రాయగడ రైల్వే డివిజన్కు రూ.10 కోట్లు
తూర్పు కోస్తా రైల్వేజోన్ పరిధిలో రాయగడ కొత్త డివిజన్కు రూ.10 కోట్లను కేంద్రం కేటాయించింది.
అవిభక్త కొరాపుట్ జిల్లాలో మరికొన్ని ప్రాజెక్టులకు నిధులు
రాయగడలో కొనసాగుతున్న విజయనగరం-టిట్లాగఢ్ మూడో లైను పనులు
రాయగడ పట్టణం, న్యూస్టుడే: తూర్పు కోస్తా రైల్వేజోన్ పరిధిలో రాయగడ కొత్త డివిజన్కు రూ.10 కోట్లను కేంద్రం కేటాయించింది. అవిభక్త కొరాపుట్ జిల్లాలో మరికొన్ని కొత్త ప్రాజెక్టులకు రైల్వే మంత్రిత్వశాఖ నిధులు ఇచ్చింది. శుక్రవారం సాయంత్రం వాల్తేరు డివిజన్ కార్యాలయ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం... రాయగడ డివిజన్తోపాటు రాయగడ మీదుగా వేస్తున్న విజయనగరం- టిట్లాగఢ్ మూడో లైను, కొరాపుట్- సింగుపూర్ రోడ్, జగదల్పూర్- కొరాపుట్, నువాపడ- గుణుపురం. జయపురం- మల్కాన్గిరి, జయపురం- నవరంగపూర్ రైలు మార్గాలకు నిధులను కేటాయించింది. కొరాపుట్- సింగుపూర్ రోడ్, సింగుపూర్- విజయనగరం మార్గాల్లో రైలు పట్టాల ఆధునికీకరణకు ఈసారి బడ్జెట్లో అవకాశం కల్పించింది. వీటిలో విజయనగరం- టిట్లాగఢ్ మూడో లైనుకు అధిక ప్రాధాన్యమిస్తూ అత్యధికంగా రూ.920 కోట్లు కేటాయించడం గమనార్హం. నువాపడ- గుణుపురం రైలు మార్గాన్ని రాయగడ జిల్లాలో తెరువలి వరకు పొడిగింపునకు రూ.50 కోట్లు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాయగడ డివిజన్ కోసం రూ.10 కోట్లు మాత్రమే ప్రకటించడంపై పెదవి విరుస్తున్నారు.
రాయగడ రైల్వే స్టేషన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధి కొనసాగుతుంది..శంక ద్వయాన్ని ఆశీర్వదించండి
[ 25-04-2024]
రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతుందని, బిజదను ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రజల్ని కోరారు. -
భాజపాకు 40 మంది స్టార్ ప్రచారకులు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాజపా స్టార్ ప్రచారకుల జాబితా మంగళవారం రాత్రి విడుదల చేశారు. -
ఇంకెన్నాళ్లీ దుస్థితి?
[ 25-04-2024]
అధ్వానంరాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలు అధ్వానంగా ఉన్నాయన్న నివేదికలు దిగజారిన ‘నాక్’ గ్రేడేషన్లు దుస్థితిని తెలియజేస్తున్నాయని కేంద్రమంత్రి నిలదీశారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో భర్తీకాని టీచింగ్ సిబ్బంది, అసౌకర్యాలు, ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల డ్రాపౌట్ల గురించి ఏం సమాధానం చెబుతారన్నారు. -
ఓ తండ్రి...ఇద్దరు కొడుకులు
[ 25-04-2024]
గత అయిదున్నర దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన నేత ఆయన. అన్ని పార్టీల నేతల మన్ననలు అందుకున్న వ్యక్తి. వయసుతోపాటు గౌరవం, నిక్కచ్చితనం పెంచుకున్న నికార్సయిన నేత. 80 ఏళ్ల వయసులో కొడుకు నిర్వాకంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
నామినేషన్ల సందడి
[ 25-04-2024]
బ్రహ్మపుర లోకసభ పరిధిలోని పర్లాఖెముండి నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిగా కోడూరు నారాయణరావు నామినేషన్ పత్రాన్ని సబ్ కలెక్టర్ అనూప్ పండాకు అందజేశారు. -
భాజపాలో సీమారాణి చేరిక
[ 25-04-2024]
బిజదకు రాజీనామా చేసిన హిందళ్ సిటింగ్ ఎమ్మెల్యే సీమారాణి నాయక్ బుధవారం భాజపాలో చేరారు. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, ఇతర నాయకులు ఆమెను స్వాగతించారు. -
నేడు అమిత్షా రాక
[ 25-04-2024]
కేంద్ర హోంమంత్రి అమిత్షా గురువారం రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. మధ్యాహ్నం సోన్పూర్లో ఏర్పాటయ్యే ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగిస్తారు. -
నా ఓటు.. నా బాధ్యత
[ 25-04-2024]
నా ఓటు నా బాధ్యత అంటూ, తప్పకుండా ఓటు వినియోగించుకుంటామని నూతన ఓటర్లు, కళాశాల విద్యార్థులన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!