పక్కదారి పడుతున్న పీఎంఏవై ఇళ్లు: భాజపా
ప్రధానమంత్రి ఆవాస్ యోజనాలో అవకతవకలు జరుగుతున్నాయని నిరసిస్తూ గుసాని, గుమ్మ సమితుల కార్యాలయాలను గజపతి భాజపా నాయకులు ముట్టడించారు.
గుసాని సమితి కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న భాజపా నాయకులు
పర్లాఖెముండి, న్యూస్టుడే: ప్రధానమంత్రి ఆవాస్ యోజనాలో అవకతవకలు జరుగుతున్నాయని నిరసిస్తూ గుసాని, గుమ్మ సమితుల కార్యాలయాలను గజపతి భాజపా నాయకులు ముట్టడించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయకపోవడమే కాకుండా పేద ప్రజలకు ఇళ్లు కూడా అందజేయడం లేదని వారు ఆరోపించారు. గతంలో జాబితాలో ఉన్న లబ్ధిదారులను తొలగించి అనర్హుల పేర్లతో బిజద నాయకులు ప్రతిపాదించడం సమంజసం కాదని భాజపా నేత శ్రీధర్ నాయుడు అన్నారు. ముఖ్యమంత్రి పేరిట రాసిన వినతిపత్రాన్ని బీడీవోకు అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ సిద్ధేశ్వర మిశ్రా తదితరులు పాల్గొన్నారు. గుమ్మ సమితి కార్యాలయ ప్రాంగణంలో సమితి మండల అధ్యక్షుడు కృష్ణచంద్ర బిసొయ్, అరుణిమ సాహు తదితరులు బైఠాయించి నిరసన తెలిపారు.
అర్హులకు అందని ఇళ్లు..
నవరంగపూర్, న్యూస్టుడే: కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఆవాస్ యోజనలో పేదలకు ఇళ్లు మంజూరు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి బలభద్ర మాఝి అన్నారు. శనివారం నవరంగపూర్లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సకాలంలో లబ్ధిదారుల జాబితా సమర్పించలేకపోయినా రాష్ట్రానికి 9,68,000 ఇళ్లను కేంద్రం మంజూరు చేసిందన్నారు. అయినా పలుచోట్ల అర్హులకు అందని పరిస్థితి ఉందన్నారు. నవరంగపూర్ జిల్లాలో ఒకేఒక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉందని, మిగిలిన 9 సమితుల్లో ఎక్కడా లేదని, విద్యార్థుల ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు జగదీష్ బిసోయి, నాయకులు దేవ్దాస్ మహాంకుడ్, శుభమ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
నవరంగపూర్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతున్న భాజపా నాయకులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మావో డంప్ స్వాధినం
[ 19-04-2024]
మల్కానిగిరి జిల్లా కలిమెల ఠాణా పరిధిలో వున్న సానో టేకుడ, బెజంగి వాడ గ్రామం మధ్యలో వున్న అడవిలో బి.ఎస్.ఎఫ్. జవాన్లు మావో డంప్ స్వాధినం చెసుకున్నారు. -
వారసులొచ్చారు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొంతమంది ప్రముఖ నాయకులు పోటీ నుంచి తప్పుకున్నారు. వారి భార్యలు, వారసులను బరిలోకి దించారు. బిజద, భాజపా, కాంగ్రెస్ పార్టీల నాయకత్వాలు వారికి అవకాశం కల్పించాయి. తండ్రులు, తల్లులు వారి తరుఫున ప్రచారం చేస్తున్నారు. -
కమిషనరేట్ ఆధ్వర్యంలో ‘హెర్’ టీం
[ 19-04-2024]
మహిళల్ని వేధించే వారి భరతం పట్టడానికి జంటనగరాల (భువనేశ్వర్, కటక్) కమిషనరేట్ యంత్రాంగం ‘హై ఎఫిషియన్సీ రెస్పాన్స్ (హెరా) టీం ఏర్పాటు చేసింది. -
సత్వర విద్యుత్తు సేవలకు ‘సంచార సబ్ స్టేషన్’లు
[ 19-04-2024]
వేసవిలో ప్రజలకు మరింత మెరుగైన విద్యుత్తు సేవలు అందించేందుకు, సరఫరాలో అంతరాయం ఏర్పడితే సత్వర సేవలకు ‘సంచార సబ్ స్టేషన్’లు సిద్ధం చేశామని విద్యుత్తు సరఫరా సంస్థ ‘టాటా పవర్ సదరన్ ఒడిశా డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్’ (టీపీఎస్ఓడీఎల్) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది -
జగన్నాథునికి రూ.2.51 కోట్ల విరాళం
[ 19-04-2024]
రిలయన్స్ గ్రూపు సంస్థల అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ బుధవారం పూరీ శ్రీక్షేత్రానికి వచ్చారు. జగన్నాథుని సన్నిధిలో పూజలు చేశారు. -
సచిదాస్ కన్నుమూత
[ 19-04-2024]
జత్రా పార్టీ (నాటకాలు) దర్శకునిగా, నటునిగా ఖ్యాతి గాంచిన సచిదాస్ (91) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అస్వస్థతతో కటక్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. -
ఎవరి ప్రయోజనాల కోసం రెండుచోట్ల పోటీ?
[ 19-04-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మళ్లీ రెండుచోట్ల పోటీకి సిద్ధమయ్యారు. దీనివల్ల ప్రజలకు ఒరిగేదేమిటని? ఈ పోటీ ఎవరి ప్రయోజనాల కోసమని? సార్వత్రిక ఎన్నికల తర్వాత మరో ఉప ఎన్నిక, వ్యయప్రయాసలు మినహా సాధించేదేమిటని విమర్శలు వినిపిస్తున్నాయి. -
నేటి నుంచి మజ్జిగౌరీ చైత్రోత్సవాలు
[ 19-04-2024]
రాయగడ ఉత్కళాంధ్రుల ఇలవేల్పు, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి మజ్జిగౌరీ అమ్మవారి చైత్రోత్సవ సంబరాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. -
‘శ్రేష్ఠ భారత్’ ఏర్పాటుకు అంతా సహకరించాలి
[ 19-04-2024]
‘శ్రేష్ఠ భారత్’ లక్ష్యంగా దేశంలోని అన్ని ప్రాంతాలు, వర్గాలు, అన్ని రంగాల సమగ్ర అభివృద్ధికి ప్రధాని మోదీ 2024 సంకల్ప పత్రం జారీ చేశారని, ప్రజలంతా సహకరించి, మరోసారి మోదీని ప్రధాని చేసేందుకు ముందుకు రావాలని బ్రహ్మపుర లోక్సభ భాజపా అభ్యర్థి ప్రదీప్ కుమార్ పాణిగ్రహి కోరారు -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
[ 19-04-2024]
గంజాం జిల్లా గొళంత్రా ఠాణా పరిధిలోని కొణిసి-తుళు మార్గంలో బుధవారం మధ్యాహ్నం రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొన్న దుర్ఘటనలో ఇద్దరు యువకులు ఎమ్కేసీజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు
తాజా వార్తలు (Latest News)
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి