నిరుపయోగంగా 97 శీతల గిడ్డంగులు: మంత్రి రాణేంద్ర
రాష్ట్రంలో 97 శీతల గిడ్డంగులు నిరుపయోగంగా ఉన్నాయని, వీటికి మరమ్మతులు చేస్తే సొమ్ము వృథా అవుతుందని వ్యవసాయ, పాడి, మత్స్యశాఖల మంత్రి రాణేంద్ర ప్రతాప్ స్వయిన్ చెప్పారు.
రాణేంద్ర ప్రతాప్ స్వయిన్, సమీర్ రంజన్ దాస్, అతాను సవ్యసాచి నాయక్
భువనేశ్వర్, న్యూస్టుడే: రాష్ట్రంలో 97 శీతల గిడ్డంగులు నిరుపయోగంగా ఉన్నాయని, వీటికి మరమ్మతులు చేస్తే సొమ్ము వృథా అవుతుందని వ్యవసాయ, పాడి, మత్స్యశాఖల మంత్రి రాణేంద్ర ప్రతాప్ స్వయిన్ చెప్పారు. బుధవారం శాసనసభా కార్యక్రమాలు ప్రారంభించిన సభాపతి బిక్రం కేసరి అరుఖ్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు. సభ్యులడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి రాణేంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం 36 శీతల గిడ్డంగులు మాత్రమే వినియోగంలో ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా వెయ్యి సౌరశక్తి చాలిత గిడ్డంగుల నిర్మాణం ధ్యేయంగా పెట్టుకున్నామన్నారు. స్వయం సహాయక మహిళా సంఘాలు (ఎస్హెచ్జీ), సహకార సంఘాలకు నిర్మాణ, నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నామని, గిడ్డంగులకు 70 శాతం రాయితీ ఇస్తామన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి రాయితీలు ఇవ్వడం లేదని, రైతుల ఉత్పత్తులు పాడవకుండా ఉండాలన్న తపనతో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సౌరచాలిత గిడ్డంగుల ఏర్పాటుకు రాయితీలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఈ ఏడాది బడ్జెట్లో ఇందుకు నిధులు కేటాయించారని తెలిపారు. అన్నదాతల ప్రయోజనాలకు కట్టుబడ్డామన్న కేంద్ర పాలకులు వారి కోసం ఏమీ చేయడం లేదని, అన్ని రాయితీల్లో కోత విధించారని మంత్రి ఆరోపించారు.
గణితంలో వెనుకంజ
సభ్యులడిగిన ప్రశ్నలకు సమాధామిచ్చిన విద్యాశాఖ మంత్రి 10వ తరగతి బాలబాలికలు గణితంలో వెనుకంజలో ఉన్నారని, సామాజిక, విజ్ఞాన శాస్త్రాల్లోనూ ప్రతిభ చూపలేకపోతున్నారని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం అన్ని ఉన్నత పాఠశాలల్లో ఇలాంటి విద్యార్థులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్లస్ టు విద్యార్థులకు కూడా ఇదే విధానం అమలు చేస్తామని, త్వరలో వేళలు నిర్ధారిస్తామని వివరించారు.
5 కిలోల కోత అన్యాయం
సభ్యులడిగిన ప్రశ్నకు ఆహార పౌరసరఫరాలశాఖ మంత్రి అతాను సవ్యసాచి నాయక్ సమాధానమిస్తూ... కొవిడ్ సమయంలో పేద కుటుంబాల్లో (బీపీఎల్) ఒక్కొక్కరికి ప్రతి నెల 10 కిలోల బియ్యం కేటాయించిన కేంద్రం ఇటీవల 5 కిలోలు కోత విధించడం అన్యాయమన్నారు. దీని ప్రభావం ధాన్యం సేకరణపై పడిందని, మిగులు సరకు కొనుగోలు చేయబోమని ఎఫ్సీఐ చెబుతోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20 లక్షల మెట్రిక్ టన్నుల మిగులు ధాన్యం కొనుగోలు ప్రశ్నార్థకమైందన్నారు. దీనిపై ముఖ్యమంత్రి నవీన్ కేంద్రానికి లేఖ రాసినా స్పందన లేదన్నారు. క్వింటాలుకు రూ.2,930లు గిట్టుబాటు ధర చేయాలని శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపినా పట్టించుకోలేదని, స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలవడం లేదని వివరించారు. మిగులు ధాన్యం సేకరించి రైతులకు న్యాయం చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామని, అన్నదాతలకు ప్రయోజనం చేకూర్చాలని విన్నవిస్తున్నామని మంత్రి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గొంతు కోసి యువకుడి దారుణ హత్య
[ 29-03-2024]
గజపతి జిల్లాలోని గుసాని సమితి గురండి ఠాణా పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. -
కాషాయం కండువాలు ధరించిన అగ్రనేతలు
[ 29-03-2024]
దిల్లీ భాజపా కార్యాలయం వేదికగా గురువారం మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో ఇద్దరు ప్రముఖ నేతలు, మరో ప్రముఖ రచయిత్రి కాషాయం కండువాలు ధరించారు. -
తోడేలు దాడిలో ఇద్దరికి గాయాలు
[ 29-03-2024]
మల్కాన్గిరి సమితి ఎమ్.వి.93 గ్రామంలో ఇద్దరిపై తోడేలు దాడి చేయడంతో, పోరాడి హతమార్చారు. ఈ క్రమంలో వీరికి తీవ్ర గాయాలయ్యాయి -
డబుల్ ఇంజిన్ పాలన తథ్యం: అపరాజిత
[ 29-03-2024]
రాష్ట్రంలో భాజపా డబుల్ ఇంజిన్ పాలన తథ్యమని, ప్రజల్లో మార్పు కనిపిస్తోందని భువనేశ్వర్ సిటింగ్ ఎంపీ అపరాజిత షడంగి చెప్పారు. -
బిజదలో అసమ్మతి సెగ
[ 29-03-2024]
ఎన్నికల ముందు అధికార పక్షం బిజదలో అసమ్మతి సెగ తగలడంతో పార్టీకి తలనొప్పిగా మారుతోంది. రాయగడ శాసనసభ నియోజకవర్గ టికెట్ అనుసూయ మాఝికి కేటాయించడంపై రెండు వర్గాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటుండడం పార్టీ శ్రేణులకు మింగుడుపడడం లేదు -
గోపాల్పూర్ ఓడరేవు కొనుగోలు చేసిన అదానీ
[ 29-03-2024]
తూర్పు తీరంలో సరకు రవాణాలో అగ్రగామిగా ఉన్న గోపాల్పూర్ ఓడరేవును ప్రముఖ పారిశ్రామిక గ్రూపు అదానీ కొనుగోలు చేసింది -
ప్రతిష్ఠాత్మక నియోజకవర్గం పోరు రసవత్తరం
[ 29-03-2024]
బిజద అభ్యర్థి బిక్రం పండాకు గోపాల్పూర్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నియోజకవర్గం ఓటర్లందరికీ చిరపరిచితులు. భంజవిహార్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఆయన తొలినాళ్లలో విద్యార్థి నేత -
ఎన్నికల బరిలో అతివలకు అవకాశం
[ 29-03-2024]
ఎన్నికల్లో మహిళా అభ్యర్థులకు అధిక ప్రాధాన్యం ఇస్తామని బిజద ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పినట్లుగా ఎన్నికల బరిలో పోటీపడేందుకు మహిళలకు అవకాశం కల్పించారు. -
‘రిడ్లీ’ల రాకకు ఎదురుచూపు
[ 29-03-2024]
విదేశీ అతిథులు ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేళ్ల రాక వల్ల గంజాం జిల్లా ఖ్యాతిగాంచింది. రాష్ట్రంలోని రిడ్లీల పునరుత్పత్తికి మూడు కేంద్రాలుండగా, వీటిలో గంజాం జిల్లాలోని రుషికుల్యా ముఖద్వారం ఒకటి. -
శ్రీక్షేత్రంలో మీనాక్షి శేషాద్రి
[ 29-03-2024]
ప్రముఖ బాలీవుడ్ (ముంబయి) నటి, నర్తకి మీనాక్షి శేషాద్రి గురువారం పూరీ వచ్చారు. శ్రీక్షేత్రంలో జగన్నాథుడి సన్నిధిలో పూజలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ