మానవత సంస్థ ఔదార్యం
ప్రజాసేవ కోసం స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని మంగళపాలెంలోని శ్రీగురుదేవ ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ రాపర్తి జగదీష్బాబు పేర్కొన్నారు. ప్రజలకు సేవలు అందించేందుకు మానవత సంస్థ
కొత్తవలస, న్యూస్టుడే: ప్రజాసేవ కోసం స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని మంగళపాలెంలోని శ్రీగురుదేవ ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ రాపర్తి జగదీష్బాబు పేర్కొన్నారు. ప్రజలకు సేవలు అందించేందుకు మానవత సంస్థ రూ.10 లక్షల విలువచేసే అంతిమయాత్ర శాంతి రథం, రెండు ఫ్రీజర్ బాక్సులను ఆయన శుక్రవారం ప్రారంభించారు. సంస్థ జిల్లాల అభివృద్ధి కమిటీ ఛైర్మన్ సాగిరాజు జానకిరామరాజు, వ్యవస్థాపకుడు ఎన్.రామచంద్రారెడ్డి, శాంతి రథం దాత ఆచార్య ఆర్.వి.సుబ్బరాజు, గౌరవాధ్యక్షుడు మురళీకృష్ణ, క్షత్రియ సంక్షేమ సమితి పూర్వ అధ్యక్షుడు రాజు, జిల్లాల అభివృద్ధి కమిటీ సభ్యులు రాధాకృష్ణమూర్తి, కోశాధికారి కృష్ణారావు(పశ్చిమగోదావరి జిల్లా), కడప జిల్లా అధ్యక్షుడు ఎ.రామాంజనేయరెడ్డి, డైరెక్టర్ వి.జానకిరామరాజు తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.