సరకు రవాణాలో సరికొత్త రికార్డు
సరకు రవాణాలో తూర్పు కోస్తా రైల్వే మరో రికార్డుని సొంతం చేసుకుంది. వరుసగా రెండో ఏడాదిలో 200 మిలియన్ టన్నులకు పైగా సరకును లోడింగ్ చేసిన ఘనత దక్కించుకుంది.
రెండోసారి 200 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని పూర్తి చేసిన తూర్పు కోస్తారైల్వే
గూడ్స్ రైలులో లోడు చేస్తున్న బొగ్గు
రాయగడ పట్టణం, న్యూస్టుడే: సరకు రవాణాలో తూర్పు కోస్తా రైల్వే మరో రికార్డుని సొంతం చేసుకుంది. వరుసగా రెండో ఏడాదిలో 200 మిలియన్ టన్నులకు పైగా సరకును లోడింగ్ చేసిన ఘనత దక్కించుకుంది. రైల్వే జోన్ వర్గాలు మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం... ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో ఇప్పటివరకు 232.32 మి.టన్నుల సరకుని తూర్పుకోస్తా జోన్ రవాణా చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఇంకా కొద్ది రోజులు సమయమున్న నేపథ్యంలో రవాణా 240మి.టన్నులకు చేరుకోవచ్చని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి. 2021-22లో 223.64 మి.టన్నులను లోడు చేసిన జోన్ ఈ సారి మరింత సరకుని రవాణా చేయడం గమనార్హం. భారత రైల్వేలో వరుసగా 220, 230 మి.టన్నులకు పైగా సరకు రవాణా చేసిన జోన్గా తూర్పుకోస్తా నిలిచింది.
పెరిగిన ఆదాయం..
సరకు రవాణా ద్వారా 2021-22లో రూ.22,184.85 కోట్లు సంపాదించిన జోన్కు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.23,872.69 కోట్లు ఆదాయం సమకూరింది. గతేడాదితో పోలిస్తే ఈ సారి ఆదాయం 7.6 శాతం పెరిగినట్లు జోన్ వెల్లడించింది. జోన్ పరిధిలోని మూడు డివిజన్లకు చెందిన రైల్వే సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించడంతో పాటు రైల్వే జీఎం మనోజ్ శర్మ సహకారంతో ఇదంతా సాధ్యపడినట్లు అధికారులు పేర్కొన్నాయి. ఈ రికార్డుని సొంతం చేసుకోవడంలో ఓడ రేవులు, ఉక్కు అల్యూమినా, సిమెంట్ తదితర పరిశ్రమలతో పెట్రోలియం సంస్థలు, భారత ఆహార సంస్థల పాత్ర ఎంతో ఉందని రైల్వే వర్గాలు స్పష్టం చేశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నితీష్ గమ్యం ఎటువైపు?
[ 20-04-2024]
సంబల్పూర్ సిటింగ్ ఎంపీ నితీష్ గమ్యం ఎటువైపు? ఈసారి ఎన్నికల్లో ఆయన భార్య అరుంధతీ దేవి తరఫున ప్రచారం చేస్తారా? భాజపాకు అనుకూలంగా ఉంటారా? అన్నదిప్పుడు చర్చనీయాంశమైంది. -
కనుల పండువగా చైత్రోత్సవాలు
[ 20-04-2024]
శక్తి స్వరూపిణి, శాంతి స్వరూపిణి మజ్జిగౌరీ అమ్మవారి చైత్రోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. -
మౌలిక సౌకర్యాలకు దూరం.. ఎన్నికల బహిష్కరణ నిర్ణయం
[ 20-04-2024]
కొంధమాల్ జిల్లా బలిగుడ సమితిలో రుతుంగియా పంచాయతీలోని గగలిమహ, పనిపదర్, పాంగాబడి గ్రామాలకు రహదారులు, తాగునీరు, అంగన్వాడీ వంటి మౌలిక సౌకర్యాలు లేవు. -
మహిళా ఓటర్లే అత్యధికం
[ 20-04-2024]
రాష్ట్రంలో తొలివిడత ఎన్నికలు జరగనున్న నాలుగు లోక్సభ స్థానాల్లో పురుషులకంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) నికుంజ బిహారీ ధొళో అన్నారు. -
బ్రహ్మపురలో నామినేషన్ల పర్వం
[ 20-04-2024]
బ్రహ్మపుర సబ్కలెక్టరు కార్యాలయం, పరిసరాలు రెండోరోజు శుక్రవారం నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన అభ్యర్థులు, వారి మద్దతుదారులతో కిటకిటలాడింది. -
భాజపా మోదీ మంత్రం.. బిజద అభివృద్ధి అస్త్రం
[ 20-04-2024]
ప్రధాన పార్టీలు ఎన్నికల్లో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేస్తున్నాయి. మండుటెండలను కూడా లెక్క చేయకుండా ఓటర్ల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతున్నారు. రోడ్షోలు, పాదయాత్రలు, సభలు నిర్వహిస్తున్నారు. -
మహానదిలో పడవ మునక: ఇద్దరి దుర్మరణం
[ 20-04-2024]
ఝార్సుగుడ జిల్లా లఖన్పూర్ సమితి ఛత్తీస్గఢ్ సరిహద్దు శారదా వద్ద శుక్రవారం సాయంత్రం మహానదిలో పడవ మునిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. -
నిప్పుల కొలిమిలా రాష్ట్రం
[ 20-04-2024]
రాష్ట్రం నిప్పులకొలిమిలా మారింది. భానుని ప్రతాపంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తీర ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటాయి. -
చాకుతో దాడి: యువకుడి హతం
[ 20-04-2024]
గంజాం జిల్లా నిమ్మఖండి ఠాణా పరిధిలోని బొరిగావ్ గ్రామంలోని అమ్మవారి మందిరం సమీపాన చెరువు ఒడ్డున గురువారం సాయంత్రం సునీల్ దాస్ (27) అనే యువకుడు, మరో యువకుడి మధ్య పాతకక్షల నేపథ్యంలో వాగ్వాదం జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు