అలరించిన సంగీత విభావరి
తేజస్వి మైదానంలో జరుగుతున్న ఉగాది ఉత్సవాల్లో రెండో రోజు నిర్వహించిన సినీ సంగీత విభావరి అలరించింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ చలన చిత్ర గాయకులు ఎస్పీ చరణ్, కల్పన, అదితి భావరాజు, జయంత్, పాత, కొత్త పాటలు పాడి మైమరిపించారు.
పాట పాడుతున్న ఎస్పీ చరణ్, అదితి భావరాజు, జయంత్
రాయగడ, న్యూస్టుడే: తేజస్వి మైదానంలో జరుగుతున్న ఉగాది ఉత్సవాల్లో రెండో రోజు నిర్వహించిన సినీ సంగీత విభావరి అలరించింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ చలన చిత్ర గాయకులు ఎస్పీ చరణ్, కల్పన, అదితి భావరాజు, జయంత్, పాత, కొత్త పాటలు పాడి మైమరిపించారు. ప్రముఖ బుల్లితెర యాంకర్ శ్యామల వ్యాఖ్యతగా వ్యవహరించారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నెక్కంటి భాస్కరరావు, కన్వీనర్ రాయిసింగి బిడిక, మహేష్ పట్నాయక్, చంద్రమౌళి కుమందాన్, రాఘవ కుమందాన్తోపాటు ఎంపీ సప్తగిరి ఉలక, పార్టీలకతీతంగా రాజకీయ ప్రతినిధులు, ప్రజలు హాజరయ్యారు. ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
రాయగడ గ్రామీణం: ఉత్కళ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో జేకే రోడ్డు బజాజ్ షోరూం ఎదురుగా ఏర్పాటు చేసిన ఉగాది వేడుకలు సందడిగా జరుగుతున్నాయి. కార్యక్రమంలో పాల్గొన్న కథనాయిక మెహరీన్ కాసేపు సందడి చేయగా, జబర్దస్త్ కళాకారులు ఫైమా, వినోద్ స్కిట్లు నవ్వులు కురిపించాయి. నృత్యాలు ఆకట్టుకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం