ఖుర్దాలో ఇరువర్గాల ఘర్షణ
ఖుర్దా జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని దెవులి గ్రామంలో బుధవారం రాత్రి రాజకీయ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీంతో ఇళ్లు, వాహనాలకు నిప్పంటించారు.
గ్రామంలో దగ్ధమవుతున్న వాహనాలు
భువనేశ్వర్ అర్బన్, న్యూస్టుడే: ఖుర్దా జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని దెవులి గ్రామంలో బుధవారం రాత్రి రాజకీయ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీంతో ఇళ్లు, వాహనాలకు నిప్పంటించారు. దాడుల్లో పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న కలెక్టర్, ఉప కలెక్టర్, ఎస్డీపీవో, తహసీల్దార్పాటు పలువురు పోలీస్ అధికారులు గ్రామానికి చేరుకొని ఘర్షణలు నివారించేందుకు చర్యలు తీసుకున్నారు. రెండు ప్లటూన్ల పోలీసు బలగాలను నియమించారు. గత పంచాయతీ ఎన్నికల నుంచి గ్రామంలో రెండు వర్గాల మధ్య వివాదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఏడాది జనవరిలో ఈ వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. అప్పట్లో పలువురు అరెస్టయ్యారు. గ్రామంలో ఉంటున్న హరి బలియార్ సింగ్ కుమారుడు ప్రదీప్ కూడా ఇటీవల జరిగిన ఘర్షణలో అరెస్టయ్యాడు. వారం రోజుల క్రితం ఆయన బయటకు వచ్చాడు. మంగళవారం ఆయన ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ప్రత్యర్థి వర్గానికి చెందిన కొంతమంది దాడి చేసి గ్రామ శివారులో ఉన్న తోటలో వదిలేసి వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ప్రదీప్ తండ్రి మద్దతదారులతో అక్కడికి చేరుకొని గాయపడిన ప్రదీప్ను భువనేశ్వర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. బుధవారం ప్రదీప్ మృతి చెందాడు. ఈ ఘటనకు స్థానిక సర్పంచి కారణమని ఆరోపిస్తూ ప్రదీప్ మద్దతదారులు బుధవారం రాత్రి బెగునియా పోలీస్ స్టేషన్ ఎదుట మృతదేహంతో ధర్నా, 57వ నెంబరు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సర్పంచి వర్గానికి చెందిన వారి రెండు నాలుగు చక్రాల వాహనాలకు, పొలంలోని ధాన్యం కుప్పలకు నిప్పంటించారు. దీంతో గ్రామంలో పోలీసులు 144వ సెక్షన్ అమలు చేశారు. ఆందోళనకారులతో చర్చించి ప్రదీప్ కుటుంబానికి తాత్కాలికంగా రూ.20 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. మరోవైపు హత్య నేరం కింద ఫిర్యాదు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
[ 25-04-2024]
ఒడిశాలో కోరాపుట్ జిల్లా పాడువా సమీపంలో గురువారం సాయంత్రం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. -
అభివృద్ధి కొనసాగుతుంది..శంక ద్వయాన్ని ఆశీర్వదించండి
[ 25-04-2024]
రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతుందని, బిజదను ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రజల్ని కోరారు. -
భాజపాకు 40 మంది స్టార్ ప్రచారకులు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాజపా స్టార్ ప్రచారకుల జాబితా మంగళవారం రాత్రి విడుదల చేశారు. -
ఇంకెన్నాళ్లీ దుస్థితి?
[ 25-04-2024]
అధ్వానంరాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలు అధ్వానంగా ఉన్నాయన్న నివేదికలు దిగజారిన ‘నాక్’ గ్రేడేషన్లు దుస్థితిని తెలియజేస్తున్నాయని కేంద్రమంత్రి నిలదీశారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో భర్తీకాని టీచింగ్ సిబ్బంది, అసౌకర్యాలు, ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల డ్రాపౌట్ల గురించి ఏం సమాధానం చెబుతారన్నారు. -
ఓ తండ్రి...ఇద్దరు కొడుకులు
[ 25-04-2024]
గత అయిదున్నర దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన నేత ఆయన. అన్ని పార్టీల నేతల మన్ననలు అందుకున్న వ్యక్తి. వయసుతోపాటు గౌరవం, నిక్కచ్చితనం పెంచుకున్న నికార్సయిన నేత. 80 ఏళ్ల వయసులో కొడుకు నిర్వాకంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
నామినేషన్ల సందడి
[ 25-04-2024]
బ్రహ్మపుర లోకసభ పరిధిలోని పర్లాఖెముండి నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిగా కోడూరు నారాయణరావు నామినేషన్ పత్రాన్ని సబ్ కలెక్టర్ అనూప్ పండాకు అందజేశారు. -
భాజపాలో సీమారాణి చేరిక
[ 25-04-2024]
బిజదకు రాజీనామా చేసిన హిందళ్ సిటింగ్ ఎమ్మెల్యే సీమారాణి నాయక్ బుధవారం భాజపాలో చేరారు. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, ఇతర నాయకులు ఆమెను స్వాగతించారు. -
నేడు అమిత్షా రాక
[ 25-04-2024]
కేంద్ర హోంమంత్రి అమిత్షా గురువారం రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. మధ్యాహ్నం సోన్పూర్లో ఏర్పాటయ్యే ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగిస్తారు. -
నా ఓటు.. నా బాధ్యత
[ 25-04-2024]
నా ఓటు నా బాధ్యత అంటూ, తప్పకుండా ఓటు వినియోగించుకుంటామని నూతన ఓటర్లు, కళాశాల విద్యార్థులన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!