సజావుగా జీబీఏ ఎన్నికలు
ప్రతిష్ఠాత్మక ‘గంజాం న్యాయవాదుల సంఘం’ (జీబీఏ) కొత్త కార్యవర్గం ఎన్నికలకు శనివారం నిర్వహించిన పోలింగు ప్రశాంతంగా జరిగింది.
పోలింగును పర్యవేక్షిస్తున్న ఎన్నికల అధికారి అఖయ కుమార్ పట్నాయక్. చిత్రంలో సహాయ ఎన్నికల అధికారులు, ఇతరులు
బ్రహ్మపుర నగరం, న్యూస్టుడే: ప్రతిష్ఠాత్మక ‘గంజాం న్యాయవాదుల సంఘం’ (జీబీఏ) కొత్త కార్యవర్గం ఎన్నికలకు శనివారం నిర్వహించిన పోలింగు ప్రశాంతంగా జరిగింది. స్థానిక జిల్లా జడ్జి కోర్టు సమీపంలోని జీబీఏ కార్యాలయం సమావేశ మందిరంలో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ నిర్వహించిన పోలింగులో పలువురు న్యాయవాదులు పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. న్యాయవాది అయిన బీఈఎంసీ మేయరు సంఘమిత్ర దొళాయి కూడా ఓటు వేశారు. ఎన్నికల అధికారి అఖయ కుమార్ పట్నాయక్తోపాటు మరో ముప్పై మంది సహాయ ఎన్నికల అధికారులు పోలింగు ప్రక్రియ పర్యవేక్షించారు. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలైంది.
అంతటా ప్రశాంతం.. కటక్, న్యూస్టుడే: రాష్ట్రంలో న్యాయవాదుల సంఘాలకు శనివారం నిర్వహించిన ఎన్నికలు శాంతియుతంగా జరిగాయి. 133 సంఘాలకు ఎన్నికలు జరగ్గా రాష్ట్రవ్యాప్తంగా 33 వేల మంది పోలింగ్లో పాల్గొన్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రక్రియ కొనసాగింది. కటక్లో హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు, కార్యదర్శి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల పదవులకు కూడా ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్ష పదవికి నలుగురు, కార్యదర్శి పదవికి 13 మంది పోటీలో ఉన్నారు.
ఓటు హక్కు వినియోగించుకుంటున్న న్యాయవాదులు. ఓటు వేసేందుకు నిల్చున్న బీఈఎంసీ మేయరు సంఘమిత్ర దొళాయి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నితీష్ గమ్యం ఎటువైపు?
[ 20-04-2024]
సంబల్పూర్ సిటింగ్ ఎంపీ నితీష్ గమ్యం ఎటువైపు? ఈసారి ఎన్నికల్లో ఆయన భార్య అరుంధతీ దేవి తరఫున ప్రచారం చేస్తారా? భాజపాకు అనుకూలంగా ఉంటారా? అన్నదిప్పుడు చర్చనీయాంశమైంది. -
కనుల పండువగా చైత్రోత్సవాలు
[ 20-04-2024]
శక్తి స్వరూపిణి, శాంతి స్వరూపిణి మజ్జిగౌరీ అమ్మవారి చైత్రోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. -
మౌలిక సౌకర్యాలకు దూరం.. ఎన్నికల బహిష్కరణ నిర్ణయం
[ 20-04-2024]
కొంధమాల్ జిల్లా బలిగుడ సమితిలో రుతుంగియా పంచాయతీలోని గగలిమహ, పనిపదర్, పాంగాబడి గ్రామాలకు రహదారులు, తాగునీరు, అంగన్వాడీ వంటి మౌలిక సౌకర్యాలు లేవు. -
మహిళా ఓటర్లే అత్యధికం
[ 20-04-2024]
రాష్ట్రంలో తొలివిడత ఎన్నికలు జరగనున్న నాలుగు లోక్సభ స్థానాల్లో పురుషులకంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) నికుంజ బిహారీ ధొళో అన్నారు. -
బ్రహ్మపురలో నామినేషన్ల పర్వం
[ 20-04-2024]
బ్రహ్మపుర సబ్కలెక్టరు కార్యాలయం, పరిసరాలు రెండోరోజు శుక్రవారం నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన అభ్యర్థులు, వారి మద్దతుదారులతో కిటకిటలాడింది. -
భాజపా మోదీ మంత్రం.. బిజద అభివృద్ధి అస్త్రం
[ 20-04-2024]
ప్రధాన పార్టీలు ఎన్నికల్లో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేస్తున్నాయి. మండుటెండలను కూడా లెక్క చేయకుండా ఓటర్ల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతున్నారు. రోడ్షోలు, పాదయాత్రలు, సభలు నిర్వహిస్తున్నారు. -
మహానదిలో పడవ మునక: ఇద్దరి దుర్మరణం
[ 20-04-2024]
ఝార్సుగుడ జిల్లా లఖన్పూర్ సమితి ఛత్తీస్గఢ్ సరిహద్దు శారదా వద్ద శుక్రవారం సాయంత్రం మహానదిలో పడవ మునిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. -
నిప్పుల కొలిమిలా రాష్ట్రం
[ 20-04-2024]
రాష్ట్రం నిప్పులకొలిమిలా మారింది. భానుని ప్రతాపంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తీర ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటాయి. -
చాకుతో దాడి: యువకుడి హతం
[ 20-04-2024]
గంజాం జిల్లా నిమ్మఖండి ఠాణా పరిధిలోని బొరిగావ్ గ్రామంలోని అమ్మవారి మందిరం సమీపాన చెరువు ఒడ్డున గురువారం సాయంత్రం సునీల్ దాస్ (27) అనే యువకుడు, మరో యువకుడి మధ్య పాతకక్షల నేపథ్యంలో వాగ్వాదం జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్