విజిలెన్స్ వలలో అవినీతి చేప
‘టాటా పవర్ సదరన్ ఒడిశా డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్’ సీనియర్ జనరల్ మేనేజర్ విజిలెన్స్ అధికారులకు చిక్కాడు.
బ్రహ్మపుర నగరం, న్యూస్టుడే: ‘టాటా పవర్ సదరన్ ఒడిశా డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్’ సీనియర్ జనరల్ మేనేజర్ విజిలెన్స్ అధికారులకు చిక్కాడు. బ్రహ్మపుర కార్పొరేట్ కార్యాలయంలో పనిచేస్తున్న ప్రమోద్ కుమార్ చౌధురి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో బ్రహ్మపుర విజిలెన్స్ డివిజన్ మంగళవారం దాడులు చేపట్టింది. గంజాం, పూరీ జిల్లాలోని పది చోట్ల సోదాలు జరుగుతున్నాయి. స్థానిక సిద్ధార్థనగర్ మొదటి లైనులోని మూడంతస్తుల భవనం, అంకులి శశిభూషణనగర్ మూడో లైనులోని రెండంతస్తుల ఇల్లు, హరిపూర్లోని రెండంతస్తుల ఇల్లు, గౌంజులోని వ్యవసాయ క్షేత్రం, లుచ్ఛాపడ ప్రధాన రహదారిలో ఇల్లు, పిపిలిలోని ఓ ఫ్లాట్, అంబపువాలోని మరో ఫ్లాట్, సొంతూరు బాలకృష్ణపూర్లోని ఇల్లు, లుచ్ఛాపడ మెయిన్ రోడ్డులోని ఓ వ్యాపార సంస్థ, టీపీఎస్ఓడీఎల్ కార్యాలయంలోని ఆయన ఛాంబర్లో అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు విజిలెన్స్ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. పైన పేర్కొన్న ఆస్తులతోపాటు బ్రహ్మపుర, ఛత్రపురం ప్రాంతాల్లో తొమ్మిది ఇళ్ల స్థలాలు, రూ.54,900ల నగదు, ఓ కారు, మూడు చక్రాల వాహనం ఒకటి, మూడు ద్విచక్ర వాహనాలు వెలుగు చూసినట్లు మరో ప్రకటనలో వెల్లడించింది. ఒక అదనపు ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, 12 మంది ఇన్స్పెక్టర్లు, 12 మంది ఎస్సై, ఏఎస్సైలు ఇతర సిబ్బందితోపాటు జీఎస్టీ అధికారులు దాడుల్లో పాల్గొన్నారని వివరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గొంతు కోసి యువకుడి దారుణ హత్య
[ 29-03-2024]
గజపతి జిల్లాలోని గుసాని సమితి గురండి ఠాణా పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. -
కాషాయం కండువాలు ధరించిన అగ్రనేతలు
[ 29-03-2024]
దిల్లీ భాజపా కార్యాలయం వేదికగా గురువారం మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో ఇద్దరు ప్రముఖ నేతలు, మరో ప్రముఖ రచయిత్రి కాషాయం కండువాలు ధరించారు. -
తోడేలు దాడిలో ఇద్దరికి గాయాలు
[ 29-03-2024]
మల్కాన్గిరి సమితి ఎమ్.వి.93 గ్రామంలో ఇద్దరిపై తోడేలు దాడి చేయడంతో, పోరాడి హతమార్చారు. ఈ క్రమంలో వీరికి తీవ్ర గాయాలయ్యాయి -
డబుల్ ఇంజిన్ పాలన తథ్యం: అపరాజిత
[ 29-03-2024]
రాష్ట్రంలో భాజపా డబుల్ ఇంజిన్ పాలన తథ్యమని, ప్రజల్లో మార్పు కనిపిస్తోందని భువనేశ్వర్ సిటింగ్ ఎంపీ అపరాజిత షడంగి చెప్పారు. -
బిజదలో అసమ్మతి సెగ
[ 29-03-2024]
ఎన్నికల ముందు అధికార పక్షం బిజదలో అసమ్మతి సెగ తగలడంతో పార్టీకి తలనొప్పిగా మారుతోంది. రాయగడ శాసనసభ నియోజకవర్గ టికెట్ అనుసూయ మాఝికి కేటాయించడంపై రెండు వర్గాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటుండడం పార్టీ శ్రేణులకు మింగుడుపడడం లేదు -
గోపాల్పూర్ ఓడరేవు కొనుగోలు చేసిన అదానీ
[ 29-03-2024]
తూర్పు తీరంలో సరకు రవాణాలో అగ్రగామిగా ఉన్న గోపాల్పూర్ ఓడరేవును ప్రముఖ పారిశ్రామిక గ్రూపు అదానీ కొనుగోలు చేసింది -
ప్రతిష్ఠాత్మక నియోజకవర్గం పోరు రసవత్తరం
[ 29-03-2024]
బిజద అభ్యర్థి బిక్రం పండాకు గోపాల్పూర్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నియోజకవర్గం ఓటర్లందరికీ చిరపరిచితులు. భంజవిహార్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఆయన తొలినాళ్లలో విద్యార్థి నేత -
ఎన్నికల బరిలో అతివలకు అవకాశం
[ 29-03-2024]
ఎన్నికల్లో మహిళా అభ్యర్థులకు అధిక ప్రాధాన్యం ఇస్తామని బిజద ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పినట్లుగా ఎన్నికల బరిలో పోటీపడేందుకు మహిళలకు అవకాశం కల్పించారు. -
‘రిడ్లీ’ల రాకకు ఎదురుచూపు
[ 29-03-2024]
విదేశీ అతిథులు ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేళ్ల రాక వల్ల గంజాం జిల్లా ఖ్యాతిగాంచింది. రాష్ట్రంలోని రిడ్లీల పునరుత్పత్తికి మూడు కేంద్రాలుండగా, వీటిలో గంజాం జిల్లాలోని రుషికుల్యా ముఖద్వారం ఒకటి. -
శ్రీక్షేత్రంలో మీనాక్షి శేషాద్రి
[ 29-03-2024]
ప్రముఖ బాలీవుడ్ (ముంబయి) నటి, నర్తకి మీనాక్షి శేషాద్రి గురువారం పూరీ వచ్చారు. శ్రీక్షేత్రంలో జగన్నాథుడి సన్నిధిలో పూజలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!