logo

భార్యను గాయపరిచి భర్త ఆత్మహత్య

మయూర్‌భంజ్‌ జిల్లా రైరంగపూర్‌ సమితి చెలియాబి గ్రామంలో మంగళవారం భార్యపై దాడి చేసి తర్వాత విషం తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

Published : 30 Mar 2023 03:27 IST

గాయపడిన మినతి బెహరా, మృతి చెందిన ప్రశాంత బెహరా

కటక్‌, న్యూస్‌టుడే: మయూర్‌భంజ్‌ జిల్లా రైరంగపూర్‌ సమితి చెలియాబి గ్రామంలో మంగళవారం భార్యపై దాడి చేసి తర్వాత విషం తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ప్రశాంత బెహరా(55), మినతి బెహరా(45) దంపతుల మధ్య ఎప్పటికప్పుడే కుటుంబ కలహాలు తలెత్తేవి. మంగళవారం భార్య మినతి వంట చేస్తున్న సమయంలో ఏదో విషయమై భర్త గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఇంటిలో ఉన్న కత్తితో భార్య మెడ, చేతిపై నరికాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అరుపులు విని ఇంటి బయట ఉన్న కొడుకు వచ్చి గాయాలతో పడి ఉన్న భార్యను వెంటనే ఆసుపత్రికి తరలించాడు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు ఘటన అనంతరం ప్రశాంత్‌ బెహరా ఇంటి నుంచి పరారయ్యాడు. సాయంత్రం గ్రామ శివారులో నిర్జీవంగా కనిపించాడు. మృతదేహం వద్ద విషం సీసా లభించింది. దీంతో ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని