logo

పక్షుల కళేబరాలు స్వాధీనం: ఇద్దరి అరెస్టు

చిలికా వన్యప్రాణి డివిజన్‌ పరిధిలో టాంగీ రేంజ్‌లోని ఛకటిపూర్‌ రైల్వే గేటు సమీపాన సోమవారం ఉదయం ఇద్దరు వ్యక్తుల్ని అనుమానంతో పట్టుకుని సోదాలు నిర్వహించారు.

Published : 21 Mar 2023 03:16 IST

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: చిలికా వన్యప్రాణి డివిజన్‌ పరిధిలో టాంగీ రేంజ్‌లోని ఛకటిపూర్‌ రైల్వే గేటు సమీపాన సోమవారం ఉదయం ఇద్దరు వ్యక్తుల్ని అనుమానంతో పట్టుకుని సోదాలు నిర్వహించారు. వారి వద్ద మూడు పక్షుల కళేబరాలు లభించాయి. వాటితోపాటు ద్విచక్ర వాహనం, మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని అటవీ రేంజర్‌ చూడారాణి ముర్ము సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. నిందితుల్ని అరెస్టు చేసి న్యాయస్థానానికి తరలించినట్లు ఆమె పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని