logo

జయపురంలో కాంగ్రెస్‌ ఆందోళన

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వ రద్దును నిరసిస్తూ జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్‌ బాహినిపతి ఆధ్వర్యంలో గాంధీ చౌక్‌ వద్ద ఆదివారం ఆందోళన చేపట్టారు.

Published : 27 Mar 2023 01:58 IST

నిరసనలో పాల్గొన్న ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షురాలు తదితర నేతలు

జయపురం, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వ రద్దును నిరసిస్తూ జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్‌ బాహినిపతి ఆధ్వర్యంలో గాంధీ చౌక్‌ వద్ద ఆదివారం ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే, పురాధ్యక్షుడు నరేంద్ర మహంతి మాస్క్‌కి తాళం వేసుకొని వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భాజపా నియంతృత్వ విధానాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదమని పలువురు నాయకులు విమర్శించారు. డీసీసీ ప్రెసిడెంట్‌ మీనాక్షీ బాహినిపతి పార్టీని బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని