నిలిచిన పనులు.. తప్పని పాట్లు
అరకభద్ర వద్ద ఉన్న బాహుదా నదికి ఇరువైపులా సుమారు 30కి పైగా గ్రామాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో వంతెన నిర్మాణం చేపట్టాలని దశాబ్దాలుగా వారంతా పోరాటం చేస్తూనే ఉన్నారు.
30 గ్రామాల ప్రజలకు నిత్యం అవస్థలు
అరకభద్ర సమీపంలో నిలిచిపోయిన వంతెన పనులు
ఇచ్ఛాపురం గ్రామీణం, న్యూస్టుడే: అరకభద్ర వద్ద ఉన్న బాహుదా నదికి ఇరువైపులా సుమారు 30కి పైగా గ్రామాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో వంతెన నిర్మాణం చేపట్టాలని దశాబ్దాలుగా వారంతా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇక్కడ వంతెన లేకపోవడంతో ఆయా గ్రామాలకు చెందిన వందలాది మంది విద్యార్థులతో పాటు గ్రామస్థులు గమ్యస్థానాలకు చేరేందుకు నిత్యం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సాధారణ రోజుల్లో నదిలో నడుము లోతు వరకు నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నీటిని దాటుకుంటూ ఏటికి అవతలి వైపు ఉన్న గ్రామాలకు ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తుంటారు. వర్షాకాలంలో వరద తీవ్రత అధికంగా ఉంటుంది. దీంతో రాకపోకలు నిలిచిపోతుంటాయి. ఈ మేరకు దృష్టిసారించిన గత ప్రభుత్వం అరకభద్ర వద్ద వంతెన నిర్మాణానికి రూ.7.15 కోట్ల నిధులు మంజూరు చేసింది. పనులు ప్రారంభమయ్యాయి. 2022 ఆగస్టు నాటికి పూర్తి చేయాల్సి ఉండగా అనంతరం వచ్చిన వైకాపా ప్రభుత్వం దీనిపై శ్రద్ధ చూపలేదు. గుత్తేదారునికి సకాలంలో బిల్లులు చెల్లించపోవడం తదితర కారణాల వల్ల పిల్లర్ల స్థాయితో అర్ధంతరంగా పనులు నిలిచిపోయాయి. ఇటీవల ఇక్కడి యంత్రాలు, పరికరాలను గుత్తేదారు అక్కడి నుంచి తరలిస్తుండటంతో పనులు నిలిచిపోయాయనే ఆందోళన స్థానికులలో వ్యక్తమవుతోంది. పనులు అర్ధంతరంగా నిలిచిపోతే భారీ వర్షాలు, వరదల సమయంలో అరకభద్ర నుంచి కొళిగాంలోని ఉన్నత పాఠశాలలు, విద్య, వైద్యం, ఇతర అవసరాల కోసం వెళ్లేందుకు ఇచ్ఛాపురం మీదుగా 24 కిలీమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది. దీంతో అధిక వ్యయప్రయాసలకు స్థానికుల గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకోవాలని కోరుతున్నారు.
ఎదురుచూపులు
- మంగి బాబూరావు, అరకభద్ర
అరకభద్ర నుంచి కొళిగాం వెళ్లాలంటే నదిని దాటాలి. ప్రస్తుతం నడుమ వరకు నీరు ఉండటంతో దాటుకుంటూ వెళుతున్నాం. వర్షాకాలంలో ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఆ పరిస్థితుల్లో వెళ్లాలంటే వీలుకాదు. ఇచ్ఛాపురం నుంచి చుట్టూ తిరిగి 24 కిలోమీటర్లు ప్రయాణించాలి. రెండు నెలలుగా వంతెన పనులు జరగడం లేదు. మళ్లీ ప్రారంభించి ఈ ఏడాది వర్షాకాలం నాటికి అందిస్తారని ఎదురు చూస్తున్నాం.
త్వరలో ప్రారంభిస్తాం
- ధనుంజయరావు, జేఈ, పంచాయతీరాజ్ విభాగం
ప్రస్తుతం 55 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. సాంకేతిక కారణాలతో నిలిచిపోయాయి. ఈ విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బిజద... రాజీనామాల బెడద
[ 24-04-2024]
గతంలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుత ఎన్నికల్లో బిజదలో అసంతృప్తి కనిపిస్తోంది. పిరాయింపుదారులకు అధినాయకత్వం టికెట్లు కేటాయించిందన్న అసహనం, అసంతృప్తి రాష్ట్రమంతటా ఉంది. సీనియర్ నాయకులు పార్టీకి రాజీనామాలు చేశారు. -
అనుభవజ్ఞులతో కొత్త అభ్యర్థుల ఢీ
[ 24-04-2024]
నవరంగపూర్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో అనుభవజ్ఞులతో కొత్త అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జిల్లాలో అన్ని పార్టీలు నూతన అభ్యర్థులను బరిలో నిలపడంతో పోటీ ఎలా ఉండబోతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. -
ముమ్మరంగా నామినేషన్ల దాఖలు
[ 24-04-2024]
కల తేదీలు దగ్గర పడుతున్న వేళ వివిధ పార్టీల నేతలు నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. అనుచరులు, నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీలు నిర్వహిస్తూ వెళ్లి తమ ఇష్టదైవాలకు ప్రార్థనలు చేసి తర్వాత నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. -
అందాల పిట్టలండీ.. సంఖ్య పెరిగేనండీ
[ 24-04-2024]
కేంద్రపడ జిల్లా బితరకనిక జాతీయ ఉద్యానవనంలో మడ అడవి పక్షుల (మేన్గ్రోవ్ పిట్ట) సంఖ్య పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే వీటి సంతతి 39 పెరగడం గమనార్హం. -
గోపాల్పూర్లో ముఖాముఖి పోరు
[ 24-04-2024]
ప్రతిష్ఠాత్మక గోపాల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బిజద, భాజపా అభ్యర్థుల మధ్య ఎన్నికల పోరు రసవత్తరంగా కనిపిస్తోంది. -
భాజపా గూటికి మరో ఇద్దరు అగ్రనేతలు
[ 24-04-2024]
మాజీ మంత్రి బింబాధర్ కువార్, బిజద మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి నివేదితా నాయక్ భాజపా గూటికి చేరారు. -
మిత్రమండలి కొత్త కార్యవర్గం ఎంపిక
[ 24-04-2024]
బ్రహ్మపురలోని సుమారు 80 ఏళ్ల పురాతన ‘ఆంధ్ర విజ్ఞాన మిత్ర మండలి’ కొత్త కార్యవర్గం ఎంపిక సోమవారం రాత్రి జరిగింది. -
ముగిసిన తరాతరిణి చైత్ర మంగళవారాల యాత్ర
[ 24-04-2024]
గంజాం జిల్లాలోని సుప్రసిద్ధ తరాతరిణి శక్తిపీఠంలో చైత్ర మంగళవారాల యాత్ర ముగిసింది. అయిదో మంగళవారం సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకూ భక్తుల రద్దీ కనిపించింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్