్యమం ద్వారా అభినందించారు. -
ప్రజల గుండెచప్పుడు బిజుబాబు: నవీన్
[ 18-04-2024]
బిజుబాబు భౌతికంగా లేకపోయినా, రాష్ట్ర ప్రజల గుండె చప్పుడుగా అందరి హృదయాల్లో ఉన్నారని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అన్నారు. -
బిజద గూటికి చేరిన వెంటనే రాణికి టికెట్
[ 18-04-2024]
సంబల్పూర్ సిటింగ్ భాజపా ఎంపీ నితీష్ గంగదేవ్ భార్య అరుంధతీ దేవి, ఆమె పెద్దకుమారుడు నమన్ గంగదేవ్ మంగళవారం రాత్రి నవీన్ నివాస్లో సీఎం నవీన్ సమక్షంలో బిజదలో చేరారు. -
ప్రధాన పార్టీలకు అసంతృప్తుల బెడద
[ 18-04-2024]
కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్, పొట్టంగి, కొరాపుట్ నియోజకవర్గాల్లో టికెట్ దక్కని అసంతృప్త వర్గాలతో ప్రధాన పార్టీలకు తలనొప్పి వ్యవహారంగా మారింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
-
విధుల్లో అలసత్వం.. ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా