logo

ఆదిత్యాయ నమోనమః

భాస్కరాయ నమోనమః అన్న ప్రార్ధనలతో శనివారం ఉషోదయపు వేళ గోపాల్‌పూర్‌ సాగర తీరం అలరారింది.

Updated : 29 Jan 2023 06:42 IST

గోపాల్‌పూర్‌లో రథసప్తమి వేడుకలు

భానునికి సామూహిక ప్రార్ధనలు

గోపాల్‌పూర్‌, న్యూస్‌టుడే: భాస్కరాయ నమోనమః అన్న ప్రార్ధనలతో శనివారం ఉషోదయపు వేళ గోపాల్‌పూర్‌ సాగర తీరం అలరారింది. మాఘ శుక్ల(రథ) సప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని వేలాదిగా భక్తులు పవిత్ర స్నానాలు చేసి ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ మూర్తికి పూజలు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు తీరం వద్ద ఇసుక తిన్నెల్లో మట్టి కుండల్లో స్వామికి ప్రీతికరమైన పొంగళి వండి అర్ఘ్యమిచ్చి తర్వాత అర్పణ చేశారు. కొంతమంది పితృదేవతల (దివంగతలు)కు పిండ ప్రదానాలు, అస్థికల నిమజ్జనం చేశారు. ప్రత్యేక బస్సుల్లో తెల్లవారుజాము నుంచే యాత్రికులు చేరుకోగా, బీచ్‌ రోడ్‌ కిటకిటలాడింది. పోలీసు యంత్రాంగం, అగ్నిమాపక జవానులు, లైఫ్‌ గార్డులు తీరం వద్ద భద్రతా చర్యలు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని