ఆదిత్యాయ నమోనమః
భాస్కరాయ నమోనమః అన్న ప్రార్ధనలతో శనివారం ఉషోదయపు వేళ గోపాల్పూర్ సాగర తీరం అలరారింది.
గోపాల్పూర్లో రథసప్తమి వేడుకలు
భానునికి సామూహిక ప్రార్ధనలు
గోపాల్పూర్, న్యూస్టుడే: భాస్కరాయ నమోనమః అన్న ప్రార్ధనలతో శనివారం ఉషోదయపు వేళ గోపాల్పూర్ సాగర తీరం అలరారింది. మాఘ శుక్ల(రథ) సప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని వేలాదిగా భక్తులు పవిత్ర స్నానాలు చేసి ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ మూర్తికి పూజలు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు తీరం వద్ద ఇసుక తిన్నెల్లో మట్టి కుండల్లో స్వామికి ప్రీతికరమైన పొంగళి వండి అర్ఘ్యమిచ్చి తర్వాత అర్పణ చేశారు. కొంతమంది పితృదేవతల (దివంగతలు)కు పిండ ప్రదానాలు, అస్థికల నిమజ్జనం చేశారు. ప్రత్యేక బస్సుల్లో తెల్లవారుజాము నుంచే యాత్రికులు చేరుకోగా, బీచ్ రోడ్ కిటకిటలాడింది. పోలీసు యంత్రాంగం, అగ్నిమాపక జవానులు, లైఫ్ గార్డులు తీరం వద్ద భద్రతా చర్యలు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మండే ఎండలో ప్రచారం... పదవి కోసం సాహసం
[ 18-04-2024]
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటాయి. ఎన్నికల ప్రచారం చేసే నేతలు, కార్యకర్తలు అప్రమత్తం కావాలని వాతావరణ అధ్యయన శాఖ (ఐఎండీ) యంత్రాంగం హెచ్చరిస్తోంది. వీటిని ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. -
ఒకేరోజు నేత్రోత్సవం, రథయాత్ర
[ 18-04-2024]
విశ్వప్రసిద్ధ పూరీ జగన్నాథుని రథయాత్ర నిర్వహణ ఈసారి యంత్రాంగానికి పరీక్ష కానుంది. జులై 7న పురుషోత్తముని నేత్రోత్సవం (నవయవ్వన దర్శనం), అదేరోజు రథయాత్ర నిర్వహించాల్సి ఉంది. -
లక్ష్మీపూర్లో త్రిముఖ పోరు
[ 18-04-2024]
కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ నియోజకవర్గంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాక ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. -
రెండుచోట్ల నవీన్ పోటీ
[ 18-04-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బొలంగీర్ జిల్లా కంటాబంజి, గంజాం జిల్లాలోని హింజిలి నుంచి ఈసారి అసెంబ్లీకి పోటీ చేస్తారు. బుధవారం తొమ్మిది శాసనసభ స్థానాలకు పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను ఆయన ప్రకటించారు. -
జగన్నాథుడా... నీల మాధవుడా!
[ 18-04-2024]
రాయగడ జిల్లా బిసంకటక్ శాసనసభ నియోజకవర్గ స్థానంలో ఆసక్తికరపోరు నెలకొంది. ఇక్కడి నుంచి ఇద్దరు జగన్నాథులు (జగన్నాథ సరక, జగన్నాథ నుండ్రుక), ఓ నీల మాధవుడు (నీలమాధవ్ హికాక) బరిలో ఉన్నారు. -
ప్రతికూలతలు అధిగమించి.. సివిల్స్లో ర్యాంకు సాధించి..
[ 18-04-2024]
‘యూపీఎస్సీ-2023’ పరీక్షల్లో జాతీయస్థాయిలో రెండో ర్యాంకు సాధించిన రాష్ట్ర యువకుడు అనిమేష్ ప్రధాన్ను రాష్ట్రపతి ద్రౌపదీముర్ము, ప్రధాని మోదీ, గవర్నరు రఘుబర్దాస్, సీఎం నవీన్లు ‘ఎక్స్’ సామాజిక మాధ్యమం ద్వారా అభినందించారు. -
ప్రజల గుండెచప్పుడు బిజుబాబు: నవీన్
[ 18-04-2024]
బిజుబాబు భౌతికంగా లేకపోయినా, రాష్ట్ర ప్రజల గుండె చప్పుడుగా అందరి హృదయాల్లో ఉన్నారని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అన్నారు. -
బిజద గూటికి చేరిన వెంటనే రాణికి టికెట్
[ 18-04-2024]
సంబల్పూర్ సిటింగ్ భాజపా ఎంపీ నితీష్ గంగదేవ్ భార్య అరుంధతీ దేవి, ఆమె పెద్దకుమారుడు నమన్ గంగదేవ్ మంగళవారం రాత్రి నవీన్ నివాస్లో సీఎం నవీన్ సమక్షంలో బిజదలో చేరారు. -
ప్రధాన పార్టీలకు అసంతృప్తుల బెడద
[ 18-04-2024]
కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్, పొట్టంగి, కొరాపుట్ నియోజకవర్గాల్లో టికెట్ దక్కని అసంతృప్త వర్గాలతో ప్రధాన పార్టీలకు తలనొప్పి వ్యవహారంగా మారింది.