108 మంది దంపతులకు పునర్వివాహాలు
సమాజంలో కులం పేరిట వేళ్లూనుకున్న దురాచారాలను చక్కదిద్దేందుకు ‘అగ్నికుల క్షత్రియ మహామండల సంఘం’ గంజాం జిల్లా వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టి అందరి ప్రశంసలు అందుకుంటోంది.
హిందూ సంప్రదాయం ప్రకారం సంస్కరణలు జరిపి, హోమాలు నిర్వహించి పెళ్లిళ్లు
బ్రహ్మపుర నగరం, న్యూస్టుడే: సమాజంలో కులం పేరిట వేళ్లూనుకున్న దురాచారాలను చక్కదిద్దేందుకు ‘అగ్నికుల క్షత్రియ మహామండల సంఘం’ గంజాం జిల్లా వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టి అందరి ప్రశంసలు అందుకుంటోంది. గతంలో కులాంతర వివాహాలు చేసుకున్నారన్న కారణంతో దూరంగా ఉంచిన అగ్నికుల క్షత్రియ దంపతులకు హిందూ సంప్రదాయం ప్రకారం మరోసారి వివాహాలు చేయించి కులంలో చేర్చుకుంది. గంజాం జిల్లా చికిటి సమితిలో గిరిసొలలోని పోలేరమ్మతల్లి మందిరం శ్రీచక్రవాహిని ఆవరణలో శుక్రవారం నిర్వహించిన వివాహ వేడుకల్లో 108 మంది దంపతులు పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా వారికి వివాహాలు చేయించిన నిర్వాహకులు వేలాది మందికి విందు భోజనాలు ఏర్పాటు చేశారు. జిల్లాలోని సుమారు యాభై గ్రామాలకు చెందిన వారికి ఈ పెళ్లిళ్లు చేయించామని, వీరిలో అయిదేళ్ల నుంచి నలభై ఏళ్ల కిందట పెళ్లయిన వారు కూడా ఉన్నారని నిర్వాహక సంఘం గంజాం జిల్లా అధ్యక్షుడు ఎం.నాగరాజు శనివారం రాత్రి ‘న్యూస్టుడే’కు చెప్పారు.
ఘనంగా 7వ మహాసభలు... సంఘం ఆధ్వర్యంలో ఇదే ఆవరణలో 7వ మహాసభలు శనివారం ఘనంగా నిర్వహించారు అగ్నికుల క్షత్రియులైన ప్రతిభ గల విద్యార్థులు, క్రీడాకారులు, మంచి ఉద్యోగాలు సాధించిన వారు, రాజకీయాల్లో రాణిస్తున్న సుమారు వంద మందికి మహాసభల్లో సన్మానించామని అధ్యక్షుడు నాగరాజు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధి కొనసాగుతుంది..శంక ద్వయాన్ని ఆశీర్వదించండి
[ 25-04-2024]
రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతుందని, బిజదను ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రజల్ని కోరారు. -
భాజపాకు 40 మంది స్టార్ ప్రచారకులు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాజపా స్టార్ ప్రచారకుల జాబితా మంగళవారం రాత్రి విడుదల చేశారు. -
ఇంకెన్నాళ్లీ దుస్థితి?
[ 25-04-2024]
అధ్వానంరాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలు అధ్వానంగా ఉన్నాయన్న నివేదికలు దిగజారిన ‘నాక్’ గ్రేడేషన్లు దుస్థితిని తెలియజేస్తున్నాయని కేంద్రమంత్రి నిలదీశారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో భర్తీకాని టీచింగ్ సిబ్బంది, అసౌకర్యాలు, ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల డ్రాపౌట్ల గురించి ఏం సమాధానం చెబుతారన్నారు. -
ఓ తండ్రి...ఇద్దరు కొడుకులు
[ 25-04-2024]
గత అయిదున్నర దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన నేత ఆయన. అన్ని పార్టీల నేతల మన్ననలు అందుకున్న వ్యక్తి. వయసుతోపాటు గౌరవం, నిక్కచ్చితనం పెంచుకున్న నికార్సయిన నేత. 80 ఏళ్ల వయసులో కొడుకు నిర్వాకంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
నామినేషన్ల సందడి
[ 25-04-2024]
బ్రహ్మపుర లోకసభ పరిధిలోని పర్లాఖెముండి నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిగా కోడూరు నారాయణరావు నామినేషన్ పత్రాన్ని సబ్ కలెక్టర్ అనూప్ పండాకు అందజేశారు. -
భాజపాలో సీమారాణి చేరిక
[ 25-04-2024]
బిజదకు రాజీనామా చేసిన హిందళ్ సిటింగ్ ఎమ్మెల్యే సీమారాణి నాయక్ బుధవారం భాజపాలో చేరారు. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, ఇతర నాయకులు ఆమెను స్వాగతించారు. -
నేడు అమిత్షా రాక
[ 25-04-2024]
కేంద్ర హోంమంత్రి అమిత్షా గురువారం రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. మధ్యాహ్నం సోన్పూర్లో ఏర్పాటయ్యే ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగిస్తారు. -
నా ఓటు.. నా బాధ్యత
[ 25-04-2024]
నా ఓటు నా బాధ్యత అంటూ, తప్పకుండా ఓటు వినియోగించుకుంటామని నూతన ఓటర్లు, కళాశాల విద్యార్థులన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం