logo

డోలీ కట్టి.. గర్భిణి తరలింపు

పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళకు డోలీ కట్టి గంటపాటు మోసుకుని అంబులెన్స్‌ వద్దకు చేర్చారు.

Published : 07 Feb 2023 01:44 IST

అంబులెన్స్‌లో ధనాయిని ఎక్కిస్తున్న కుటుంబ సభ్యులు

జయపురం, న్యూస్‌టుడే: పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళకు డోలీ కట్టి గంటపాటు మోసుకుని అంబులెన్స్‌ వద్దకు చేర్చారు. కొరాపుట్‌ జిల్లా జయపురం సమితి రండాపల్లీ పంచాయతీలో రామగడలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. సోమవారం ఉదయం ధనాయి ముదిలికి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆశా కార్యకర్త కులమణి బొత్రకు సమాచారం అందజేయగా ఆమె రాబనగూడ ఆసుపత్రికి అంబులెన్స్‌ కోసం ఫోన్‌ చేసింది. రామగడకు దారి లేకపోవడంతో కొంత దూరంలో వాహనం ఆగిపోయింది. తప్పని పరిస్థితుల్లో కుటుంబసభ్యులు ధనాయికి డోలీ కట్టి అంబులెన్స్‌ దగ్గరకు చేర్చారు. అక్కడ నుంచి ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఆరోగ్యం క్షీణించడంతో జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని