గిన్నిస్ బుక్లో బిర్సాముండా స్టేడియానికి స్థానం
సుందర్గఢ్ జిల్లా రవుర్కెలాలోని బిర్సాముండ హాకీ స్టేడియం ప్రపంచంలోనే పెద్దదిగా గిన్నిస్బుక్ అఫ్ రికార్డ్లో స్థానం సంపాదించింది.
క్రీడా మైదానం
భువనేశ్వర్, న్యూస్టుడే: సుందర్గఢ్ జిల్లా రవుర్కెలాలోని బిర్సాముండ హాకీ స్టేడియం ప్రపంచంలోనే పెద్దదిగా గిన్నిస్బుక్ అఫ్ రికార్డ్లో స్థానం సంపాదించింది. 5-టీ కార్యదర్శి వి.కార్తికేయపాండ్యన్ ఈ విషయాన్ని ఆదివారం స్వయంగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కు తెలియజేయడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి ప్రపంచకప్ హాకీ (పురుషులు) పోటీలకు స్పాన్సరర్గా వ్యవహరిస్తోంది. ఇటీవల పోటీల ప్రారంభానికి ముందు ఈ క్రీడామైదాన ఆధునికీకరణ పనులు ప్రారంభించింది. ఈ పనులకు సుమారు రు.1200 కోట్లు వెచ్చించారు. 15 నెలల్లో పనులు పూర్తి చేశారు. 21,800 మంది కూర్చొని తిలకించే వెసులుబాటుంది. అత్యాధునిక సౌకర్యాలున్నాయి. దీన్ని గతనెల (జనవరి)లో శుభారంభం చేసిన నవీన్ ఈ స్టేడియం రాష్ట్ర గౌరవంగా పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈ మైదానం గిన్నిస్ బుక్లో చోటు దక్కించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మండే ఎండలో ప్రచారం... పదవి కోసం సాహసం
[ 18-04-2024]
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటాయి. ఎన్నికల ప్రచారం చేసే నేతలు, కార్యకర్తలు అప్రమత్తం కావాలని వాతావరణ అధ్యయన శాఖ (ఐఎండీ) యంత్రాంగం హెచ్చరిస్తోంది. వీటిని ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. -
ఒకేరోజు నేత్రోత్సవం, రథయాత్ర
[ 18-04-2024]
విశ్వప్రసిద్ధ పూరీ జగన్నాథుని రథయాత్ర నిర్వహణ ఈసారి యంత్రాంగానికి పరీక్ష కానుంది. జులై 7న పురుషోత్తముని నేత్రోత్సవం (నవయవ్వన దర్శనం), అదేరోజు రథయాత్ర నిర్వహించాల్సి ఉంది. -
లక్ష్మీపూర్లో త్రిముఖ పోరు
[ 18-04-2024]
కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ నియోజకవర్గంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాక ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. -
రెండుచోట్ల నవీన్ పోటీ
[ 18-04-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బొలంగీర్ జిల్లా కంటాబంజి, గంజాం జిల్లాలోని హింజిలి నుంచి ఈసారి అసెంబ్లీకి పోటీ చేస్తారు. బుధవారం తొమ్మిది శాసనసభ స్థానాలకు పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను ఆయన ప్రకటించారు. -
జగన్నాథుడా... నీల మాధవుడా!
[ 18-04-2024]
రాయగడ జిల్లా బిసంకటక్ శాసనసభ నియోజకవర్గ స్థానంలో ఆసక్తికరపోరు నెలకొంది. ఇక్కడి నుంచి ఇద్దరు జగన్నాథులు (జగన్నాథ సరక, జగన్నాథ నుండ్రుక), ఓ నీల మాధవుడు (నీలమాధవ్ హికాక) బరిలో ఉన్నారు. -
ప్రతికూలతలు అధిగమించి.. సివిల్స్లో ర్యాంకు సాధించి..
[ 18-04-2024]
‘యూపీఎస్సీ-2023’ పరీక్షల్లో జాతీయస్థాయిలో రెండో ర్యాంకు సాధించిన రాష్ట్ర యువకుడు అనిమేష్ ప్రధాన్ను రాష్ట్రపతి ద్రౌపదీముర్ము, ప్రధాని మోదీ, గవర్నరు రఘుబర్దాస్, సీఎం నవీన్లు ‘ఎక్స్’ సామాజిక మాధ్యమం ద్వారా అభినందించారు. -
ప్రజల గుండెచప్పుడు బిజుబాబు: నవీన్
[ 18-04-2024]
బిజుబాబు భౌతికంగా లేకపోయినా, రాష్ట్ర ప్రజల గుండె చప్పుడుగా అందరి హృదయాల్లో ఉన్నారని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అన్నారు. -
బిజద గూటికి చేరిన వెంటనే రాణికి టికెట్
[ 18-04-2024]
సంబల్పూర్ సిటింగ్ భాజపా ఎంపీ నితీష్ గంగదేవ్ భార్య అరుంధతీ దేవి, ఆమె పెద్దకుమారుడు నమన్ గంగదేవ్ మంగళవారం రాత్రి నవీన్ నివాస్లో సీఎం నవీన్ సమక్షంలో బిజదలో చేరారు. -
ప్రధాన పార్టీలకు అసంతృప్తుల బెడద
[ 18-04-2024]
కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్, పొట్టంగి, కొరాపుట్ నియోజకవర్గాల్లో టికెట్ దక్కని అసంతృప్త వర్గాలతో ప్రధాన పార్టీలకు తలనొప్పి వ్యవహారంగా మారింది.
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
-
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
-
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
-
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు