సభలో మహానది వివాదం
శాసనసభలో గురువారం మహానది వివాదం పాలక, విపక్షాల పరస్పర ఆరోపణలకు దారితీసింది. దీంతో ప్రశ్నోత్తరాలు, శూన్యగంట కార్యక్రమాలు నిర్వహించలేకపోయారు.
భువనేశ్వర్, న్యూస్టుడే: శాసనసభలో గురువారం మహానది వివాదం పాలక, విపక్షాల పరస్పర ఆరోపణలకు దారితీసింది. దీంతో ప్రశ్నోత్తరాలు, శూన్యగంట కార్యక్రమాలు నిర్వహించలేకపోయారు. ఉదయం సభాపతి బిక్రంకేసరి అరుఖ్ సభా కార్యక్రమాలు ప్రారంభించిన తర్వాత భాజపా, కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకొచ్చి నినాదాలు చేశారు. నవీన్ పట్నాయక్ ప్రభుత్వం మహానది జలాలను కాపాడడంలో విఫలమైందని దుయ్యబట్టారు. దీంతో బిజద సభ్యులు కలగజేసుకొని కేంద్రంలోని భాజపా, ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ పాలకులపై ఆరోపణలు గుప్పించారు. సభలో ఉద్రిక్తత నెలకొనగా కార్యక్రమాలు సాయంత్రం వరకు వాయిదా పడ్డాయి.
23 ఏళ్లు ఏం చేశారు?.. అనంతరం భాజపా పక్షం కార్యదర్శి మోహన్ మాఝి విలేకరులతో మాట్లాడుతూ... 23 ఏళ్లుగా పాలిస్తున్న నవీన్ మహానది పరివాహక ప్రాంతంలో 9 ఆనకట్టల నిర్మాణం చేస్తామని చెప్పినా ఇంతవరకు ఒక్కటైనా నిర్మించారా అని ప్రశ్నించారు. పక్క రాష్ట్రం నిర్మాణాలు చేపడుతోందని, ఈ పరిణామాలపై కేంద్రానికి ఫిర్యాదులు చేయడం మినహా బిజద నేతలు ఏం సాధించారని ప్రశ్నించారు. అవకాశాలున్నా సద్వినియోగం చేసుకోలేకపోయిన పాలకులు ఉద్దేశపూర్వకంగా ఛత్తీస్గఢ్కు సహకరించారన్నారు. సభలో ఈ అంశాన్ని లేవనెత్తితే సభాపతి ద్వారా సభను వాయిదా వేయిస్తున్నారన్నారు.
జల వనరులకు కొదవలేదు.. కాంగ్రెస్, సభాపక్షం నేత నర్సింగ మిశ్ర విలేకరులతో మాట్లాడుతూ... పుష్కల జల వనరులున్న రాష్ట్రానికి వేసవిలో నీటి ఎద్దడి ఎదురవడం సిగ్గు చేటన్నారు. హిరాకుడ్ నిర్మాణం తర్వాత మహానది పరివాహక ప్రాంతంలో మరో భారీ ప్రాజెక్టు కలగానే మిగిలిపోయిందని, నవీన్ సుదీర్ఘ పాలనంతా చవకబారు పథకాలకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. నదీ జలాల నిర్వహణకు సంబంధించి ఇంతవరకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేయలేకపోయిన ప్రభుత్వం తన అసమర్ధత అంగీకరించకుండా ఇతరులపై ఆరోపణలు చేస్తోందన్నారు.
కేంద్రం, ఛత్తీస్గఢ్లు జవాబుదారీ.. బిజద సీనియర్ నేత, పార్టీ అధికార ప్రతినిధి ప్రతాప్ జెనా విలేకరులతో మాట్లాడుతూ... మహానది జల వివాదానికి కేంద్రం, ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం జవాబుదారీ అన్నారు. జలవనరుల చట్టాలను అతిక్రమించి ఏకపక్షంగా నిర్మాణాలు చేసిన పొరుగు రాష్ట్రానికి కేంద్రం సహకరించిందన్నారు. భాజపా, కాంగ్రెస్లు అన్నదమ్ముల్లా వ్యవహరించాయన్నారు. దీనిపై సభలో విపక్షాలు ఆందోళన చేసి కార్యక్రమాలకు అంతరాయం కలిగించాయని, విలువైన సభా సమయాన్ని వృథా చేశాయని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గొంతు కోసి యువకుడి దారుణ హత్య
[ 29-03-2024]
గజపతి జిల్లాలోని గుసాని సమితి గురండి ఠాణా పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. -
కాషాయం కండువాలు ధరించిన అగ్రనేతలు
[ 29-03-2024]
దిల్లీ భాజపా కార్యాలయం వేదికగా గురువారం మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో ఇద్దరు ప్రముఖ నేతలు, మరో ప్రముఖ రచయిత్రి కాషాయం కండువాలు ధరించారు. -
తోడేలు దాడిలో ఇద్దరికి గాయాలు
[ 29-03-2024]
మల్కాన్గిరి సమితి ఎమ్.వి.93 గ్రామంలో ఇద్దరిపై తోడేలు దాడి చేయడంతో, పోరాడి హతమార్చారు. ఈ క్రమంలో వీరికి తీవ్ర గాయాలయ్యాయి -
డబుల్ ఇంజిన్ పాలన తథ్యం: అపరాజిత
[ 29-03-2024]
రాష్ట్రంలో భాజపా డబుల్ ఇంజిన్ పాలన తథ్యమని, ప్రజల్లో మార్పు కనిపిస్తోందని భువనేశ్వర్ సిటింగ్ ఎంపీ అపరాజిత షడంగి చెప్పారు. -
బిజదలో అసమ్మతి సెగ
[ 29-03-2024]
ఎన్నికల ముందు అధికార పక్షం బిజదలో అసమ్మతి సెగ తగలడంతో పార్టీకి తలనొప్పిగా మారుతోంది. రాయగడ శాసనసభ నియోజకవర్గ టికెట్ అనుసూయ మాఝికి కేటాయించడంపై రెండు వర్గాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటుండడం పార్టీ శ్రేణులకు మింగుడుపడడం లేదు -
గోపాల్పూర్ ఓడరేవు కొనుగోలు చేసిన అదానీ
[ 29-03-2024]
తూర్పు తీరంలో సరకు రవాణాలో అగ్రగామిగా ఉన్న గోపాల్పూర్ ఓడరేవును ప్రముఖ పారిశ్రామిక గ్రూపు అదానీ కొనుగోలు చేసింది -
ప్రతిష్ఠాత్మక నియోజకవర్గం పోరు రసవత్తరం
[ 29-03-2024]
బిజద అభ్యర్థి బిక్రం పండాకు గోపాల్పూర్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నియోజకవర్గం ఓటర్లందరికీ చిరపరిచితులు. భంజవిహార్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఆయన తొలినాళ్లలో విద్యార్థి నేత -
ఎన్నికల బరిలో అతివలకు అవకాశం
[ 29-03-2024]
ఎన్నికల్లో మహిళా అభ్యర్థులకు అధిక ప్రాధాన్యం ఇస్తామని బిజద ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పినట్లుగా ఎన్నికల బరిలో పోటీపడేందుకు మహిళలకు అవకాశం కల్పించారు. -
‘రిడ్లీ’ల రాకకు ఎదురుచూపు
[ 29-03-2024]
విదేశీ అతిథులు ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేళ్ల రాక వల్ల గంజాం జిల్లా ఖ్యాతిగాంచింది. రాష్ట్రంలోని రిడ్లీల పునరుత్పత్తికి మూడు కేంద్రాలుండగా, వీటిలో గంజాం జిల్లాలోని రుషికుల్యా ముఖద్వారం ఒకటి. -
శ్రీక్షేత్రంలో మీనాక్షి శేషాద్రి
[ 29-03-2024]
ప్రముఖ బాలీవుడ్ (ముంబయి) నటి, నర్తకి మీనాక్షి శేషాద్రి గురువారం పూరీ వచ్చారు. శ్రీక్షేత్రంలో జగన్నాథుడి సన్నిధిలో పూజలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్