నిండు చూలాలికి నరకయాతన
ప్రసవ వేదనతో బాధపడుతున్న ఓ మహిళకు అంబులెన్సు దొరకలేదు. ఆరోగ్య కేంద్రంలో వైద్యులు లేరు. దీంతో తప్పనిసరి పరిస్థితిలో 8కి.మీ. బుట్టలో మోసుకుని బంధువులు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో ప్రసవించింది.
బుట్టలో తరలింపు మార్గమధ్యంలో ప్రసవం
గర్భిణిను మోసుకెళ్తున్న బంధువులు
మల్కాన్గిరి, న్యూస్టుడే: ప్రసవ వేదనతో బాధపడుతున్న ఓ మహిళకు అంబులెన్సు దొరకలేదు. ఆరోగ్య కేంద్రంలో వైద్యులు లేరు. దీంతో తప్పనిసరి పరిస్థితిలో 8కి.మీ. బుట్టలో మోసుకుని బంధువులు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో ప్రసవించింది. ఈ సంఘటన మల్కాన్గిరి జిల్లా చిత్రకొండ సమితి పపులుర్ పంచాయతీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం సాయంత్రం పపులుర్ పంచాయతీ నయిడగుడ గ్రామానికి చెందిన రామచంద్ర శిశా భార్య భాను శిశాకి పురిటినొప్పులు ప్రారంభమైంది. భర్త వెంటనే ఆశా కార్యకర్త నీలిమ ఖోరకు సమాచారం అందజేయగా ఆమె పపులుర్ ఆరోగ్య కేంద్రానికి అంబులెన్సు కోసం ఫోన్ చేశారు. అందుబాటులో లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితిలో కుటుంబ సభ్యులు భానుని ఓ బుట్టలో ఉంచి తీసుకొస్తున్న సమయంలో సగం దారిలో భాను బిడ్డను ప్రసవించింది. అనంతరం ఆమెను పపులర్ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. కానీ అక్కడ సిబ్బంది లేకపోవడంతో చిత్రకొండ ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఓ అంబులెన్సు రావడంతో తల్లీబిడ్డను చిత్రకొండ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం వారు బాగున్నట్లు వైద్యులు చెప్పారు.
ఆరోగ్య కేంద్రంలో తల్లీబిడ్డ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధి కొనసాగుతుంది..శంక ద్వయాన్ని ఆశీర్వదించండి
[ 25-04-2024]
రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతుందని, బిజదను ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రజల్ని కోరారు. -
భాజపాకు 40 మంది స్టార్ ప్రచారకులు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాజపా స్టార్ ప్రచారకుల జాబితా మంగళవారం రాత్రి విడుదల చేశారు. -
ఇంకెన్నాళ్లీ దుస్థితి?
[ 25-04-2024]
అధ్వానంరాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలు అధ్వానంగా ఉన్నాయన్న నివేదికలు దిగజారిన ‘నాక్’ గ్రేడేషన్లు దుస్థితిని తెలియజేస్తున్నాయని కేంద్రమంత్రి నిలదీశారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో భర్తీకాని టీచింగ్ సిబ్బంది, అసౌకర్యాలు, ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల డ్రాపౌట్ల గురించి ఏం సమాధానం చెబుతారన్నారు. -
ఓ తండ్రి...ఇద్దరు కొడుకులు
[ 25-04-2024]
గత అయిదున్నర దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన నేత ఆయన. అన్ని పార్టీల నేతల మన్ననలు అందుకున్న వ్యక్తి. వయసుతోపాటు గౌరవం, నిక్కచ్చితనం పెంచుకున్న నికార్సయిన నేత. 80 ఏళ్ల వయసులో కొడుకు నిర్వాకంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
నామినేషన్ల సందడి
[ 25-04-2024]
బ్రహ్మపుర లోకసభ పరిధిలోని పర్లాఖెముండి నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిగా కోడూరు నారాయణరావు నామినేషన్ పత్రాన్ని సబ్ కలెక్టర్ అనూప్ పండాకు అందజేశారు. -
భాజపాలో సీమారాణి చేరిక
[ 25-04-2024]
బిజదకు రాజీనామా చేసిన హిందళ్ సిటింగ్ ఎమ్మెల్యే సీమారాణి నాయక్ బుధవారం భాజపాలో చేరారు. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, ఇతర నాయకులు ఆమెను స్వాగతించారు. -
నేడు అమిత్షా రాక
[ 25-04-2024]
కేంద్ర హోంమంత్రి అమిత్షా గురువారం రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. మధ్యాహ్నం సోన్పూర్లో ఏర్పాటయ్యే ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగిస్తారు. -
నా ఓటు.. నా బాధ్యత
[ 25-04-2024]
నా ఓటు నా బాధ్యత అంటూ, తప్పకుండా ఓటు వినియోగించుకుంటామని నూతన ఓటర్లు, కళాశాల విద్యార్థులన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!