ఉత్సాహం నింపిన ఉత్సవాలు
కటక్లో అంగరంగవైభవంగా జరుగుతున్న ఐక్యత రజతోత్సవాలు, జాతీయ సాంస్కృతికోత్సవాలు దేశంలో ఉన్న రాష్ట్రేతర తెలుగు వారిలో ఉత్సాహం నింపిందని రాతెస (రాష్ట్రేతర తెలుగు సమాఖ్య) అధ్యక్షుడు రాళ్లపల్లి సుందరరావు అన్నారు.
రా.తె.స. అధ్యక్షుడు రాళ్లపల్లి సుందరరావు
సమావేశంలో పాల్గొన్న వివిధ రాష్ట్రాల తెలుగు సంఘాల ప్రతినిధులు
కటక్, న్యూస్టుడే: కటక్లో అంగరంగవైభవంగా జరుగుతున్న ఐక్యత రజతోత్సవాలు, జాతీయ సాంస్కృతికోత్సవాలు దేశంలో ఉన్న రాష్ట్రేతర తెలుగు వారిలో ఉత్సాహం నింపిందని రాతెస (రాష్ట్రేతర తెలుగు సమాఖ్య) అధ్యక్షుడు రాళ్లపల్లి సుందరరావు అన్నారు. రజతోత్సవాల సందర్భంగా కటక్ సరళ భవన్లో ఆదివారం జరిగిన రాతెస కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాలు పరిరక్షించుకోవడం అవసరమని తెలిపారు. ఒడిశాలో కటక్ నగరంలో ఉంటూ తెలుగు భాషను కాపాండేందుకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. రాతెస కార్యదర్శి పీవీపీసీ ప్రసాద్ మాట్లాడుతూ.. ఐక్యత ఉత్సవాలు దేశవ్యాప్తంగా నివసిస్తున్న తెలుగువారి సమైక్యతకు అద్దం పట్టిందని పేర్కొన్నారు. రెండు రోజులుగా 14 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు సంఘాల ప్రతినిధులు, కళాకారులు, సాహితీవేత్తలు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఆదివారం కార్యక్రమంలో మహారాష్ట్ర, పుణె నుంచి వచ్చిన కళాకారుల కోలాటం, నృత్యాలతోపాటు కవితాగానం, హాస్య కళాకారులు ప్రదర్శనలు అలరించాయి. ఐ.సుబ్రహ్మణ్యం పంచాంగం చదివి వినిపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాటుదేలిన యోధులు... ఎవరో విజేతలు?
[ 26-04-2024]
రాజకీయాల్లో రాటుదేలిన ముగ్గురు యోధుల మధ్య బాలేశ్వర్ లోక్సభ పరిధిలో ఈసారి ఎన్నికల సంగ్రామం సాగుతోంది. -
కేకేలైన్లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
[ 26-04-2024]
కొరాపుట్ జిల్లా పాడువా సమీపంలో గురువారం సాయంత్రం గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో మూడు బోగీలు బోల్తా పడ్డాయి. -
జగన్నాథునికి సైనా పూజలు
[ 26-04-2024]
అంతర్జాతీయ బ్యాండ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ గురువారం ఉదయం శ్రీక్షేత్రంలో జగన్నాథుని సన్నిధిలో పూజలు చేశారు. -
నేటి నుంచి పెరగనున్న ఉష్ణోగ్రతలు
[ 26-04-2024]
ఇప్పటికే రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తోంది. -
నవీన్ ప్రభుత్వాన్ని గద్దె దించండి
[ 26-04-2024]
సామర్థ్యం కొరవడిన నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, అయిదేళ్లు భాజపాకు అవకాశం ఇవ్వాలని, ఒడిశాను దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోం మంత్రి అమిత్షా పిలుపునిచ్చారు. -
పనిచేయని బిజూ కార్డు.. ఆగిన శస్త్రచికిత్స
[ 26-04-2024]
బిజు కార్డు పని చేయకపోవడంతో ఎనిమిదేళ్ల బాలుడికి చేయవలసిన శస్త్రచికిత్స ఆపేశారు. గత్యంతరం లేక బాలుడిని పట్టుకొని తల్లిదండ్రులు ఇంటికి తిరిగొచ్చిన ఘటన నవరంగపూర్ జిల్లాలో జరిగింది. -
కాంగ్రెస్లో రాజీనామాలు
[ 26-04-2024]
గుణుపురం విధానసభ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్కు సమస్యలు ఎదురవుతున్నాయి. పలువురు నాయకులు ప్రాథమిక సభ్యత్వం నుంచి రాజీనామా చేసినట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బిజయకుమార్ గమాంగ్ తెలిపారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం...
[ 26-04-2024]
గజపతి జిల్లాలో మే 13వ తేదీన జరిగే ఎన్నికలకు నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. మోహన నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థులుగా రూబెన్ మండల్
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా