ముగిసిన న్యాయవాదుల సంఘం ఎన్నికలు
న్యాయవాదుల సంఘం ఎన్నికలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. కొన్ని స్థానాలు ఏకగ్రీవం కాగా మరికొన్ని చోట్ల ఎన్నికలు ఎప్పుడూ లేనంతగా ఆసక్తిని రేకెత్తించాయి.
పర్లాఖెముండిలో విజయసంకేతం చూపిస్తున్న అధ్యక్షుడు సిద్దేశ్వర మిశ్రా, సభ్యులు
న్యాయవాదుల సంఘం ఎన్నికలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. కొన్ని స్థానాలు ఏకగ్రీవం కాగా మరికొన్ని చోట్ల ఎన్నికలు ఎప్పుడూ లేనంతగా ఆసక్తిని రేకెత్తించాయి. గెలుపొందిన వారు విజయ సంకేతాలను చూపుతూ సంబరాలు చేసుకున్నారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
న్యూస్టుడే బృందం
* రాయగడ జిల్లా గుణుపురం పట్టణంలో కోశాధికారి స్థానానికి మినహాయించి మిగతా అన్ని స్థానాలకు పోటీ జరిగింది. అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఉమాచరణ్ పట్నాయక్, ఉపాధ్యక్షుడిగా గణేశ్ సాహు గెలుపొందారు. కార్యదర్శి స్థానాన్ని విష్ణుచరణ్ పాఢి, సహ కార్యదర్శి స్థానాన్ని ఆర్డీ మిశ్ర కైవసం చేసుకున్నారు. కోశాధికారి పదవికి కైలాష్ సబర పోటీ లేకుండా విజయం సాధించారు. ఎన్నికల అధికారిగా సీనియర్ న్యాయవాది అక్షయశత్పథి ఉన్నారు.
* రాయగడ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా న్యాయవాది దేవీప్రసాద్ పట్నాయక్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా పద్మనాభ దాస్, కార్యదర్శిగా విశ్వనాధ్ గంతాయత్, సహాయ కార్యదర్శిగా పల్లి రామకృష్ణ, కోశాధికారిగా దమయంతి మహానందియా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన రాజేంద్ర సేనాపతి తెలిపారు.
రాయగడలో నూతన కార్యవర్గ సభ్యులు
* పర్లాఖెముండి బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా సిద్దేశ్వర మిశ్రా, కార్యదర్శిగా ఎం.పృథ్వీరాజ్ గెలుపొందారు. ఉపాధ్యక్షునిగా ఆర్.బాబూరావు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి కె.తాతయ్య వెల్లడించారు.
* సిమిలిగుడ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా సంతోష్ కుమార్ దాస్ గెలుపొందారు. ఎన్నికల అధికారిగా న్యాయవాది యుధిష్ఠిర్ ఉపాధ్యాయి వ్యవహరించారు. కార్యదర్శిగా విశ్వరంజన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
రాయగడ: గుణుపురం అధ్యక్షుడిగా ఉమాచరణ్ పట్నాయక్
* ప్రతిష్టాత్మకమైన ‘కొరాపుట్ న్యాయవాదుల సంఘం’ కొత్త కార్యవర్గం ఎన్నికలు శనివారం జయపురంలో జరిగాయి. అధ్యక్షుడిగా వీరేశ్ పట్నాయక్, ఉపాధ్యక్షుడిగా సహదేవ్ పట్నాయక్, కార్యదర్శిగా శరత్కుమార్ మాఝి గెలిచారు.
గుణుపురం సంఘ కార్యదర్శిగా విష్ణుపాఢి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధి కొనసాగుతుంది..శంక ద్వయాన్ని ఆశీర్వదించండి
[ 25-04-2024]
రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతుందని, బిజదను ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రజల్ని కోరారు. -
భాజపాకు 40 మంది స్టార్ ప్రచారకులు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాజపా స్టార్ ప్రచారకుల జాబితా మంగళవారం రాత్రి విడుదల చేశారు. -
ఇంకెన్నాళ్లీ దుస్థితి?
[ 25-04-2024]
అధ్వానంరాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలు అధ్వానంగా ఉన్నాయన్న నివేదికలు దిగజారిన ‘నాక్’ గ్రేడేషన్లు దుస్థితిని తెలియజేస్తున్నాయని కేంద్రమంత్రి నిలదీశారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో భర్తీకాని టీచింగ్ సిబ్బంది, అసౌకర్యాలు, ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల డ్రాపౌట్ల గురించి ఏం సమాధానం చెబుతారన్నారు. -
ఓ తండ్రి...ఇద్దరు కొడుకులు
[ 25-04-2024]
గత అయిదున్నర దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన నేత ఆయన. అన్ని పార్టీల నేతల మన్ననలు అందుకున్న వ్యక్తి. వయసుతోపాటు గౌరవం, నిక్కచ్చితనం పెంచుకున్న నికార్సయిన నేత. 80 ఏళ్ల వయసులో కొడుకు నిర్వాకంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
నామినేషన్ల సందడి
[ 25-04-2024]
బ్రహ్మపుర లోకసభ పరిధిలోని పర్లాఖెముండి నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిగా కోడూరు నారాయణరావు నామినేషన్ పత్రాన్ని సబ్ కలెక్టర్ అనూప్ పండాకు అందజేశారు. -
భాజపాలో సీమారాణి చేరిక
[ 25-04-2024]
బిజదకు రాజీనామా చేసిన హిందళ్ సిటింగ్ ఎమ్మెల్యే సీమారాణి నాయక్ బుధవారం భాజపాలో చేరారు. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, ఇతర నాయకులు ఆమెను స్వాగతించారు. -
నేడు అమిత్షా రాక
[ 25-04-2024]
కేంద్ర హోంమంత్రి అమిత్షా గురువారం రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. మధ్యాహ్నం సోన్పూర్లో ఏర్పాటయ్యే ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగిస్తారు. -
నా ఓటు.. నా బాధ్యత
[ 25-04-2024]
నా ఓటు నా బాధ్యత అంటూ, తప్పకుండా ఓటు వినియోగించుకుంటామని నూతన ఓటర్లు, కళాశాల విద్యార్థులన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు