logo

కాలేయ వ్యాధితో బాధపడుతున్న నటుడు పింటూ నంద

రాష్ట్ర ప్రజలను గత 25 ఏళ్లుగా తన నటనతో రంజింపచేస్తున్న హాస్య నటుడు పింటూ నంద అస్వస్థతకు గురయ్యారు. కాలేయ సంబంధిత వ్యాధితో భువనేశ్వర్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Published : 02 Feb 2023 02:18 IST

కటక్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రజలను గత 25 ఏళ్లుగా తన నటనతో రంజింపచేస్తున్న హాస్య నటుడు పింటూ నంద అస్వస్థతకు గురయ్యారు. కాలేయ సంబంధిత వ్యాధితో భువనేశ్వర్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, కాలేయ మార్పిడి చేయాల్సి ఉంటుందని వైద్యులు వెల్లడించారు. దీంతో కళాకారుల సంఘం ఆర్థికసాయానికి ముందుకొచ్చింది. సంఘం ప్రతినిధి, కథానాయకుడు శ్రీతందాస్‌ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎంతోమందిని తన నటనతో అలరించిన పింటూ నేడు సహాయం కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. ఆయన శస్త్రచికిత్సకు రూ.40 నుంచి 50 లక్షల వరకు ఖర్చవుతుందని, సినీ రంగంలో ఉన్నవారు, అభిమానులు ఆయనకు సాయం అందించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని