బ్రహ్మపురలో కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’
‘ఒడిశా సంకల్పం.. కాంగ్రెస్సే ప్రత్యామ్నాయం’ నినాదంతో రాష్ట్రంలో చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ శనివారం బ్రహ్మపురలో సాగింది.
పాదయాత్రలో పీసీసీ అధ్యక్షుడు శరత్ పట్నాయక్, పార్టీ నాయకులు, కార్యకర్తలు
బ్రహ్మపుర నగరం, న్యూస్టుడే: ‘ఒడిశా సంకల్పం.. కాంగ్రెస్సే ప్రత్యామ్నాయం’ నినాదంతో రాష్ట్రంలో చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ శనివారం బ్రహ్మపురలో సాగింది. ఉదయం అస్కా రోడ్డు మొదటి గేటు నుంచి మొదలైన యాత్ర మధ్యాహ్నం నగర శివారున అంబపువా వద్ద ముగిసింది. కార్యక్రమంలో పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు శరత్ పట్నాయక్ విలేకరులతో మాట్లాడారు. 2014 ఎన్నికల సమయంలో ప్రజలకు హామీలిచ్చిన భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించిందన్నారు. నల్లధనాన్ని వెనక్కు రప్పించి, ప్రతీ ఒక్కరి బ్యాంకు ఖాతాకు రూ.15 లక్షల జమ, 2 కోట్ల ఉద్యోగాల హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ధరల నియంత్రణ ఊసేలేదన్నారు. రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 22 ఏళ్లపాటు బిజద అధికారంలో ఉందని, ఒడిశా మరింత పేద రాష్ట్రంగా మారిందన్నారు. లక్షలాది మంది యువత ఉపాధి కోసం రాష్ట్రేతర ప్రాంతాలకు వలసపోతున్నారని, వారి భవిత నాశనమైందని పట్నాయక్ దుయ్యబట్టారు. పాదయాత్రలో కాంగ్రెస్ నాయకులు బందితా పరిడా, మాజీ మంత్రి జుధిష్ఠర జెనా, హలధర కార్జి, రశ్మిరంజన్ పట్నాయక్, త్రినాథ బెహర, పీతబాస పండా, బనజా పండా, సనాతన్ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మపుర సమీప ప్రాంతాల్లో జరిగిన పాదయాత్రలో డీసీసీ అధ్యక్షుడు, సన్నొఖెముండి ఎమ్మెల్యే రమేష్చంద్ర జెనా పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ఆ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నగరంలోని ఓ ప్రాంతంలో అంబులెన్స్ ట్రాఫిక్లో చిక్కుకుందంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బిజద... రాజీనామాల బెడద
[ 24-04-2024]
గతంలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుత ఎన్నికల్లో బిజదలో అసంతృప్తి కనిపిస్తోంది. పిరాయింపుదారులకు అధినాయకత్వం టికెట్లు కేటాయించిందన్న అసహనం, అసంతృప్తి రాష్ట్రమంతటా ఉంది. సీనియర్ నాయకులు పార్టీకి రాజీనామాలు చేశారు. -
అనుభవజ్ఞులతో కొత్త అభ్యర్థుల ఢీ
[ 24-04-2024]
నవరంగపూర్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో అనుభవజ్ఞులతో కొత్త అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జిల్లాలో అన్ని పార్టీలు నూతన అభ్యర్థులను బరిలో నిలపడంతో పోటీ ఎలా ఉండబోతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. -
ముమ్మరంగా నామినేషన్ల దాఖలు
[ 24-04-2024]
కల తేదీలు దగ్గర పడుతున్న వేళ వివిధ పార్టీల నేతలు నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. అనుచరులు, నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీలు నిర్వహిస్తూ వెళ్లి తమ ఇష్టదైవాలకు ప్రార్థనలు చేసి తర్వాత నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. -
అందాల పిట్టలండీ.. సంఖ్య పెరిగేనండీ
[ 24-04-2024]
కేంద్రపడ జిల్లా బితరకనిక జాతీయ ఉద్యానవనంలో మడ అడవి పక్షుల (మేన్గ్రోవ్ పిట్ట) సంఖ్య పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే వీటి సంతతి 39 పెరగడం గమనార్హం. -
గోపాల్పూర్లో ముఖాముఖి పోరు
[ 24-04-2024]
ప్రతిష్ఠాత్మక గోపాల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బిజద, భాజపా అభ్యర్థుల మధ్య ఎన్నికల పోరు రసవత్తరంగా కనిపిస్తోంది. -
భాజపా గూటికి మరో ఇద్దరు అగ్రనేతలు
[ 24-04-2024]
మాజీ మంత్రి బింబాధర్ కువార్, బిజద మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి నివేదితా నాయక్ భాజపా గూటికి చేరారు. -
మిత్రమండలి కొత్త కార్యవర్గం ఎంపిక
[ 24-04-2024]
బ్రహ్మపురలోని సుమారు 80 ఏళ్ల పురాతన ‘ఆంధ్ర విజ్ఞాన మిత్ర మండలి’ కొత్త కార్యవర్గం ఎంపిక సోమవారం రాత్రి జరిగింది. -
ముగిసిన తరాతరిణి చైత్ర మంగళవారాల యాత్ర
[ 24-04-2024]
గంజాం జిల్లాలోని సుప్రసిద్ధ తరాతరిణి శక్తిపీఠంలో చైత్ర మంగళవారాల యాత్ర ముగిసింది. అయిదో మంగళవారం సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకూ భక్తుల రద్దీ కనిపించింది.