సజావుగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు
ప్రతిష్ఠాత్మక ‘గంజాం న్యాయవాదుల సంఘం’ (జీబీఏ) కొత్త కార్యవర్గం ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ఎన్నికల అధికారి అఖయ కుమార్ పట్నాయక్ చెప్పారు.
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎన్నికల అధికారి అఖయ కుమార్ పట్నాయక్, ఇతర అధికారులు
బ్రహ్మపుర నగరం, న్యూస్టుడే: ప్రతిష్ఠాత్మక ‘గంజాం న్యాయవాదుల సంఘం’ (జీబీఏ) కొత్త కార్యవర్గం ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ఎన్నికల అధికారి అఖయ కుమార్ పట్నాయక్ చెప్పారు. గురువారం మధ్యాహ్నం జీబీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏర్పాట్ల గురించి వివరించారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులకు ఈ నెల 25న (శనివారం) ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ జీబీఏ కార్యాలయంలో పోలింగు నిర్వహిస్తామన్నారు. ఒక్కో పదవికి రెండేసి బ్యాలెట్ పెట్టెలు సిద్ధం చేశామన్నారు. ఆరు పోలింగు బూత్లు ఏర్పాటవుతాయన్నారు. మొత్తం, 1,516 మంది ఓటర్లున్నారని తెలిపారు. అదేరోజు సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, పూర్తయిన వెంటనే ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపులో అభ్యర్థి తరఫున ఒక్కో ఏజెంటును పంపాలని తెలిపామన్నారు. పోలింగు, ఓట్ల లెక్కింపు తదితరాలు సజావుగా సాగేందుకు ముప్పై మంది సహాయ ఎన్నికల అధికారుల నియామకం జరిగిందన్నారు. పోలింగు రోజు జీబీఏ కార్యాలయంవైపు వాహనాలు రాకుండా ట్రాఫిక్ను నియంత్రించాలని బ్రహ్మపుర ఎస్పీకి లేఖ రాసినట్లు ఎన్నికల అధికారి పట్నాయక్ వెల్లడించారు. విలేకరుల సమావేశంలో సహాయ ఎన్నికల అధికారులు నయనచంద్ర మహాపాత్ర్, శిశిర్కుమార్ భల్, తాజా మాజీ కార్యదర్శి సుశీల్కుమార్ త్రిపాఠి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధి కొనసాగుతుంది..శంక ద్వయాన్ని ఆశీర్వదించండి
[ 25-04-2024]
రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతుందని, బిజదను ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రజల్ని కోరారు. -
భాజపాకు 40 మంది స్టార్ ప్రచారకులు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాజపా స్టార్ ప్రచారకుల జాబితా మంగళవారం రాత్రి విడుదల చేశారు. -
ఇంకెన్నాళ్లీ దుస్థితి?
[ 25-04-2024]
అధ్వానంరాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలు అధ్వానంగా ఉన్నాయన్న నివేదికలు దిగజారిన ‘నాక్’ గ్రేడేషన్లు దుస్థితిని తెలియజేస్తున్నాయని కేంద్రమంత్రి నిలదీశారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో భర్తీకాని టీచింగ్ సిబ్బంది, అసౌకర్యాలు, ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల డ్రాపౌట్ల గురించి ఏం సమాధానం చెబుతారన్నారు. -
ఓ తండ్రి...ఇద్దరు కొడుకులు
[ 25-04-2024]
గత అయిదున్నర దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన నేత ఆయన. అన్ని పార్టీల నేతల మన్ననలు అందుకున్న వ్యక్తి. వయసుతోపాటు గౌరవం, నిక్కచ్చితనం పెంచుకున్న నికార్సయిన నేత. 80 ఏళ్ల వయసులో కొడుకు నిర్వాకంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
నామినేషన్ల సందడి
[ 25-04-2024]
బ్రహ్మపుర లోకసభ పరిధిలోని పర్లాఖెముండి నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిగా కోడూరు నారాయణరావు నామినేషన్ పత్రాన్ని సబ్ కలెక్టర్ అనూప్ పండాకు అందజేశారు. -
భాజపాలో సీమారాణి చేరిక
[ 25-04-2024]
బిజదకు రాజీనామా చేసిన హిందళ్ సిటింగ్ ఎమ్మెల్యే సీమారాణి నాయక్ బుధవారం భాజపాలో చేరారు. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, ఇతర నాయకులు ఆమెను స్వాగతించారు. -
నేడు అమిత్షా రాక
[ 25-04-2024]
కేంద్ర హోంమంత్రి అమిత్షా గురువారం రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. మధ్యాహ్నం సోన్పూర్లో ఏర్పాటయ్యే ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగిస్తారు. -
నా ఓటు.. నా బాధ్యత
[ 25-04-2024]
నా ఓటు నా బాధ్యత అంటూ, తప్పకుండా ఓటు వినియోగించుకుంటామని నూతన ఓటర్లు, కళాశాల విద్యార్థులన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు