నేత్రానందం..సీతారాముల కల్యాణం
పవిత్ర శ్రీరామనవమి సందర్భంగా గురువారం గంజాం జిల్లాలోని రామాలయాల్లో రోజంతా విశేష కార్యక్రమాలు నిర్వహించారు
నేత్రానందం..సీతారాముల కల్యాణం
బ్రహ్మపుర నగరం, న్యూస్టుడే: పవిత్ర శ్రీరామనవమి సందర్భంగా గురువారం గంజాం జిల్లాలోని రామాలయాల్లో రోజంతా విశేష కార్యక్రమాలు నిర్వహించారు. బ్రహ్మపురలో గొల్లపల్లిలోని పురాతన రఘునాథ స్వామి మందిరం ఆధ్వర్యంలో మధ్యాహ్నం సీతారాముల కల్యాణం నేత్రానందంగా సాగింది. మందిరం ఆవరణలోని మండపంలో నిర్వహించిన కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఎం.రాజారావు, సంధ్య, ఎస్.స్వరూప్ దొర, సంయుక్త దంపతులు కల్యాణంలో పాల్గొన్నారు. వేద పండితులు ధర్మపురి శివప్రసాద్, వనమాలి రాజేష్, ధర్మపురి సంతోష్, ధర్మపురి వంశీ, నేరెళ్ల హరీష్ తదితరులు శాస్త్రోక్తంగా కల్యాణ ఘట్టాన్ని నిర్వహించి, దేవతామూర్తులకు ముత్యాల తలంబ్రాలు వేశారు. అంతకుముందు ఉదయం ఉత్సవమూర్తులతో రథంపై తిరువీధి మహోత్సవం నిర్వహించారు. పాత బ్రహ్మపురలోని మార్తావీధిలో కొండపై కొలువైన పురాతన రామాలయంలో రోజంతా ప్రత్యేక పూజలు, విశేష అలంకరణలు చేశారు. మధ్యాహ్నం మందిరం ఆవరణలో వందలాది మందికి అన్నప్రసాదాలు ఏర్పాటయ్యాయి. స్థానిక ఆకులవీధి, కాపువీధి, గుసానినువాగాం తదితర ప్రాంతాల్లోని రామాలయాల్లో వేడుకలు ఘనంగా చేపట్టారు.
గొల్లపల్లిలో రఘునాథ మందిరం ఆవరణలో సీతారాముల కల్యాణోత్సవంలో తాళిబొట్టు చూపుతున్న వేద పండితుడు
పూరీ తీరంలో శ్రీరాముని సైకత శిల్పం
గోపాల్పూర్, న్యూస్టుడే: సత్య, ధర్మవాక్య పాలకుడు శ్రీరామచంద్రుడు మానవాళికి ఆదర్శమూర్తి. గురువారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీ తీరంలో అవతార పురుషుని సైకత శిల్పం, అయోధ్య రామమందిరం తీర్చిదిద్దారు. ఇది సందర్శకులను విశేషంగా ఆకర్షించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాటుదేలిన యోధులు... ఎవరో విజేతలు?
[ 26-04-2024]
రాజకీయాల్లో రాటుదేలిన ముగ్గురు యోధుల మధ్య బాలేశ్వర్ లోక్సభ పరిధిలో ఈసారి ఎన్నికల సంగ్రామం సాగుతోంది. -
కేకేలైన్లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
[ 26-04-2024]
కొరాపుట్ జిల్లా పాడువా సమీపంలో గురువారం సాయంత్రం గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో మూడు బోగీలు బోల్తా పడ్డాయి. -
జగన్నాథునికి సైనా పూజలు
[ 26-04-2024]
అంతర్జాతీయ బ్యాండ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ గురువారం ఉదయం శ్రీక్షేత్రంలో జగన్నాథుని సన్నిధిలో పూజలు చేశారు. -
నేటి నుంచి పెరగనున్న ఉష్ణోగ్రతలు
[ 26-04-2024]
ఇప్పటికే రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తోంది. -
నవీన్ ప్రభుత్వాన్ని గద్దె దించండి
[ 26-04-2024]
సామర్థ్యం కొరవడిన నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, అయిదేళ్లు భాజపాకు అవకాశం ఇవ్వాలని, ఒడిశాను దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోం మంత్రి అమిత్షా పిలుపునిచ్చారు. -
పనిచేయని బిజూ కార్డు.. ఆగిన శస్త్రచికిత్స
[ 26-04-2024]
బిజు కార్డు పని చేయకపోవడంతో ఎనిమిదేళ్ల బాలుడికి చేయవలసిన శస్త్రచికిత్స ఆపేశారు. గత్యంతరం లేక బాలుడిని పట్టుకొని తల్లిదండ్రులు ఇంటికి తిరిగొచ్చిన ఘటన నవరంగపూర్ జిల్లాలో జరిగింది. -
కాంగ్రెస్లో రాజీనామాలు
[ 26-04-2024]
గుణుపురం విధానసభ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్కు సమస్యలు ఎదురవుతున్నాయి. పలువురు నాయకులు ప్రాథమిక సభ్యత్వం నుంచి రాజీనామా చేసినట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బిజయకుమార్ గమాంగ్ తెలిపారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం...
[ 26-04-2024]
గజపతి జిల్లాలో మే 13వ తేదీన జరిగే ఎన్నికలకు నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. మోహన నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థులుగా రూబెన్ మండల్
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా