సందడిగా వంశధార వసంతోత్సవాలు
గుణుపురం పట్టణంలో పది రోజులుగా జరుగుతున్న వంశధార వసంతోత్సవాలు శుక్రవారం రాత్రితో సందడిగా ముగిశాయి.
అందరినీ అలరించిన నృత్యాలు
సంబలపురి నృత్యం చేస్తున్న విద్యార్ధులు
గుణుపురం, నూస్టుడే: గుణుపురం పట్టణంలో పది రోజులుగా జరుగుతున్న వంశధార వసంతోత్సవాలు శుక్రవారం రాత్రితో సందడిగా ముగిశాయి. వాస్తవంగా బుధవారం జరిగిన ముగింపు కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి జగన్నాథ్ సరకా ముఖ్య మాట్లాడుతూ ఉత్సవాలకు ప్రజాదరణ చూసి మరో రెండు రోజులు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. గురు, శుక్రవారాల్లో పరిసర గ్రామాల నృత్య కళాకారులు, గాయకులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి. చివర రోజున స్థానిక యువకుల గ్రామీణ జానపదం, ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల ఆదివాసీ, సంబలపురి నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పట్టణ చిన్నారులు ప్రదర్శించిన ఒడిస్సీ నృత్యాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. ఉత్సవ కమిటీ అధ్యక్షులు అక్షరదాస్, ఉపాధ్యక్షులు ఉమా దాస్, కార్యదర్శి రంజిత్ పాఢిలతో పాటు సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాంస్కృతిక ప్రదర్శనలిచ్చిన కళాకారులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ ఏడాది వేడుకల్లో నెల రోజుల పాటు క్రీడోత్సవాలు కొనసాగగా... రెండు రోజులు ఆధ్యాత్మిక, ఎనిమిది రోజులు సాంస్కృతిక కార్యాక్రమాలు అలరించాయి. వందకు పైగా స్టాల్స్ ఏర్పాటయ్యాయి. వీటిలో వ్యాపారాలు జోరుగా సాగాయి. పట్టణ ప్రజలతో పాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి చిన్న పెద్ద అందరూ తరలిరావడంతో ఉత్సవ ప్రాంగణం కిటకిటలాడింది. ఇక వినోదానికి మీనా బజారు వేదికైంది.
స్థానిక కళాకారుల జానపద నృత్యం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
[ 25-04-2024]
ఒడిశాలో కోరాపుట్ జిల్లా పాడువా సమీపంలో గురువారం సాయంత్రం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. -
అభివృద్ధి కొనసాగుతుంది..శంక ద్వయాన్ని ఆశీర్వదించండి
[ 25-04-2024]
రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతుందని, బిజదను ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రజల్ని కోరారు. -
భాజపాకు 40 మంది స్టార్ ప్రచారకులు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాజపా స్టార్ ప్రచారకుల జాబితా మంగళవారం రాత్రి విడుదల చేశారు. -
ఇంకెన్నాళ్లీ దుస్థితి?
[ 25-04-2024]
అధ్వానంరాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలు అధ్వానంగా ఉన్నాయన్న నివేదికలు దిగజారిన ‘నాక్’ గ్రేడేషన్లు దుస్థితిని తెలియజేస్తున్నాయని కేంద్రమంత్రి నిలదీశారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో భర్తీకాని టీచింగ్ సిబ్బంది, అసౌకర్యాలు, ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల డ్రాపౌట్ల గురించి ఏం సమాధానం చెబుతారన్నారు. -
ఓ తండ్రి...ఇద్దరు కొడుకులు
[ 25-04-2024]
గత అయిదున్నర దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన నేత ఆయన. అన్ని పార్టీల నేతల మన్ననలు అందుకున్న వ్యక్తి. వయసుతోపాటు గౌరవం, నిక్కచ్చితనం పెంచుకున్న నికార్సయిన నేత. 80 ఏళ్ల వయసులో కొడుకు నిర్వాకంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
నామినేషన్ల సందడి
[ 25-04-2024]
బ్రహ్మపుర లోకసభ పరిధిలోని పర్లాఖెముండి నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిగా కోడూరు నారాయణరావు నామినేషన్ పత్రాన్ని సబ్ కలెక్టర్ అనూప్ పండాకు అందజేశారు. -
భాజపాలో సీమారాణి చేరిక
[ 25-04-2024]
బిజదకు రాజీనామా చేసిన హిందళ్ సిటింగ్ ఎమ్మెల్యే సీమారాణి నాయక్ బుధవారం భాజపాలో చేరారు. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, ఇతర నాయకులు ఆమెను స్వాగతించారు. -
నేడు అమిత్షా రాక
[ 25-04-2024]
కేంద్ర హోంమంత్రి అమిత్షా గురువారం రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. మధ్యాహ్నం సోన్పూర్లో ఏర్పాటయ్యే ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగిస్తారు. -
నా ఓటు.. నా బాధ్యత
[ 25-04-2024]
నా ఓటు నా బాధ్యత అంటూ, తప్పకుండా ఓటు వినియోగించుకుంటామని నూతన ఓటర్లు, కళాశాల విద్యార్థులన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM