logo

నిశీధిలో ఘోర విషాదం...!

సాయంత్రం 7 గంటల సమయం.. రైళ్లలో కొందరు స్నాక్స్‌ తింటుండగా, మరికొందరు టీ తాగుతున్నారు. ఇంకొందరు ఫోన్‌లు చూసుకుంటున్నారు.

Published : 03 Jun 2023 02:49 IST

సాయంత్రం 7 గంటల సమయం.. రైళ్లలో కొందరు స్నాక్స్‌ తింటుండగా, మరికొందరు టీ తాగుతున్నారు. ఇంకొందరు ఫోన్‌లు చూసుకుంటున్నారు. ఇంతలో రైలు బోగీలు పట్టాలు తప్పి పక్కనున్న పట్టాలపైకి దూసుకెళ్లాయి. ఈ ప్రమాదంతో అక్కడికక్కడే కొందరు ప్రాణాలు కోల్పోగా గాయపడినవారు హాహాకారాలు చేశారు. అదే సమయంలో ఆ ట్రాక్‌పై వస్తున్న    మరో రైలు ఈ బోగీలను ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత పెరిగిపోయింది. ధ్వంసమైన బోగీలు, తీవ్ర గాయాలతో ప్రయాణికులు, చుట్టూ అంధకారం చనిపోయి పడి ఉన్న మృతదేహాలతో వాతావరణం భీతావహంగా మారిపోయింది. అప్పటి వరకు తమతో మాట్లాడినవారు, తమవారు ఏమైపోయారో తెలియక ఏడుస్తూ వెతకడం ప్రారంభించారు. కళ్లు పొడుచుకున్నా కనిపించని  చిమ్మ చీకట్లో ఏం జరిగిందో తెలియక కేకలు పెట్టారు. శుక్రవారం బాలేశ్వర్‌ జిల్లాలో  బహనాగ గ్రామం వద్ద జరిగిన  రైలు ప్రమాదంలో సంఘటన స్థలంలో  దృశ్యాలివి.

న్యూస్‌టుడే, కటక్‌

 

సంఘటనా స్థలంలో మృతదేహాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని