logo

మహిళల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

మహిళల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని కొరాపుట్‌ జిల్లా మహిళ బిజద పర్యవేక్షకురాలు, ముక్తా పథకం సలహాదారులు మీరా పరిఢ అన్నారు.

Published : 21 Mar 2023 03:16 IST

పార్టీ నాయకులతో సమావేశమైన మీరా

సిమిలిగుడ, న్యూస్‌టుడే: మహిళల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని కొరాపుట్‌ జిల్లా మహిళ బిజద పర్యవేక్షకురాలు, ముక్తా పథకం సలహాదారులు మీరా పరిఢ అన్నారు. ఆమె సోమవారం సునాబెడలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ముక్తా పథకం అభివృద్ధి పనులు పరిశీలించారు. అనంతరం జాగృతి మహిళ సంఘం కార్యాలయంలో ఏర్పాటైన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీరా మాట్లాడుతూ.. మహిళలతోనే పార్టీకి మంచి గుర్తింపు వస్తుందన్నారు. కొరాపుట్‌ ఎమ్మెల్యే రఘురామ్‌ పడల్‌ మాట్లాడుతూ.. మహిళా కార్యకర్తలు పార్టీకి పూర్వా వైభవం తీసుకురావాలని కోరారు. కౌన్సిలర్‌ స్వర్ణ ప్రభ పట్నాయక్‌ అధ్యక్షతలో పురాధ్యక్షులు రాజేంద్ర కుమార్‌ పాత్ర్‌, జోనల్‌ మహిళ అధ్యక్షురాలు లతా రాయ్‌, జిల్లా మహిళా అధ్యక్షురాలు పార్వతి మస్తీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని