నేడు చతుర్థామూర్తుల స్నానవేడుక
జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల (చతుర్థామూర్తులు) స్నానవేడుక, జ్యేష్ఠ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం పూరీ శ్రీక్షేత్రం దేవస్నాన మండపం వేదికగా జరగనున్న ఈ యాత్ర విశిష్టమైనది.
పూరీ శ్రీక్షేత్రంలో ఏర్పాట్లు
నిర్ణీత వేళల్లో సేవలు... గట్టి బందోబస్తు
చతుర్థామూర్తుల జలాభిషేకం
గోపాలపూర్, న్యూస్టుడే: జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల (చతుర్థామూర్తులు) స్నానవేడుక, జ్యేష్ఠ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం పూరీ శ్రీక్షేత్రం దేవస్నాన మండపం వేదికగా జరగనున్న ఈ యాత్ర విశిష్టమైనది. ఏడాదికోసారి భక్తుల సమక్షంలో చతుర్థామూర్తులకు 108 కలశాల జలాభిషేకం ఉత్సవం తిలకించడానికి భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
స్వామి లీలలు అనంతం: జగన్నాథుని లీలలు అనంతం. వేడుకలంటే ఆ స్వామికి మహాప్రీతి. పూరీ శ్రీక్షేత్రం వేదికగా 12 నెలల్లో 13 యాత్రలు, ఇతర ఉత్సవాలు జరుగుతాయి. అందుకే పురుషోత్తమ సన్నిధిని ‘వైకుంఠపురి’గా భక్తులు అభివర్ణిస్తారు. స్వామి సన్నిధిలో జరిగే ప్రతి ఉత్సవం వెనక అర్థం, పరమార్థం, మానవ కళ్యాణం, దివ్యసందేశం ఉంటుంది. ఏ పని తలపెట్టినా, చేసినా త్రికరణ శుద్ధి ఉండాలని, శ్రీక్షేత్ర ఆస్థాన పురాణంలో లిఖితమైఉంది. స్వామి దేవస్నానం విషయానికొస్తే... నిత్యం శ్రీక్షేత్రంలోని రత్నసింహాసనంపై చతుర్థామూర్తులకు సేవాయత్లు స్నానం చేయిస్తారు. అలంకరణ చేసే సమయంలో ఎదురుగా అద్దం ఉంచుతారు. శృంగార ప్రియుడైన స్వామి తన శింగారం అద్దంలో తిలకించి పారవశ్యానికి గురవుతాడని భక్తుల నమ్మకం. అంతర శుద్ధి, బాహ్యశుద్ధి, స్థల శుద్ధి.. ఈ మూడు అంతమందికీ వర్తిస్తాయి. దీన్ని ప్రత్యక్షంగా జ్యేష్ఠ పౌర్ణమినాడు పురుషోత్తముడు తన భక్తులకు చూపిస్తాడు. వారి సమక్షంలో జలాభిషేకం చేయించుకుంటాడు. రమణీయం, కమనీయం, నేత్రపర్వం ఈ ఉత్సవం.
గజానన రూపంలో దివ్యదర్శనం: జగన్నాథుని స్నానవేడుక తర్వాత స్వామికి గజానన (వినాయక) అవతారంలో భక్తులు చూడగలుగుతారు. ఏడాదికోసారి ఈ దివ్య మంగళ రూప దర్శనం స్నానమండపంపై ఏర్పాటవుతుంది. పురుషోత్తమునికి వినాయకుని రూపంలో తిలకించడం శుభకరం, ఫలప్రదమని భక్తులంటారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ముగ్గురు మూర్తుల అలంకరణ జరుగుతుంది. 3 గంటల నుంచి స్వామిని గజానన రూపంలో అంతా దర్శనాలు చేసుకోగలుగుతారు. రాత్రి 9 తర్వాత ‘ఒనొసోనో’ (చీకటి) మందిరం పొహండి జరగనుంది. స్వామి సేవలు, వేడుకలన్నీ నిర్ణీత వేళల్లో జరిగేలా శ్రీక్షేత్ర యంత్రాంగం చర్యలు చేపట్టింది.
పొహండి: దేవస్నానాన్ని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి 10 నుంచి శనివారం మధ్యాహ్నం 12 వరకు జగన్నాథ దర్శనాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవధిలో సేవాయత్లు ఆదివారం చేపట్టే వేడుకల ముందుగా గోప్యసేవలన్నీ పూర్తి చేశారు. జగన్నాథ, బలభద్ర, సుభద్రల దేవస్నాన పొహండిలో కీలకమైనది సేనాపటసేవ. గర్భగుడి నుంచి వెలుపలకు (స్నాన మండపానికి) తేవడానికి ఈ సేవ చేపడతారు. ఇందుకు సేవాయత్లు ఏర్పాట్లు చేశారు. శనివారం రాత్రి నిర్ణీత వేళల్లో అన్ని కార్యక్రమాలు చేపట్టిన వారంతా ఆదివారం ఉదయం 6 గంటల కల్లా చతుర్థామూర్తులను స్నాన మండపానికి పొహండిగా తెస్తారు. 9 కల్లా జలాభిషేకం జరుగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
[ 25-04-2024]
ఒడిశాలో కోరాపుట్ జిల్లా పాడువా సమీపంలో గురువారం సాయంత్రం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. -
అభివృద్ధి కొనసాగుతుంది..శంక ద్వయాన్ని ఆశీర్వదించండి
[ 25-04-2024]
రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతుందని, బిజదను ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రజల్ని కోరారు. -
భాజపాకు 40 మంది స్టార్ ప్రచారకులు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాజపా స్టార్ ప్రచారకుల జాబితా మంగళవారం రాత్రి విడుదల చేశారు. -
ఇంకెన్నాళ్లీ దుస్థితి?
[ 25-04-2024]
అధ్వానంరాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలు అధ్వానంగా ఉన్నాయన్న నివేదికలు దిగజారిన ‘నాక్’ గ్రేడేషన్లు దుస్థితిని తెలియజేస్తున్నాయని కేంద్రమంత్రి నిలదీశారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో భర్తీకాని టీచింగ్ సిబ్బంది, అసౌకర్యాలు, ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల డ్రాపౌట్ల గురించి ఏం సమాధానం చెబుతారన్నారు. -
ఓ తండ్రి...ఇద్దరు కొడుకులు
[ 25-04-2024]
గత అయిదున్నర దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన నేత ఆయన. అన్ని పార్టీల నేతల మన్ననలు అందుకున్న వ్యక్తి. వయసుతోపాటు గౌరవం, నిక్కచ్చితనం పెంచుకున్న నికార్సయిన నేత. 80 ఏళ్ల వయసులో కొడుకు నిర్వాకంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
నామినేషన్ల సందడి
[ 25-04-2024]
బ్రహ్మపుర లోకసభ పరిధిలోని పర్లాఖెముండి నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిగా కోడూరు నారాయణరావు నామినేషన్ పత్రాన్ని సబ్ కలెక్టర్ అనూప్ పండాకు అందజేశారు. -
భాజపాలో సీమారాణి చేరిక
[ 25-04-2024]
బిజదకు రాజీనామా చేసిన హిందళ్ సిటింగ్ ఎమ్మెల్యే సీమారాణి నాయక్ బుధవారం భాజపాలో చేరారు. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, ఇతర నాయకులు ఆమెను స్వాగతించారు. -
నేడు అమిత్షా రాక
[ 25-04-2024]
కేంద్ర హోంమంత్రి అమిత్షా గురువారం రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. మధ్యాహ్నం సోన్పూర్లో ఏర్పాటయ్యే ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగిస్తారు. -
నా ఓటు.. నా బాధ్యత
[ 25-04-2024]
నా ఓటు నా బాధ్యత అంటూ, తప్పకుండా ఓటు వినియోగించుకుంటామని నూతన ఓటర్లు, కళాశాల విద్యార్థులన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ