వంతెన నిర్మాణానికి చిక్కులు
కొరాపుట్ జిల్లా బొయిపరిగుడ సమితి, గుప్తేశ్వరం పంచాయతీ బొడఘాటి గ్రామం వద్ద శబరి నదిపై వంతెన నిర్మాణ పనులు రెండు నెలల క్రితం నిలిచిపోయాయి.
బొడఘాటి గ్రామస్థుల పడవ ప్రయాణం
జయపురం, న్యూస్టుడే: కొరాపుట్ జిల్లా బొయిపరిగుడ సమితి, గుప్తేశ్వరం పంచాయతీ బొడఘాటి గ్రామం వద్ద శబరి నదిపై వంతెన నిర్మాణ పనులు రెండు నెలల క్రితం నిలిచిపోయాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతంలో వంతెన నిర్మిస్తే పనులు దొరుకుతాయని, వాణిజ్యపరంగా వృద్ధి ఉంటుందని ఆశించిన వ్యాపారులకు నిరాశే మిగిలింది. రెండు రాష్ట్రాల సమన్వయలోపంతో పనులు అర్ధంతరంగా ఆగిపోయినట్లు పలువురు చెబుతున్నారు.
ఛత్తీస్గఢ్ అటవీశాఖ అడ్డగింత..
రాష్ట్ర ప్రభుత్వం బిజుసేతు పథకం కింద వంతెన నిర్మాణానికి రూ. 10 కోట్లు మంజూరు చేసింది. 6 పిల్లర్లు నిర్మించ తలపెట్టగా మూడు పూర్తి చేశారు. మిగిలిన మూడు పిల్లర్లు నిర్మించాలంటే ఛత్తీస్గఢ్ భూభాగంలో పనులు చేయాలి. దాంతో జయపురానికి చెందిన గుత్తేదారుడు ఆ భూభాగంలో మట్టిని తవ్వి, నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అందుకు కావాల్సిన రూ. కోట్ల విలువైన సామగ్రిని అక్కడికి చేర్చి, అడ్డుగా ఉన్న చెట్లు నరికేందుకు జేసీబీలను పంపగా అక్కడి అటవీశాఖ అధికారులు వాహనాలను సీజ్ చేసి పనులు అడ్డగించారు. అనుమతి లేని స్థలంలో చెట్లు నరుకుతున్నట్లు ఆరోపించారు. దాంతో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆ రాష్ట్ర అధికారులతో సంప్రదించగా జేసీబీలను విడిచిపెట్టారు. కానీ నిర్మాణానికి అంగీకరించలేదు. దాంతో కోట్ల విలువ చేసే సామగ్రి అక్కడే ఉండిపోయింది.
బొయిపరిగుడ వద్ద అసంపూర్తిగా పనులు
వాణిజ్య అభివృద్ధిపై ఆశలు..
కొరాపుట్ జిల్లాలో బొయిపరిగూడ, కుంద్ర, కొట్పాడ్ సమితుల్లో దాదాపు 150 గ్రామాలు వంతెన నిర్మాణం జరిగితే అభివృద్ధి చెందుతాయి. దాంతో వేలమంది ప్రజలకు పనులు దొరుకుతాయని, వ్యాపారం జరుగుతుందని ఆశాభావంతో ఉన్న స్థానికులకు నిరాశే మిగిలింది.
నాటు పడవే దిక్కు..
150 గ్రామాలకు చెందిన ప్రజలకు ఛత్తీస్గఢ్ రాష్ట్రం జగదల్పూర్ వెళ్లేందుకు నేటికి నాటు పడవే శరణ్యం. వర్షాలు అధికంగా కురిస్తే పరిస్థితి అధ్వానంగా ఉంటుంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఛత్తీస్గఢ్ అటవీశాఖ సీజ్ చేసిన జేసీబీ వాహనాలు
అనుమతి ఇచ్చి అడ్డగించారు..
- కిశోర్ చరణ్ నాయక్, గ్రామీణాభివృద్ధి జూనియర్ ఇంజినీరు
వంతెన నిర్మాణానికి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 148 చెట్లు తొలగించటానికి అనుమతి లభించింది. పనులు ప్రారంభించగా అటవీశాఖ వారు అడ్డుకున్నారు. దీనిపై ఇరు రాష్ట్రాల మధ్య పలుమార్లు సమావేశాలు నిర్వహించినా ఫలితం లేకపోయింది. త్వరలో నిర్మాణానికి ఛత్తీస్గఢ్ రాష్ట్రం కచ్చితంగా పచ్చజెండా ఊపుతుంది. పనులు పూర్తయితే శైవపీఠం గుప్తేశ్వర అభివృద్ధి చెంది, పర్యాటక, వ్యాపార రంగాలు ఊపందుకుంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మావో డంప్ స్వాధినం
[ 19-04-2024]
మల్కానిగిరి జిల్లా కలిమెల ఠాణా పరిధిలో వున్న సానో టేకుడ, బెజంగి వాడ గ్రామం మధ్యలో వున్న అడవిలో బి.ఎస్.ఎఫ్. జవాన్లు మావో డంప్ స్వాధినం చెసుకున్నారు. -
వారసులొచ్చారు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొంతమంది ప్రముఖ నాయకులు పోటీ నుంచి తప్పుకున్నారు. వారి భార్యలు, వారసులను బరిలోకి దించారు. బిజద, భాజపా, కాంగ్రెస్ పార్టీల నాయకత్వాలు వారికి అవకాశం కల్పించాయి. తండ్రులు, తల్లులు వారి తరుఫున ప్రచారం చేస్తున్నారు. -
కమిషనరేట్ ఆధ్వర్యంలో ‘హెర్’ టీం
[ 19-04-2024]
మహిళల్ని వేధించే వారి భరతం పట్టడానికి జంటనగరాల (భువనేశ్వర్, కటక్) కమిషనరేట్ యంత్రాంగం ‘హై ఎఫిషియన్సీ రెస్పాన్స్ (హెరా) టీం ఏర్పాటు చేసింది. -
సత్వర విద్యుత్తు సేవలకు ‘సంచార సబ్ స్టేషన్’లు
[ 19-04-2024]
వేసవిలో ప్రజలకు మరింత మెరుగైన విద్యుత్తు సేవలు అందించేందుకు, సరఫరాలో అంతరాయం ఏర్పడితే సత్వర సేవలకు ‘సంచార సబ్ స్టేషన్’లు సిద్ధం చేశామని విద్యుత్తు సరఫరా సంస్థ ‘టాటా పవర్ సదరన్ ఒడిశా డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్’ (టీపీఎస్ఓడీఎల్) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది -
జగన్నాథునికి రూ.2.51 కోట్ల విరాళం
[ 19-04-2024]
రిలయన్స్ గ్రూపు సంస్థల అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ బుధవారం పూరీ శ్రీక్షేత్రానికి వచ్చారు. జగన్నాథుని సన్నిధిలో పూజలు చేశారు. -
సచిదాస్ కన్నుమూత
[ 19-04-2024]
జత్రా పార్టీ (నాటకాలు) దర్శకునిగా, నటునిగా ఖ్యాతి గాంచిన సచిదాస్ (91) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అస్వస్థతతో కటక్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. -
ఎవరి ప్రయోజనాల కోసం రెండుచోట్ల పోటీ?
[ 19-04-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మళ్లీ రెండుచోట్ల పోటీకి సిద్ధమయ్యారు. దీనివల్ల ప్రజలకు ఒరిగేదేమిటని? ఈ పోటీ ఎవరి ప్రయోజనాల కోసమని? సార్వత్రిక ఎన్నికల తర్వాత మరో ఉప ఎన్నిక, వ్యయప్రయాసలు మినహా సాధించేదేమిటని విమర్శలు వినిపిస్తున్నాయి. -
నేటి నుంచి మజ్జిగౌరీ చైత్రోత్సవాలు
[ 19-04-2024]
రాయగడ ఉత్కళాంధ్రుల ఇలవేల్పు, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి మజ్జిగౌరీ అమ్మవారి చైత్రోత్సవ సంబరాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. -
‘శ్రేష్ఠ భారత్’ ఏర్పాటుకు అంతా సహకరించాలి
[ 19-04-2024]
‘శ్రేష్ఠ భారత్’ లక్ష్యంగా దేశంలోని అన్ని ప్రాంతాలు, వర్గాలు, అన్ని రంగాల సమగ్ర అభివృద్ధికి ప్రధాని మోదీ 2024 సంకల్ప పత్రం జారీ చేశారని, ప్రజలంతా సహకరించి, మరోసారి మోదీని ప్రధాని చేసేందుకు ముందుకు రావాలని బ్రహ్మపుర లోక్సభ భాజపా అభ్యర్థి ప్రదీప్ కుమార్ పాణిగ్రహి కోరారు -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
[ 19-04-2024]
గంజాం జిల్లా గొళంత్రా ఠాణా పరిధిలోని కొణిసి-తుళు మార్గంలో బుధవారం మధ్యాహ్నం రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొన్న దుర్ఘటనలో ఇద్దరు యువకులు ఎమ్కేసీజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు