వ్యవసాయ సామగ్రిపై రాయితీలు
అన్నదాతల ప్రయోజనాలు, అధికోత్పత్తులు ధ్యేయంగా ప్రభుత్వం వ్యవసాయ సామగ్రికి రాయితీలు ఇస్తోందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ, మత్స్య, పాఢి శాఖల మంత్రి రాణేంద్ర ప్రతాప్ స్వయిన్ కోరారు.
సంబల్పూర్ కృషక్ మేళాలో మంత్రి రాణేంద్ర
మేళాను జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్నమంత్రి రాణేంద్ర, ఇతర అధికారులు
భువనేశ్వర్, న్యూస్టుడే: అన్నదాతల ప్రయోజనాలు, అధికోత్పత్తులు ధ్యేయంగా ప్రభుత్వం వ్యవసాయ సామగ్రికి రాయితీలు ఇస్తోందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ, మత్స్య, పాఢి శాఖల మంత్రి రాణేంద్ర ప్రతాప్ స్వయిన్ కోరారు. సంబల్పూర్ క్రీడా మైదానంలో ‘పశ్చిమ ఒడిశా కృషక్ మేళా-2023’ మూడు రోజుల ప్రదర్శనను ఆయన శనివారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆధునిక పద్ధతులతో వ్యవసాయం చేస్తే పంటలు సమృద్ధిగా పండుతాయన్నారు. యంత్ర పరికరాల కొనుగోలుకు ప్రభుత్వం రుణాలు, రాయితీలు ఇస్తోందని, అన్నదాతలు దీనిని వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ కమిషనర్ ఎస్.కె.వశిష్ఠ, ప్రిన్సిపల్ కార్యదర్శి అరవింద పాఢి తదితర అధికారులు పాల్గొన్నారు. వ్యవసాయ మేళాలో ట్రాక్టర్లు, పంట నూర్పిడి యంత్రాలు, ఇతర సామగ్రి ప్రదర్శన, విక్రయాలు చేశారు. వినియోగానికి సంబంధించి వివిధ కంపెనీల ప్రతినిధులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మేళాలో పశ్చిమ ఒడిశాకు చెందిన కృషక్ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
ప్రదర్శనలో యంత్ర సామగ్రి చూస్తున్న మంత్రి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
71 అసెంబ్లీ స్థానాలకు పోటీచేసేది వీరే..
[ 28-03-2024]
ముఖ్యమంత్రి, బిజద అధినేత నవీన్ పట్నాయక్ బుధవారం మధ్యాహ్నం వీడియో సందేశం ద్వారా 71 మందితో అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా స్వయంగా ప్రకటించారు. -
బిజద లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
[ 28-03-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 21 లోక్సభ స్థానాలకుబుధవారం 15 మందితో తొలి జాబితా ప్రకటించారు. వీరిలో ఇద్దరు మహిళలున్నారు. -
దాహం కేకలు
[ 28-03-2024]
రాయగడ జిల్లాలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. గుక్కెడు నీళ్ల కోసం ప్రజలు కటకటలాడుతున్నారు. -
తండ్రి ‘హస్తం’ కాదని... ‘శంఖం’ పిడికిట పట్టుకొని..
[ 28-03-2024]
సీనియర్ కాంగ్రెస్ నేత, ఖుర్దా జిల్లా జట్నీ ఎమ్మెల్యే సురేష్ రౌత్రాయి చిన్న కుమారుడు కెప్టెన్ మన్మధ రౌత్రాయి బుధవారం బిజదలో చేరారు. -
బస్సు బోల్తా: ఒకరి మృతి, 20 మందికి గాయాలు
[ 28-03-2024]
కొరాపుట్ నుంచి రాయగడకు వెళ్లే మార్గంలో పొడఘడ్ వద్ద మంగళవారం రాత్రి బస్సు బోల్తాపడడంతో ఒకరు మృతి చెందగా, 20 మందికి గాయాలయ్యాయి. -
చిట్ పేరిట రూ. 2 కోట్లకుపైగా టోకరా
[ 28-03-2024]
చిట్ఫండ్ పేరిట ఓ మహిళ రూ.2 కోట్లకుపైగా టోకరా వేసిన ఉదంతం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. -
ఆహుతవుతున్న పచ్చదనం
[ 28-03-2024]
రాష్ట్రంలో పచ్చదనం అగ్నికి ఆహుతవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2030 నాటికి అడవులకు నిప్పు ఘటనలు మరింత తీవ్ర రూపం దాల్చనున్నట్లు అధ్యయనాలు పేర్కొంటుండడం గుబులు రేపుతోంది. -
కేజ్రీవాల్పై కుట్ర పన్నారు
[ 28-03-2024]
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై కుట్ర పన్ని, తప్పుడు కేసులో అరెస్టు చేసి, అన్యాయంగా జైల్లో పెట్టారని ఆప్ నాయకులు ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ