బడ్జెట్ రూపకల్పనలో కార్పొరేటర్లను విస్మరిస్తే ఎలా?
బ్రహ్మపుర నగరపాలక సంస్థ (బీఈఎంసీ) 2023-2024 ఆర్థిక సంవత్సరానికి రూ.601,85,30,675ల బడ్జెట్ను రూపొందించింది.
మండలి సమావేశంలో మాట్లాడుతున్న కమిషనర్ సొనాల్. చిత్రంలో మేయరు దొళాయి, ఎమ్మెల్యే బిక్రం పండా, ఉప మేయరు వివేక్ రెడ్డి ఇతర అధికారులు
బ్రహ్మపుర బజారు, న్యూస్టుడే: బ్రహ్మపుర నగరపాలక సంస్థ (బీఈఎంసీ) 2023-2024 ఆర్థిక సంవత్సరానికి రూ.601,85,30,675ల బడ్జెట్ను రూపొందించింది. దీనిపై బుధవారం సాయంత్రం బీఈఎంసీ కార్యాలయం ఆవరణలోని మండలి సమావేశ మందిరంలో మేయరు సంఘమిత్ర దొళాయి అధ్యక్షతన వార్డు కార్పొరేటర్లతో బడ్జెట్ సమావేశం జరిగింది. బీఈఎంసీ కమిషనర్ జె.సొనాల్ బడ్జెట్ ఆదాయ, వ్యయాల వివరాలను వెల్లడించారు. తొలుత 34వ వార్డు కార్పొరేటరు టి.త్రిపతి పాత్ర్ (బిజద) స్పందించారు. బడ్జెట్ రూపొందించే ముందు కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు సేకరించకుండా, అధికారులతో బడ్జెట్ తయారు చేయడం వల్ల స్థానికంగా తాము సమస్యలు ఎదుర్కొంటున్నామన్నారు. దీనికి కమిషనర్ సొనాల్, బీఈఎంసీ మేయరు దొళాయిలు స్పందిస్తూ ఇకపై జాగ్రత్తలు తీసుకుంటామని బదులిచ్చారు. మండలి సమావేశంలో మరింత మెరుగైన పారిశుద్ధ్య సేవలు, చందనియా కొండ ప్రాంతం అభివృద్ధి, నగరంలోని చెరువులు, వెండింగ్ జోన్ల అభివృద్ధి, గిరిమార్కెట్లో షాపింగ్ మాల్, డ్రైనేజీ వ్యవస్థకు మాస్టర్ ప్లాన్ తదితర అంశాలపై చర్చించారు. బ్రహ్మపుర ఎమ్మెల్యే బిక్రం కుమార్ పండా, బీఈఎంసీ ఉప మేయరు ఈ.వివేక్ రెడ్డి, ఉప కమిషనర్లు బినోద బెహర, ఆశీర్వాద్ పరిడా, బీఈడీఏ కార్యదర్శి సంబిత్ రౌత్, ఎన్ఫోర్స్మెంట్ అధికారి తరుణ్కాంత్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధికి సహకరించాలి
సమావేశంలో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు
సిమిలిగుడ, న్యూస్టుడే: వర్షాకాలం రాకముందే మురుగు కాలువలు, రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని కౌన్సిల్ సమావేశంలో తీర్మానించారు. సునాబెడ పురపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం బుధవారం ఉపాధ్యక్షురాలు రీతు కంట అధ్యక్షతన కొరాపుట్ ఎమ్మెల్యే రఘురామ్ పడాల్, పురాధ్యక్షులు రాజేంద్ర కుమార్ పాత్ర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అభివృద్ధి పనులపై సమీక్షించారు. 25 వార్డుల్లో ముక్తా పథకం సక్రమంగా అమలు చేయాలని, సిమిలిగుడ, సునాబెడ ప్రాంతాల్లోని మహానేతల విగ్రహాలకు మరమ్మతులు చేసి, సుందరంగా తీర్చిదిద్దాలని సమావేశంలో తీర్మానించారు. అభివృద్ధికి అందరూ సహకరించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధి కొనసాగుతుంది..శంక ద్వయాన్ని ఆశీర్వదించండి
[ 25-04-2024]
రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతుందని, బిజదను ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రజల్ని కోరారు. -
భాజపాకు 40 మంది స్టార్ ప్రచారకులు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాజపా స్టార్ ప్రచారకుల జాబితా మంగళవారం రాత్రి విడుదల చేశారు. -
ఇంకెన్నాళ్లీ దుస్థితి?
[ 25-04-2024]
అధ్వానంరాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలు అధ్వానంగా ఉన్నాయన్న నివేదికలు దిగజారిన ‘నాక్’ గ్రేడేషన్లు దుస్థితిని తెలియజేస్తున్నాయని కేంద్రమంత్రి నిలదీశారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో భర్తీకాని టీచింగ్ సిబ్బంది, అసౌకర్యాలు, ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల డ్రాపౌట్ల గురించి ఏం సమాధానం చెబుతారన్నారు. -
ఓ తండ్రి...ఇద్దరు కొడుకులు
[ 25-04-2024]
గత అయిదున్నర దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన నేత ఆయన. అన్ని పార్టీల నేతల మన్ననలు అందుకున్న వ్యక్తి. వయసుతోపాటు గౌరవం, నిక్కచ్చితనం పెంచుకున్న నికార్సయిన నేత. 80 ఏళ్ల వయసులో కొడుకు నిర్వాకంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
నామినేషన్ల సందడి
[ 25-04-2024]
బ్రహ్మపుర లోకసభ పరిధిలోని పర్లాఖెముండి నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిగా కోడూరు నారాయణరావు నామినేషన్ పత్రాన్ని సబ్ కలెక్టర్ అనూప్ పండాకు అందజేశారు. -
భాజపాలో సీమారాణి చేరిక
[ 25-04-2024]
బిజదకు రాజీనామా చేసిన హిందళ్ సిటింగ్ ఎమ్మెల్యే సీమారాణి నాయక్ బుధవారం భాజపాలో చేరారు. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, ఇతర నాయకులు ఆమెను స్వాగతించారు. -
నేడు అమిత్షా రాక
[ 25-04-2024]
కేంద్ర హోంమంత్రి అమిత్షా గురువారం రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. మధ్యాహ్నం సోన్పూర్లో ఏర్పాటయ్యే ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగిస్తారు. -
నా ఓటు.. నా బాధ్యత
[ 25-04-2024]
నా ఓటు నా బాధ్యత అంటూ, తప్పకుండా ఓటు వినియోగించుకుంటామని నూతన ఓటర్లు, కళాశాల విద్యార్థులన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’