రూ.2వేల కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం
ప్రజలందరి సహకారంతో గంజాం జిల్లాను దేశంలోనే ఆదర్శవంతమైన జిల్లాగా చేద్దామని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పిలుపునిచ్చారు.
గంజాం జిల్లాలో సీఎం నవీన్ పర్యటన
సాహితీవేత్తలకు జన్మనిచ్చిన నేలగా అభివర్ణన
గంజాం జిల్లా వాసులకు అభివాదం చేస్తూ..
బ్రహ్మపుర నగరం, న్యూస్టుడే: ప్రజలందరి సహకారంతో గంజాం జిల్లాను దేశంలోనే ఆదర్శవంతమైన జిల్లాగా చేద్దామని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పిలుపునిచ్చారు. ఆదివారం గంజాం జిల్లాలో పర్యటించిన ఆయన కవిసూర్యనగర్, హింజిలికాటు, ఛత్రపురంలలో నిర్వహించిన భారీ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. 22 సమితుల్లో సుమారు రూ.2 వేల కోట్లతో చేపట్టిన 590 అభివృద్ధి పనుల ప్రారంభించి, 235 పనులకు భూమిపూజ చేశారు. 20 వేల మందికి గ్రామకంఠ పట్టాలు అందజేశారు. మిషన్ శక్తి కింద 22,197 మహిళా స్వయం సంఘాలకు రూ.619.62 కోట్ల రుణాలు అందజేశారు. ప్రసంగించే ముందు జిల్లా ఆరాధ్యదైవం తరాతరిణిను స్మరించుకున్నారు.
50 వేల మందికి చికిత్స
కళలు, సంస్కృతుల ఖిల్లా గంజాం జిల్లా అని, స్వాతంత్య్ర పోరాటాల పోరుగడ్డ ఇదని ఉటంకించారు. ప్రముఖ సాహితీవేత్తలు కవిసామ్రాట్ ఉపేంద్ర భంజ్, కవిసూర్య బలదేవ్ రథ్లకు నివాళులర్పించారు. విద్య, ఆరోగ్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, బిజు స్వాస్థ్య కల్యాణ యోజన కింద గంజాం జిల్లాలో ఇంతవరకూ యాభై వేల మందికి చికిత్స అందించామని చెప్పారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.190 కోట్లకన్నా అధికంగా ఖర్చు చేసిందన్నారు. జిల్లాలో 630 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకుగాను 471 పాఠశాలల్ని 5టీ కింద ఆధునికీకరించామని, మిగిలిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఈ డిసెంబరులోగా ఆయా పనులు పూర్తి చేయనున్నట్లు చెప్పారు. మహిళా సంఘాలకు రూ.5 లక్షల వరకూ వడ్డీలేని రుణాలు ఇస్తున్నామన్నారు. రానున్న అయిదేళ్లలో రూ.50 వేల కోట్లు రుణాలు ఇచ్చేందుకు ప్రణాళిక రచిస్తున్నామన్నారు. మహిళలు పారిశ్రామికవేత్తలు కావాలని, ‘ఎస్హెచ్జీ’లు ‘ఎస్ఎంఈ’లు ఎదిగేందుకు ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తుందని తెలిపారు. రైతులకు వడ్డీలేని రూ.లక్ష రుణం ఇస్తున్నామని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో 5టీ కార్యదర్శి వి.కార్తికేయ పాండ్యన్ పాల్గొన్నారు. మంత్రులు ఉషాదేవి (గృహ, పట్టణాభివృద్ధి శాఖ), శ్రీకాంత్ సాహు (కార్మిక శాఖ), బ్రహ్మపుర, అస్కా ఎంపీలు చంద్రశేఖర్ సాహు, ప్రమీలా బిశోయి, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు, జిల్లాలోని వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఇతర బిజద నాయకులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో బిజద కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు.
భాజపా నల్లజెండాల ప్రదర్శన
నినాదాలు చేస్తున్న భాజపా నేతలను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గంజాం జిల్లా పర్యటనను భాజపా యువమోర్చా నాయకులు వ్యతిరేకించారు. ఛత్రపురంలో నవీన్ పర్యటిస్తుండగా నల్లజెండాలు ఊపి, నినాదాలు చేశారు. పోలీసులు ముప్ఫై మంది యువమోర్చా నాయకుల్ని అదుపులోకి తీసుకున్నారు. కొన్ని గంటల తరువాత విడిచిపెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
71 అసెంబ్లీ స్థానాలకు పోటీచేసేది వీరే..
[ 28-03-2024]
ముఖ్యమంత్రి, బిజద అధినేత నవీన్ పట్నాయక్ బుధవారం మధ్యాహ్నం వీడియో సందేశం ద్వారా 71 మందితో అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా స్వయంగా ప్రకటించారు. -
బిజద లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
[ 28-03-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 21 లోక్సభ స్థానాలకుబుధవారం 15 మందితో తొలి జాబితా ప్రకటించారు. వీరిలో ఇద్దరు మహిళలున్నారు. -
దాహం కేకలు
[ 28-03-2024]
రాయగడ జిల్లాలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. గుక్కెడు నీళ్ల కోసం ప్రజలు కటకటలాడుతున్నారు. -
తండ్రి ‘హస్తం’ కాదని... ‘శంఖం’ పిడికిట పట్టుకొని..
[ 28-03-2024]
సీనియర్ కాంగ్రెస్ నేత, ఖుర్దా జిల్లా జట్నీ ఎమ్మెల్యే సురేష్ రౌత్రాయి చిన్న కుమారుడు కెప్టెన్ మన్మధ రౌత్రాయి బుధవారం బిజదలో చేరారు. -
బస్సు బోల్తా: ఒకరి మృతి, 20 మందికి గాయాలు
[ 28-03-2024]
కొరాపుట్ నుంచి రాయగడకు వెళ్లే మార్గంలో పొడఘడ్ వద్ద మంగళవారం రాత్రి బస్సు బోల్తాపడడంతో ఒకరు మృతి చెందగా, 20 మందికి గాయాలయ్యాయి. -
చిట్ పేరిట రూ. 2 కోట్లకుపైగా టోకరా
[ 28-03-2024]
చిట్ఫండ్ పేరిట ఓ మహిళ రూ.2 కోట్లకుపైగా టోకరా వేసిన ఉదంతం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. -
ఆహుతవుతున్న పచ్చదనం
[ 28-03-2024]
రాష్ట్రంలో పచ్చదనం అగ్నికి ఆహుతవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2030 నాటికి అడవులకు నిప్పు ఘటనలు మరింత తీవ్ర రూపం దాల్చనున్నట్లు అధ్యయనాలు పేర్కొంటుండడం గుబులు రేపుతోంది. -
కేజ్రీవాల్పై కుట్ర పన్నారు
[ 28-03-2024]
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై కుట్ర పన్ని, తప్పుడు కేసులో అరెస్టు చేసి, అన్యాయంగా జైల్లో పెట్టారని ఆప్ నాయకులు ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ