logo

‘తంపర లేక్‌’కు ‘ఉత్తమ కేఫెటేరియా’ పురస్కారం

గంజాం జిల్లా కేంద్రం ఛత్రపురానికి సమీపంలోని ‘తంపర లేక్‌’ పర్యటక కేంద్రం సుందరీకరణకు కేంద్ర పర్యటక శాఖ ‘ఉత్తమ కేఫెటేరియా’ పురస్కారం అందజేసింది

Published : 31 Mar 2023 02:51 IST

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లా కేంద్రం ఛత్రపురానికి సమీపంలోని ‘తంపర లేక్‌’ పర్యటక కేంద్రం సుందరీకరణకు కేంద్ర పర్యటక శాఖ ‘ఉత్తమ కేఫెటేరియా’ పురస్కారం అందజేసింది. కేంద్ర స్వదేశీ పథకం కింద తంపర కేంద్రం ముందు భాగం అభివృద్ధి చేపట్టింది. బుధవారం కేంద్ర పర్యటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర పర్యటక శాఖ సంచాలకుడు సచిన్‌ ఆర్‌.జాదవ్‌ ఈ పురస్కారాన్ని అందుకున్నారని గంజాం కలెక్టరు కార్యాలయం అధికారిక ట్విటర్‌లో రాత్రి వెల్లడించింది. రాష్ట్ర పర్యటక శాఖ, గంజాం జిల్లా యంత్రాంగాన్ని అభినందిస్తూ ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని