నిస్వార్థ సేవకు సత్కారం
చాలా కాలం క్రితం ఒక వ్యక్తి వంశధార నది తీరానికి సేద తీరేందుకు వెళ్లాడు. ప్రశాంతత విషయం పక్కన పెడితే అక్కడ చెత్తాచెదారం, మానవ వ్యర్థాలు, నీటి కలుషితం చూసి ఆవేదన చెందాడు.
వంశధార నది తీరంలో చీపురుతో ఊడుస్తున్న సారథి
గుణుపురం, నూస్టుడే: చాలా కాలం క్రితం ఒక వ్యక్తి వంశధార నది తీరానికి సేద తీరేందుకు వెళ్లాడు. ప్రశాంతత విషయం పక్కన పెడితే అక్కడ చెత్తాచెదారం, మానవ వ్యర్థాలు, నీటి కలుషితం చూసి ఆవేదన చెందాడు. ఆ క్షణమే తీరాన్ని శుభ్రంగా ఉంచాలని నిర్ణయించాడు. పదేళ్లుగా ప్రతీ రోజు తీరాన్ని శుభ్రం చేయడం ఒక పనిగా పెట్టుకుని, ప్రజల్లోనూ చైతన్యం కల్పించాడు.. అతడే సారథి శ్రీరాం. దళిత కుటుంబానికి చెందిన సారథి రోజూ తీరాని వెళ్లి శుభ్రం చేస్తారు. తీరంలో మలమూత్రాలు విసర్జిస్తే ఏ మాత్రం సంశయించకుండా వాటిని గొయ్యి తీసి కప్పుతారు. కొన్ని నెలల కిందట తీరంలో బెంచీలు ఏర్పాటు చేయడంతోపాటు మొక్కలు కూడా నాటారు. ఈయన చేస్తున్న నిస్వార్థ సేవను మెచ్చి యంత్రాంగం, పలువురు గతంలో సత్కారించారు. శుక్రవారం కటికా వీధికి చెందిన యువత ఘనంగా సన్మానించింది. నిరుపేద అయిన సారథి సేవకు డబ్బుతో పని లేదని చెబుతూనే పదిమందికి స్ఫూర్తిదాయకంగా మారాడని పలువురు అభినందిస్తున్నారు.
సత్కరిస్తున్న యువత, పెద్దలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
71 అసెంబ్లీ స్థానాలకు పోటీచేసేది వీరే..
[ 28-03-2024]
ముఖ్యమంత్రి, బిజద అధినేత నవీన్ పట్నాయక్ బుధవారం మధ్యాహ్నం వీడియో సందేశం ద్వారా 71 మందితో అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా స్వయంగా ప్రకటించారు. -
బిజద లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
[ 28-03-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 21 లోక్సభ స్థానాలకుబుధవారం 15 మందితో తొలి జాబితా ప్రకటించారు. వీరిలో ఇద్దరు మహిళలున్నారు. -
దాహం కేకలు
[ 28-03-2024]
రాయగడ జిల్లాలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. గుక్కెడు నీళ్ల కోసం ప్రజలు కటకటలాడుతున్నారు. -
తండ్రి ‘హస్తం’ కాదని... ‘శంఖం’ పిడికిట పట్టుకొని..
[ 28-03-2024]
సీనియర్ కాంగ్రెస్ నేత, ఖుర్దా జిల్లా జట్నీ ఎమ్మెల్యే సురేష్ రౌత్రాయి చిన్న కుమారుడు కెప్టెన్ మన్మధ రౌత్రాయి బుధవారం బిజదలో చేరారు. -
బస్సు బోల్తా: ఒకరి మృతి, 20 మందికి గాయాలు
[ 28-03-2024]
కొరాపుట్ నుంచి రాయగడకు వెళ్లే మార్గంలో పొడఘడ్ వద్ద మంగళవారం రాత్రి బస్సు బోల్తాపడడంతో ఒకరు మృతి చెందగా, 20 మందికి గాయాలయ్యాయి. -
చిట్ పేరిట రూ. 2 కోట్లకుపైగా టోకరా
[ 28-03-2024]
చిట్ఫండ్ పేరిట ఓ మహిళ రూ.2 కోట్లకుపైగా టోకరా వేసిన ఉదంతం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. -
ఆహుతవుతున్న పచ్చదనం
[ 28-03-2024]
రాష్ట్రంలో పచ్చదనం అగ్నికి ఆహుతవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2030 నాటికి అడవులకు నిప్పు ఘటనలు మరింత తీవ్ర రూపం దాల్చనున్నట్లు అధ్యయనాలు పేర్కొంటుండడం గుబులు రేపుతోంది. -
కేజ్రీవాల్పై కుట్ర పన్నారు
[ 28-03-2024]
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై కుట్ర పన్ని, తప్పుడు కేసులో అరెస్టు చేసి, అన్యాయంగా జైల్లో పెట్టారని ఆప్ నాయకులు ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య