యువతలో కంప్యూటర్ నైపుణ్యాలు అంతంత మాత్రమే
రాష్ట్ర యువతలో కంప్యూటర్ నైపుణ్యాలు అంతంతమాత్రంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం 20.6 శాతం యువత మాత్రమే ఫైల్స్ జోడించడం, ఈమెయిల్స్ పంపడం వంటి ప్రాథమిక కంప్యూటర్ నైపుణ్యాలు కలిగి ఉండడం గుబులు రేపుతోంది.
ఎస్ఎస్ఎస్వో తాజా నివేదికలో వెల్లడి
శిక్షణ పొందుతున్న యువతులు
రాయగడ పట్టణం, న్యూస్టుడే: రాష్ట్ర యువతలో కంప్యూటర్ నైపుణ్యాలు అంతంతమాత్రంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం 20.6 శాతం యువత మాత్రమే ఫైల్స్ జోడించడం, ఈమెయిల్స్ పంపడం వంటి ప్రాథమిక కంప్యూటర్ నైపుణ్యాలు కలిగి ఉండడం గుబులు రేపుతోంది. ఈ గణాంకాలను మంత్రిత్వశాఖ తాజాగా విడుదల చేసిన జాతీయ నమూనా సర్వే కార్యాలయ (ఎస్ఎస్ఎస్వో) 78వ రౌండ్ నివేదిక బహిర్గతం చేసింది. వాటి ప్రకారం... సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్డీజీ) ప్రోగ్రాం కింద జనవరి 2020, ఆగస్టు 2021ల మధ్య ఎస్ఎస్ఎస్వో ఈ సర్వే నిర్వహించింది. ఇందులో వివిధ అంశాల్లో అభివృద్ధితోపాటు కంప్యూటర్ వినియోగంలో పరిజ్ఞానంపై సర్వే చేపట్టారు. రాష్ట్రంలో 15-24 ఏళ్ల మధ్య యువతలో చాలామంది వివిధ సమాచార, సాంకేతిక అంశాలకు సంబంధించి సరైన ప్రదర్శన చేయలేకపోవడం గమనార్హం. 15-29 ఏళ్ల మధ్య వారిలో ఇది మరింత తగ్గి 19.3 శాతంగా నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. కంప్యూటర్ నైపుణ్యానికి సంబంధించి తొమ్మిది అంశాల్లో యువత పరిజ్ఞానాన్ని పరీక్షించినట్లు నివేదిక స్పష్టం చేసింది.
అంతంతమాత్రం.. అంతర్జాల సౌకర్యం
రాష్ట్రవ్యాప్తంగా కేవలం 24.8 శాతం కుటుంబాలకు మాత్రమే అంతర్జాల సదుపాయం ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఇది జాతీయ సగటు (32.1 శాతం) కంటే 7.3శాతం తక్కువగా ఉండడం గమనార్హం. కంప్యూటర్ అక్షరాస్యత రేటు అంశంలోనూ కేవలం 32.2 శాతంతో పొరుగు రాష్ట్రాలైన ఏపీ (45.5 శాతం), తెలంగాణ (53.8), పశ్చిమ్బెంగాల్ (43.1) కంటే వెనుకబడి ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. 15-29 ఏళ్ల వారిలో కేవలం 1.2 శాతం మంది మాత్రమే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ప్రావీణ్యం కలిగి ఉన్నట్లు స్పష్టం చేసింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలు, పురుషులు, మహిళలపరంగా చూస్తే కంప్యూటర్ పరిజ్ఞానంలో ఆయా కేటగిరీల మధ్య చాలా వ్యత్యాసమున్నట్లు బహిర్గతం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
[ 25-04-2024]
ఒడిశాలో కోరాపుట్ జిల్లా పాడువా సమీపంలో గురువారం సాయంత్రం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. -
అభివృద్ధి కొనసాగుతుంది..శంక ద్వయాన్ని ఆశీర్వదించండి
[ 25-04-2024]
రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతుందని, బిజదను ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రజల్ని కోరారు. -
భాజపాకు 40 మంది స్టార్ ప్రచారకులు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాజపా స్టార్ ప్రచారకుల జాబితా మంగళవారం రాత్రి విడుదల చేశారు. -
ఇంకెన్నాళ్లీ దుస్థితి?
[ 25-04-2024]
అధ్వానంరాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలు అధ్వానంగా ఉన్నాయన్న నివేదికలు దిగజారిన ‘నాక్’ గ్రేడేషన్లు దుస్థితిని తెలియజేస్తున్నాయని కేంద్రమంత్రి నిలదీశారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో భర్తీకాని టీచింగ్ సిబ్బంది, అసౌకర్యాలు, ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల డ్రాపౌట్ల గురించి ఏం సమాధానం చెబుతారన్నారు. -
ఓ తండ్రి...ఇద్దరు కొడుకులు
[ 25-04-2024]
గత అయిదున్నర దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన నేత ఆయన. అన్ని పార్టీల నేతల మన్ననలు అందుకున్న వ్యక్తి. వయసుతోపాటు గౌరవం, నిక్కచ్చితనం పెంచుకున్న నికార్సయిన నేత. 80 ఏళ్ల వయసులో కొడుకు నిర్వాకంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
నామినేషన్ల సందడి
[ 25-04-2024]
బ్రహ్మపుర లోకసభ పరిధిలోని పర్లాఖెముండి నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిగా కోడూరు నారాయణరావు నామినేషన్ పత్రాన్ని సబ్ కలెక్టర్ అనూప్ పండాకు అందజేశారు. -
భాజపాలో సీమారాణి చేరిక
[ 25-04-2024]
బిజదకు రాజీనామా చేసిన హిందళ్ సిటింగ్ ఎమ్మెల్యే సీమారాణి నాయక్ బుధవారం భాజపాలో చేరారు. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, ఇతర నాయకులు ఆమెను స్వాగతించారు. -
నేడు అమిత్షా రాక
[ 25-04-2024]
కేంద్ర హోంమంత్రి అమిత్షా గురువారం రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. మధ్యాహ్నం సోన్పూర్లో ఏర్పాటయ్యే ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగిస్తారు. -
నా ఓటు.. నా బాధ్యత
[ 25-04-2024]
నా ఓటు నా బాధ్యత అంటూ, తప్పకుండా ఓటు వినియోగించుకుంటామని నూతన ఓటర్లు, కళాశాల విద్యార్థులన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!