logo

రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి

కేంఝర్‌ జిల్లా పండపడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఊచబెడ గ్రామం వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.

Published : 29 Jan 2023 01:40 IST

ప్రమాదానికి గురైన ఆటోలో మృతదేహాలు

కటక్‌, న్యూస్‌టుడే. కేంఝర్‌ జిల్లా పండపడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఊచబెడ గ్రామం వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక పోలీసులు అందించిన వివరాల ప్రకారం... కమండర గ్రామానికి చెందిన కొంతమంది రైతులు, వ్యాపారులు కేంఝర్‌ పట్టణానికి వెళ్లి వారు తీసుకెళ్లిన సామగ్రి విక్రయించి తిరిగి గ్రామానికి ఆటోలో బయలుదేరారు. ఊచబెడ గ్రామం వద్ద ఆటో, ఎదురుగా వస్తున్న వ్యాను ఢీకొన్నాయి. దీంతో ఘటనా స్థలంలో ఆటోలో ఉన్న ముగ్గురు మృతిచెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతి చెందిన వారు జీవన్‌ నాయక్‌ (25), రాధా నాయక్‌ (60) నవీన్‌ నాయక్‌ (48), ప్రహ్లాద నాయక్‌(45). గాయపడిన అయిదుగురిని జిల్లా ప్రధాన ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రమాదం అనంతరం ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. రహదారిపై స్థానికులు రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుల కుటుంబాలకు పరిహారం అందిస్తామని హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని