మారణాయుధాలు స్వాధీనం: ఆరుగురి అరెస్టు
నువాపడ జిల్లా ధరమ్బంధ ఠాణా పరిధిలోని అమనర గ్రామంలో ఇటీవల కలకలం రేపిన ఘటనలో దోపిడీ ముఠా సభ్యుల్ని 48 గంటల్లో పట్టుకోవడంలో పోలీసులు విజయం సాధించారు. ఆరుగుర్ని అరెస్టు చేసి శనివారం న్యాయస్థానానికి తరలించారు.
విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ రెడ్డి రాఘవేంద్ర గుండాల
బ్రహ్మపుర నగరం, న్యూస్టుడే: నువాపడ జిల్లా ధరమ్బంధ ఠాణా పరిధిలోని అమనర గ్రామంలో ఇటీవల కలకలం రేపిన ఘటనలో దోపిడీ ముఠా సభ్యుల్ని 48 గంటల్లో పట్టుకోవడంలో పోలీసులు విజయం సాధించారు. ఆరుగుర్ని అరెస్టు చేసి శనివారం న్యాయస్థానానికి తరలించారు. నిందితుల నుంచి రెండు కత్తులు, ఓ చాకు, ద్విచక్ర వాహనం, ఆరు మొబైల్ ఫోన్లు, హాక్స్సా బ్లేడు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. శనివారం నువాపడ ఠాణాలో జరిగిన విలేకరుల సమావేశంలో నువాపడ ఎస్పీ రెడ్డి రాఘవేంద్ర గుండాల ఆ వివరాలు తెలిపారు. బుధవారం వేకువన (మే 31వ తేదీ) సుమారు 3 గంటల సమయంలో అమనర గ్రామంలోని మోతిన్ బాల సాహు ఇంటి గ్రిల్ గేటు విరిచి నలుగురైదుగురు దుండగులు బలవంతంగా లోనికి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న సాహును వారు కత్తితో బెదిరించి లాల్ సలామ్ అంటూ రెండు ప్యాకెట్ల బియ్యం, ఒక నూనె డబ్బా ఇవ్వాలని అడిగారు. అదే సమయంలో ఆమె కుమారులు రావడంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. కలకలం రేపిన ఈ ఘటనపై ఎస్పీ రాఘవేంద్ర పర్యవేక్షణలో నువాపడ ఎస్డీపీఓ పి.కె.పట్నాయక్, ధరమ్బంధ, జంక్, లఖన, నువాపడ ఠాణాల అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. ఖలరి, రాయ్పూర్, బఘబహర తదితర చోట్ల దాడులు జరిపిన పోలీసు బృందం నిందితుల్ని అరెస్టు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాటుదేలిన యోధులు... ఎవరో విజేతలు?
[ 26-04-2024]
రాజకీయాల్లో రాటుదేలిన ముగ్గురు యోధుల మధ్య బాలేశ్వర్ లోక్సభ పరిధిలో ఈసారి ఎన్నికల సంగ్రామం సాగుతోంది. -
కేకేలైన్లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
[ 26-04-2024]
కొరాపుట్ జిల్లా పాడువా సమీపంలో గురువారం సాయంత్రం గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో మూడు బోగీలు బోల్తా పడ్డాయి. -
జగన్నాథునికి సైనా పూజలు
[ 26-04-2024]
అంతర్జాతీయ బ్యాండ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ గురువారం ఉదయం శ్రీక్షేత్రంలో జగన్నాథుని సన్నిధిలో పూజలు చేశారు. -
నేటి నుంచి పెరగనున్న ఉష్ణోగ్రతలు
[ 26-04-2024]
ఇప్పటికే రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తోంది. -
నవీన్ ప్రభుత్వాన్ని గద్దె దించండి
[ 26-04-2024]
సామర్థ్యం కొరవడిన నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, అయిదేళ్లు భాజపాకు అవకాశం ఇవ్వాలని, ఒడిశాను దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోం మంత్రి అమిత్షా పిలుపునిచ్చారు. -
పనిచేయని బిజూ కార్డు.. ఆగిన శస్త్రచికిత్స
[ 26-04-2024]
బిజు కార్డు పని చేయకపోవడంతో ఎనిమిదేళ్ల బాలుడికి చేయవలసిన శస్త్రచికిత్స ఆపేశారు. గత్యంతరం లేక బాలుడిని పట్టుకొని తల్లిదండ్రులు ఇంటికి తిరిగొచ్చిన ఘటన నవరంగపూర్ జిల్లాలో జరిగింది. -
కాంగ్రెస్లో రాజీనామాలు
[ 26-04-2024]
గుణుపురం విధానసభ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్కు సమస్యలు ఎదురవుతున్నాయి. పలువురు నాయకులు ప్రాథమిక సభ్యత్వం నుంచి రాజీనామా చేసినట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బిజయకుమార్ గమాంగ్ తెలిపారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం...
[ 26-04-2024]
గజపతి జిల్లాలో మే 13వ తేదీన జరిగే ఎన్నికలకు నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. మోహన నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థులుగా రూబెన్ మండల్
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా