పెనుగాలుల బీభత్సం
ఉత్తరకోస్తాలో గురువారం మధ్యాహ్నం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. క్యూములో నింబస్ కారుమబ్బులు కమ్ముకోవడంతోపాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలులు, వర్షాలు తీవ్ర నష్టాలు మిగిల్చాయి.
కలెక్టర్లకు నివేదికలు పంపాలన్న ఎస్ఆర్సీ
పూరీ జిల్లా పిప్పిలిలో కూలిన విద్యుత్తు స్తంభం
భువనేశ్వర్,పూరీ, ఢెంకనాల్, అనుగుల్, ఖుర్ధా, కటక్, జగత్సింగ్పూర్, కేంద్రపడ, నయాగఢ్ జిల్లాల్లో చాలాచోట్ల చెట్లు విరిగాయి. విద్యుత్తు స్తంభాలు ఒరిగిపోయి తీగలు తెగాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. 2.30 నుంచి 4.30 వరకు రాకపోకలు నిలిచిపోయాయి.
గోపాల్పూర్, న్యూస్టుడే ; ఉత్తరకోస్తాలో గురువారం మధ్యాహ్నం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. క్యూములో నింబస్ కారుమబ్బులు కమ్ముకోవడంతోపాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలులు, వర్షాలు తీవ్ర నష్టాలు మిగిల్చాయి.
గాలులు తీవ్రంగా వీచిన ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఓడ్రాఫ్, అగ్నిమాపక సిబ్బంది నేలకొరిగిన చెట్లు, కొమ్మలు యుద్ధప్రాతిపదికన తొలగిస్తున్నారు. టాటా పవర్ ఉద్యోగులు విద్యుత్తు సరఫరా పునరుద్ధరించే పనులు చేస్తున్నారు. సాయంత్రం ప్రత్యేక రిలీఫ్ కమిషనర్ (ఎస్ఆర్సీ) సత్యబ్రత సాహు పరిస్థితిని సమీక్షించారు. నష్టాల వివరాలు పరిశీలించి నివేదికలు వెంటనే సమర్పించాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
28 వరకు ప్రభావం
పిప్పిలిలో రోడ్డుపై పడిన చెట్టు
కొన్నాళ్లుగా పెరిగిన ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలకు కాలవైశాఖి వర్షాలు ఉపశమనాన్నిచ్చాయి. గోపాల్పూర్ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్ దాస్ ‘న్యూస్టుడే’తో మాట్లాడుతూ... పశ్చిమ ఒడిశా మినహాయిస్తే మిగతా చోట్ల ఉష్ణోగ్రతలు రెండు, మూడు డిగ్రీలు తగ్గాయని చెప్పారు. పశ్చిమంలో 40 నుంచి 41 డిగ్రీలుగా ఉందని, శుక్రవారం పశ్చిమ ప్రాంతాలు మినహా 21 జిల్లాలపై కాలవైశాఖి ప్రభావం చూపుతుందన్న అంచనా ఉందన్నారు. 26న కేంఝర్, మయూర్భంజ్, బాలేశ్వర్, కొరాపుట్, రాయగడ, గజపతి, గంజాం, నయాగఢ్, ఖుర్దా, భద్రక్, జాజ్పూర్, కేంద్రపడ, కటక్, జగత్సింగ్పూర్, పూరీ, ఢెంకనాల్, కొంధమాల్, కలహండి, నవరంగపూర్, బొలంగీర్, నువాపడ జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు. కొన్నిచోట్ల పిడుగుపాట్లకు అవకాశం ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ‘ఎల్లో’ హెచ్చరికలు జారీ చేశామన్నారు. ఈ నెల 28 వరకు కాలవైశాఖి రాష్ట్రంపై ప్రభావం చూపుతుందన్న అంచనా ఉందని దాస్ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటరుతో మాట...నేతల కొత్త బాట
[ 23-04-2024]
ఈ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు కీలకం. ఒకవైపు మోదీ కోసం భాజపా ఉద్యమిస్తుంటే... ఆరోసారి ముఖ్యమంత్రిగా నవీన్ను చూడాలని బిజద ప్రయత్నిస్తోంది. -
రాజకీయ ప్రత్యర్థులు ఎదురుపడిన వేళ...
[ 23-04-2024]
బ్రహ్మపురలోని గంజాం న్యాయవాదుల సంఘం (జీబీఏ) సమావేశ మందిరం ఆవరణలో సోమవారం రాజకీయ ప్రత్యర్థులు ఎదురుపడ్డారు. -
ఆరుగురితో బిజద 7వ జాబితా
[ 23-04-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోమవారం 6 అసెంబ్లీ స్థానాలకు 7వ జాబితా ప్రకటించారు. క్రీడలు, యువజన సర్వీసులశాఖ మంత్రి తుషార్కాంతి బెహరాకు, విద్యాశాఖ మంత్రి సుధాం మారాండి భార్య రంజితాకు, ఢెంకనాల్ ఎంపీ ముహేష్సాహుకు టికెట్లు కేటాయించారు. -
కేంద్రపడ బిజదలో భగ్గుమన్న అసంతృప్తి
[ 23-04-2024]
పార్టీకి విధేయులుగా ఉన్నవారిని పక్కన పెట్టి ఫిరాయింపు నేతలకు ఎన్నికల బరిలో దించడంతో కేంద్రపడ జిల్లా బిజదలో అసంతృప్తి భగ్గుమంది. -
సనాతన్ మహాకుడోకు పిలిచి టికెట్ ఇచ్చిన సీఎం
[ 23-04-2024]
గనులకు నిలయమైన కేంఝర్ జిల్లాలో అంతా కుబేరునిగా చెప్పుకునే సనాతన్ మహాకుడోకు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక చంపువా అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా చేశారు. -
బిజదలో చేరికలు.. సన్నాహక సమావేశాలు
[ 23-04-2024]
ఎన్నికల తేదీలు దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి దూకుళ్లు అధికమవుతున్నాయి. -
నవరంగపూర్లో త్రిముఖం..ఎవరిదో విజయం
[ 23-04-2024]
గత పదేళ్ల కిందటి వరకు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న నవరంగపూర్ లోక్సభ స్థానంలో క్రమేణా బిజద బలం పుంజుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో ఈ రెండు పార్టీలతోపాటు భాజపా కూడా గట్టి పోటీ ఇస్తుండడంతో త్రిముఖ పోటీ ఆసక్తికరంగా మారింది. -
గమాంగ్ దంపతుల మద్దతు ఎవరికో?
[ 23-04-2024]
రాయగడ జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్, ఆయన భార్య హేమా గమాంగ్ పేరు తెలియని వారుండరు. గిరిధర్ గమాంగ్కు సుమారు 50 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉంది. -
కార్మిక బంధువు నవీన్: పాండ్యన్
[ 23-04-2024]
అసంఘటిత రంగాల్లో పనులు చేస్తున్న కార్మికులకు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బంధువయ్యారని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని బిజద నేత వి.కార్తికేయ పాండ్యన్ చెప్పారు. -
పాదయాత్రలు.. ఇంటింటా ప్రచారాలు
[ 23-04-2024]
బ్రహ్మపుర అసెంబ్లీ నియోకవర్గంలో పోటీ చేస్తున్న వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. భాజపా అభ్యర్థి కె.అనిల్కుమార్ సోమవారం 11వ వార్డులోని వివిధ వీధుల్లో పాదయాత్రగా ఇంటింటా ఓటర్లను కలిసి ఓటు వేయాలని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM