నాటు పడవలు బోల్తా : ఒకరి మృతి.. మరొకరి గల్లంతు
మల్కాన్గిరి ప్రాంతంలో గురువారం సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఆ సమయంలో సతిగుడ జలాశయంలో రెండు నాటు పడవలు మునిగి ఇద్దరు మత్స్యకారులు గల్లంతు కాగా వారిలో ఒకరు విగతజీవిగా తేలాడు..
సతిగుడ జలాశయం వద్ద గుమిగూడిన ప్రజలు
మల్కాన్గిరి, న్యూస్టుడే: మల్కాన్గిరి ప్రాంతంలో గురువారం సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఆ సమయంలో సతిగుడ జలాశయంలో రెండు నాటు పడవలు మునిగి ఇద్దరు మత్స్యకారులు గల్లంతు కాగా వారిలో ఒకరు విగతజీవిగా తేలాడు.. వివరాల్లోకి వెళ్తే.. సాయంత్రం మల్కాన్గిరి సమితి భీమారంగిణి గ్రామానికి చెందిన తులసాముడి(35), ఎం.వి.111 గ్రామానికి చెందిన గోవింద సర్దార్ వేర్వేరు పడవల్లో చేపల వేటకు జలాశయంలోకి వెళ్లారు. పెనుగాలులతో పాటు వర్షం కురవడంతో రెండు పడవలు అదుపు తప్పి నీటిలో మునిగి పోయాయి. దీన్ని స్థానికులు గమనించి గాలించినా ఫలితం లేకపోయింది. ఈ విషయం తెలిసి సింధ్రిముల సర్పంచి ఘనీ నాయక్ అక్కడికి చేరుకొని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. అప్పటికే చీకటి పడడంతో శుక్రవారం ఉదయం అగ్నిమాపక సిబ్బంది జలాశయంలో గాలింపు ప్రారంభించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో విగతజీవిగా తేలిన తులసా మాఝిను వెలికితీశారు. ఇతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇంకా గోవింద సర్దార్ జాడ దొరక్కపోవడంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Bennu: నాసా ఘనత.. భూమి మీదికి గ్రహశకలం నమూనాలు!
-
Canada MP: ‘కెనడా హిందువుల్లో భయం’.. ట్రూడోపై సొంతపార్టీ ఎంపీ ఆర్య విమర్శలు..!
-
‘NEET PG అర్హత మార్కులు.. వారికోసమే తగ్గించారా?’: కాంగ్రెస్
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
TTD: వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. చంద్రప్రభ వాహనంపై శ్రీనివాసుడు
-
Chandrababu Arrest: అమీర్పేటలో చంద్రబాబుకు మద్దతుగా భారీ ర్యాలీ