logo

దమంజోడిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

కొరాపుట్‌ జిల్లా దమంజోడిలో నాల్కో కర్మాగారం సమీపంలో  సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది సోమవారం ఉదయం పెట్రోలింగ్‌ చేస్తుండగా అగ్నిమాపక కేంద్రం వెనుక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది.

Published : 21 Mar 2023 03:16 IST

సిమిలిగుడ, న్యూస్‌టుడే: కొరాపుట్‌ జిల్లా దమంజోడిలో నాల్కో కర్మాగారం సమీపంలో  సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది సోమవారం ఉదయం పెట్రోలింగ్‌ చేస్తుండగా అగ్నిమాపక కేంద్రం వెనుక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. వెంటనే జవాన్లు ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. అయితే మృతి చెందిన వ్యక్తి ఆచూకీ లభించలేదు. సుమారు 40 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి మట్టి రంగు ప్యాంటు, నీలం రంగు టీషర్టు వేసుకొని మృతి చెంది ఉండగా, ఇది హత్య లేక ఆత్మహత్య అన్నది ఇంకా తెలియలేదని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని